అన్వేషించండి

Amaravati : ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణంపై తీర్పు రిజర్వ్ - శంకుస్థాపనకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం !

ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయింది. 24న శంకస్థాపనలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


Amaravati :  ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో రైతలు, ప్రభుత్వం తరపున  వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.  ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు లాయర్లు.. పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? అంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది.  తాము ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామంటూ పిటిషన్‍లోనే పేర్కొన్నామన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టు వివరించారు.. ఇళ్ల నిర్మాణంపై తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రజాధనం వృధా అవుతుంది కదా? అని వ్యాఖ్యానించింది హైకోర్టు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై దాఖలైన రిట్‌ పిటిషన్లపై ఈ నెల 17న విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు.. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు యు.దుర్గాప్రసాద్, వి.జ్యోతిర్మయిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.. అనంతరం తదుపరి విచారణ చేపట్టేందుకు కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది.

గత విచారణలో రైతుల తరపున లాయర్‌ ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. భూమి బదలాయింపు సీఆర్డీయే కు పూర్తిగా జరగలేదన్నారు. అనుబంధ ఒప్పందంలో ఎవరికి ఏ భూమి అనేది ఇంకా తేలలేదని, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తేనే.. ఒప్పందం పూర్తవుతుందని లాయర్‌ మురళీధర్ కోర్టుకు తెలిపారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు చేయలేదని.. దీనివల్లే భూమిపై సీఆర్డీయేకు హక్కులు లేవని లాయర్‌ మురళీధర్ హైకోర్టుకు తెలిపారు..సుప్రీం కోర్టు ఇప్పటికే ప్లాట్లు పంపిణీ చేయవచ్చని చెప్పింది కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు  ప్లాట్‌లు పంపిణీ చేయమని చెప్పింది కానీ.. గృహనిర్మాణం చేయాలని చెప్పలేదని లాయర్‌ మురళీధర్ సమాధానం ఇచ్చారు. తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. ఇళ్లపై పెట్టిన రూ.2 వేల కోట్లు దుర్వినియోగమైనట్టే కదా అని వాదనలు వినిపించారు. ఈ నెల 24న ఇళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మురళీధర్ కోర్టుకు తెలిపారు. ఆరోజు ఏం జరుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ రోజు నుంచే పనులు ప్రారంభమవుతాయని న్యాయవాదులు చెప్పారు.  

మరో వైపు   అమరావతి ఆర్‌-5 జోన్‌ పరిధిలో గృహనిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల కారణంగా లేఅవుట్లలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ప్లాట్ల మంజూరు చేసేనాటికే మెరక, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు.  ఈ జోన్‌లో గృహ నిర్మాణానికి ఈనెల 24వ తేదీన సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి లాంఛనంగా భూమిపూజ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ పర్యవేక్షిస్తున్నారు.

 కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలలోని 53,216 మంది పేదలకు ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటంతో పాటు స్థిర నివాసాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు  రూ.72.06 కోట్లతో సోషల్‌ ఇన్ఫా ప్రాజెక్టులకు 25 లేఅవుట్ల చెంత నైబర్హుడ్‌ స్కూల్స్‌, ఈ హెల్త్‌ సెంటర్లు, అంగన్‌ వాడీ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 25 లే అవుట్లలో ఏఎస్‌ఎస్సీసీఎల్‌ 45 ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలు ఇలా ఉన్నాయి. నైబర్‌ హుడ్‌ స్కూల్స్‌ రూ. 25 కోట్ల అంచనా వ్యయంతో 11 ఏర్పాటు కానున్నాయి.  12 ఈ-హెల్త్‌ సెంటర్లను రూ.20 కోట్లతో చేపట్టనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Election 2024 Polling Percentage: ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
Telangana Elections 2024 ends: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
AP Election 2024 Polling Percentage: ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు
ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul Casts His Vote | విశాఖలో ఓటు హక్కు వినియోగించుకున్న కేఏ పాల్ | ABP DesamTenali MLA Annabathuni Siva Slap Video | ఓటర్ ను కొట్టిన అన్నా బత్తుని శివ కుమార్..! | ABP DesamStone Fight Between YSRCP TDP in Tadipatri | తాడిపత్రిలో రాళ్లతో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు | ABP DesamMadhavi latha Ask Muslim Women to Prove Identity | ముస్లిం మహిళలను బుర్ఖా తీయాలన్న మాధవీలత | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Election 2024 Polling Percentage: ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
Telangana Elections 2024 ends: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
AP Election 2024 Polling Percentage: ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు
ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు
Tender vote : సర్కారు సినిమాలో విజయ్‌ లెక్క ఓటు వేసిన మహిళ- మీ ఓటు లేకపోతే ఇలా చేయొచ్చు !
సర్కారు సినిమాలో విజయ్‌ లెక్క ఓటు వేసిన మహిళ- మీ ఓటు లేకపోతే ఇలా చేయొచ్చు !
TS Election 2024 Voting updates: తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాలు
తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు
Lok Sabha election 2024 Phase 4 Voting Live: దేశవ్యాప్తంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్ - అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రాలివే!
దేశవ్యాప్తంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్ - అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రాలివే!
Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
Embed widget