అన్వేషించండి

AP Green Tax: హరిత పన్ను రూ.200 నుంచి రూ.20 వేలకు పెంపు... సర్కారు నిర్ణయంపై లారీ యజమానుల ఆందోళన... సీఎం జగన్ కు లేఖ

హ‌రిత ప‌న్ను పెంపుతో ర‌వాణా రంగం మ‌రింత సంక్షోభంలోని వెళ్తోందని లారీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. హరిత పన్నును రూ. 20 వేలకు పెంచడం సబబు కాదన్నారు. ప‌న్ను పెంపుతో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నామన్నారు.

రాష్ట్రంలో హ‌రిత ప‌న్నును ఏపీ స‌ర్కారు రూ.20 వేల‌కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లారీ య‌జ‌మానులు బెంబేలెత్తిపోతున్నారు. లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ హాల్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యద‌ర్శి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నేప‌థ్యంలో ర‌వాణా ప‌రిశ్రమ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంద‌న్నారు. మార్కెట్ ఆర్థిక మంద‌గ‌మ‌నంతో రోజువారి ఖ‌ర్చులు కూడా పెట్టలేని ప‌రిస్థితి ఏర్పడింద‌ని తెలిపారు. కిస్తీలు క‌ట్టక‌పోవ‌డంతో ఫైనాన్స్ కంపెనీలు లారీల‌ను తీసుకువెళ్లిపోతుండ‌డంతో లారీ య‌జ‌మానులు, క్లీనర్లు ప‌నులు లేక అల్లాడుతున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి 200 రూపాయ‌లు ఉన్న గ్రీన్ టాక్స్‌ను కేట‌గిరీల వారీగా 20 వేల రూపాయ‌ల వ‌ర‌కు పెంచ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ ప్రతిపాద‌న‌ను విర‌మించుకోవాల‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డికి లేఖ రాసి ర‌వాణాశాఖ మంత్రి పేర్ని నానికి అంద‌జేశామ‌ని వివ‌రించారు. దీనికితోడు రాష్ట్రంలో రోడ్ల ప‌రిస్థితి అధ్వానంగా ఉండ‌డంతో నిర్వహ‌ణ వ్యయం అధిక‌మ‌వుతుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మ‌ర‌మ్మతులకు త‌క్షణ చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ త‌గ్గించాల‌ని దీనివ‌ల్ల ప్రభుత్వ ఆదాయం త‌గ్గద‌ని మంత్రికి తెలియ‌జేశామ‌ని ఈశ్వర‌రావు తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also Read: విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం... తరగతుల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు కీలక వ్యాఖ్యలు

హరితపన్ను వసూలు నిలిపివేయండి

కోవిడ్‌తో నష్టాల్లో ఉన్న సమయంలో హరితపన్ను పెంచడం సరికాదని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఎం జగన్‌కు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ లేఖ రాసింది. కోవిడ్‌ కారణంగా రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లారీ యజమానులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర మందగమనం వల్ల రోజు వారీ ఖర్చులకు కూడా కష్టమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరితపన్ను భారీగా పెంచిందని ఆవేదన చెందుతున్నారు. హరిత పన్ను రూ.200 నుంచి రూ.20 వేల వరకు పెంచడం లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హరితపన్ను వసూలును నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సరిహద్దు రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉన్నాయని లారీ యజమానులు లేఖలో తెలిపారు. 

Also Read: ఏపీలో కరోనా విజృంభణ... కొత్తగా 4108 కోవిడ్ కేసులు... 30 వేలు దాటిన యాక్టివ్ కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
Breaking News: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు- వారానికి ఒకరోజు నో వెహికల్ డే .. ప్రధాని పిలుపుతో పొదుపు మంత్రం!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు- వారానికి ఒకరోజు నో వెహికల్ డే .. ప్రధాని పిలుపుతో పొదుపు మంత్రం!
Voter ID Cleanup : SIR వచ్చేసింది - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లూ.. ఇక జాగ్రత్త పడండి !
SIR వచ్చేసింది - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లూ.. ఇక జాగ్రత్త పడండి !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Spy Thrillers OTT : న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
Breaking News: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
Mamata Banerjee: సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
Suriya Hit Movies On OTT: సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
Tamil Nadu Sofa Model: తమిళనాడులో పుష్ప సోఫా మోడల్ ఇప్పుడు వైరల్ - విజయ్ అంత పని చేశారా?
తమిళనాడులో పుష్ప సోఫా మోడల్ ఇప్పుడు వైరల్ - విజయ్ అంత పని చేశారా?
AP Ration Card eKYC: ఆంధ్రప్రదేశ్‌ రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్! వెంటనే ఈకేవైసీ పూర్తి చేయకుంటే కార్డు రద్దయ్యే ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్‌ రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్! వెంటనే ఈకేవైసీ పూర్తి చేయకుంటే కార్డు రద్దయ్యే ప్రమాదం!
Embed widget