అన్వేషించండి

AP Green Tax: హరిత పన్ను రూ.200 నుంచి రూ.20 వేలకు పెంపు... సర్కారు నిర్ణయంపై లారీ యజమానుల ఆందోళన... సీఎం జగన్ కు లేఖ

హ‌రిత ప‌న్ను పెంపుతో ర‌వాణా రంగం మ‌రింత సంక్షోభంలోని వెళ్తోందని లారీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. హరిత పన్నును రూ. 20 వేలకు పెంచడం సబబు కాదన్నారు. ప‌న్ను పెంపుతో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నామన్నారు.

రాష్ట్రంలో హ‌రిత ప‌న్నును ఏపీ స‌ర్కారు రూ.20 వేల‌కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లారీ య‌జ‌మానులు బెంబేలెత్తిపోతున్నారు. లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ హాల్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యద‌ర్శి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నేప‌థ్యంలో ర‌వాణా ప‌రిశ్రమ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంద‌న్నారు. మార్కెట్ ఆర్థిక మంద‌గ‌మ‌నంతో రోజువారి ఖ‌ర్చులు కూడా పెట్టలేని ప‌రిస్థితి ఏర్పడింద‌ని తెలిపారు. కిస్తీలు క‌ట్టక‌పోవ‌డంతో ఫైనాన్స్ కంపెనీలు లారీల‌ను తీసుకువెళ్లిపోతుండ‌డంతో లారీ య‌జ‌మానులు, క్లీనర్లు ప‌నులు లేక అల్లాడుతున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి 200 రూపాయ‌లు ఉన్న గ్రీన్ టాక్స్‌ను కేట‌గిరీల వారీగా 20 వేల రూపాయ‌ల వ‌ర‌కు పెంచ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ ప్రతిపాద‌న‌ను విర‌మించుకోవాల‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డికి లేఖ రాసి ర‌వాణాశాఖ మంత్రి పేర్ని నానికి అంద‌జేశామ‌ని వివ‌రించారు. దీనికితోడు రాష్ట్రంలో రోడ్ల ప‌రిస్థితి అధ్వానంగా ఉండ‌డంతో నిర్వహ‌ణ వ్యయం అధిక‌మ‌వుతుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మ‌ర‌మ్మతులకు త‌క్షణ చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ త‌గ్గించాల‌ని దీనివ‌ల్ల ప్రభుత్వ ఆదాయం త‌గ్గద‌ని మంత్రికి తెలియ‌జేశామ‌ని ఈశ్వర‌రావు తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also Read: విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం... తరగతుల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు కీలక వ్యాఖ్యలు

హరితపన్ను వసూలు నిలిపివేయండి

కోవిడ్‌తో నష్టాల్లో ఉన్న సమయంలో హరితపన్ను పెంచడం సరికాదని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఎం జగన్‌కు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ లేఖ రాసింది. కోవిడ్‌ కారణంగా రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లారీ యజమానులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర మందగమనం వల్ల రోజు వారీ ఖర్చులకు కూడా కష్టమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరితపన్ను భారీగా పెంచిందని ఆవేదన చెందుతున్నారు. హరిత పన్ను రూ.200 నుంచి రూ.20 వేల వరకు పెంచడం లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హరితపన్ను వసూలును నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సరిహద్దు రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉన్నాయని లారీ యజమానులు లేఖలో తెలిపారు. 

Also Read: ఏపీలో కరోనా విజృంభణ... కొత్తగా 4108 కోవిడ్ కేసులు... 30 వేలు దాటిన యాక్టివ్ కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget