అన్వేషించండి

CPS Protest : సీపీఎస్ రద్దుపై తగ్గేదే లేదంటున్న ఉద్యోగులు, కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన

CPS Protest : సీపీఎస్ రద్దుపై ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. ఈ నెల 11న విజయవాడలో నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనకు సన్నాహకంగా రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

CPS Protest :  ఏపీ ఉద్యోగులు తగ్గేదేలేదంటున్నారు. ఈనెల 11న విజయవాడలో తలపెట్టిన శాంతియుత నిరసనకు సన్నాహకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీపీఎస్ రద్దుకోసం డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దుచేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. అప్పట్లో సీఎం జగన్ హామీని నమ్మితామంతా ఓట్లు వేశామని, మూడేళ్లవుతున్నా ఇప్పటికీ సీపీఎస్ రద్దు చేయకపోగా జీపీఎస్ అంటూ తెస్తున్న కొత్త విధానాన్ని ఒప్పుకోబోమన్నారు ఉద్యోగులు. వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, వారికి అన్నివిధాల ఆయన మేలు చేకూర్చారని, జగన్ కూడా అదే బాటలో నడవాలని హితవు పలికారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ప్రదర్శన చేపట్టి, ఏపీజేఏసీ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకోసం నినాదాలు చేశారు. 

కడపలో 

ఉద్యోగికి సామాజిక భద్రత లేని సీపీఎస్ ను తక్షణం రద్దు చేయాలంటూ  కడప కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీపీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కాలయాపన చేయడం ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు. తక్షణం సీపీఎస్ రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అర్హులైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. వీటి పరిష్కారం కోసం ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని హెచ్చరించారు. 

11న చలో విజయవాడ

సెప్టెంబర్‌ 1న జరగాల్సిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు వాయిదా వేసుకున్నారు. దీన్ని సెప్టెంబర్‌ 11న నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చినట్టుగానే సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు.  ప్రభుత్వం మాత్రం సీపీఎస్ రద్దు కుదరదని... అప్పట్లో తెలియకుండానే ఈ హామీ ఇచ్చామని... ఇది రద్దు చేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటోంది. దీనికి బదులు ఉద్యోగులకు ఫలప్రదమైన జీపీఎస్‌ ఇస్తామంటూ చర్చలు జరుపుతోంది. 

అసంతృప్తితో ఉద్యోగులు 

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం చర్యను తప్పుపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని ఆక్షేపిస్తున్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా చలో విజయవాడ  పిలుపునిచ్చింది ఏపీసీపీఎస్‌ఈఏ. పదిహేను రోజుల క్రితం సమావేశమైన ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగులు చలో విజయవాడ సెప్టెంబర్‌ 1న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఈ లోపు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మిలినియం మార్చ్‌ పిలుపుతో కొన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ తర్వాత చలో విజయవాడను సెప్టెంబర్ 11కు వాయిదా వేశాయి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు.  

Also Read: కుప్పం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు- ఎమ్మెల్సీ పీఏ తలకు గాయం

Also Read : BJP Janasena : జనసేనను పరిగణనలోకి తీసుకోని బీజేపీ పెద్దలు ! మిత్రుల మధ్య దూరం పెరిగిందా ? 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget