అన్వేషించండి

AP PRC: ఫిట్మెంట్ 23 శాతమే మంత్రుల కమిటీ స్పష్టం-హెచ్ఆర్ఏ శ్లాబుల కొత్త ప్రతిపాదనలు ఇవే

ఉద్యోగ సంఘ నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతోంది. కొత్త హెచ్ఆర్ఏ శ్లాబులు, పీఆర్సీ ఫిట్మెంట్ పై మంత్రుల కమిటీ ఉద్యోగుల సంఘాలకు స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల్లో ఉన్న అంతృప్తి, ఆవేదనను పరిష్కరించామని తెలిపింది.

సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. హెచ్ఆర్ఏ శ్లాబుల విషయమై కొత్త ప్రతిపాదనలను మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘ నేతల ముందు ఉంచింది. 
హెచ్ఆర్ఏ శ్లాబుల కొత్త ప్రతిపాదనలు

  • 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్ తో 8 శాతం హెచ్ఆర్ఏ
  • 2 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్ తో 9.5 శాతం 
  • 5 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 12 వేల సీలింగ్ తో 13.5 శాతం 
  • 10 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 15 వేల సీలింగ్ తో 16 శాతం 
  • 25 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగ్ తో 16  శాతం
  • సెక్రటేరీయేట్, హెచ్వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు రూ. 23 వేల సీలింగ్ తో 24 శాతం

ఫిట్మెంట్ 23 శాతమే : మంత్రుల కమిటీ 

ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తేల్చిచెప్పింది. ఐఆర్ రికవరీని చేయబోమని స్పష్టం చేసింది. మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 25 వేల ఇచ్చేందుకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. ఐదేళ్లకోసారి పీఆర్సీని అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రొబేషన్ అనంతరం కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇస్తామని వెల్లడించింది. ఇంకా చర్చించాల్సిన అంశాలను ఎనామలీస్ కమిటీకి పంపుతామని ఉద్యోగ సంఘాలకు తెలిపింది. ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల డిమాండ్ లతో ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో ఆర్థికశాఖతో చర్చించాలన్నారు. ఫిట్‌మెంట్‌ 23 శాతంలో మార్పు ఉందని తెలిపారు. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌(సీసీఏ) రద్దు చేయొద్దని ఉద్యోగులు కోరారన్నారు. హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులే కొనసాగించాలని ఉద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని తెలిపారు. కనీస హెచ్‌ఆర్‌ఏ 12 శాతం ఉండాలని ఉద్యోగులు అడిగారన్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల సవరణతో రూ.7 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని సజ్జల అన్నారు. 

ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని పరిష్కరించాం: మంత్రి బొత్స 

పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో మంత్రుల కమిటీ శనివారం భేటీ అయింది. ఈ మధ్యాహ్నం పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రులు సమాలోచనలు చేస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు మంత్రుల కమిటీ శుక్రవారం అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపారు.  ఐఆర్‌ రికవరీ చేయబోమని పీఆర్‌సీని ఐదేళ్లకొకసారి ఇస్తామని మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగ సంఘ నేతలకు హామీ ఇచ్చింది. మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారించామన్నారు.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, ఐఆర్‌ రికవరీ విషయంలో స్పష్టత ఇచ్చామన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల అదనపు భారం ఉండొచ్చన్నారు. ఇక మిగిలిన సమస్యలు చిన్నవని, అవి కూడా త్వరలో పరిష్కారం అవుతాయన్నారు. చర్చల అనంతరం అన్ని అంశాలు సీఎం జగన్‌కు వివరిస్తామని మంత్రి బొత్స అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Shock: మధ్యప్రదేశ్ ప్రమాదంలో ఏడుగురు మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి- సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు
మధ్యప్రదేశ్ ప్రమాదంలో ఏడుగురు మృతి, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Shock: మధ్యప్రదేశ్ ప్రమాదంలో ఏడుగురు మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి- సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు
మధ్యప్రదేశ్ ప్రమాదంలో ఏడుగురు మృతి, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
Romantic Destinations : రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Embed widget