అన్వేషించండి

Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు, బుకింగ్ ప్రాసెస్ ఇలా!

Andhra News: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాయితీ నిధుల విడుదలకు అనుమతిచ్చింది. ఈ నెల 31 నుంచి ఉచిత సిలిండర్లు లబ్ధిదారులకు అందనున్నాయి.

AP Government Funds To Free Gas Cylinder Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల (Free Gas Cylinder) పథకానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ఈ పథకం రాయితీ నిధులు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌర సరఫరాలశాఖ తెరిచిన ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఓ సిలిండర్ రాయితీ మొత్తం రూ.895 కోట్లు విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 

దీపావళి నుంచి ప్రారంభం

ఈ నెల 31 నుంచి దీపావళి సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్పీజీ కనెక్షన్ కలిగి అర్హత గల ప్రతీ కుటుంబానికి ఈ పథకం వర్తింపచేయాలని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 కాగా.. కేంద్రం ప్రతి సిలిండర్‌కు రూ.25 సబ్సిడీ ఇస్తుండగా.. ప్రస్తుతం ప్రతీ సిలిండర్ ధర రూ.851గా ఉంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది. ఐదేళ్లకు రూ.13,423 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులు ప్రతి 4 నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఈ పథకం ద్వారా పేదల జీవన ప్రమాణం పెరుగుతుందని సర్కారు భావిస్తోంది.

ఈ కేవైసీ తప్పనిసరి

మరోవైపు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా తీసుకొని వంట గ్యాస్ సిలిండర్ రాయితీ ఇస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వంట గ్యాస్ ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నప్పటికీ.. ఆధార్, ఫోన్ నెంబర్ ఆధారంగా బుకింగ్ అవుతోంది. రాయితీ పొందాలంటే రేషన్ కార్డుల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఎలా పొందుపరచాలనే దానిపై స్పష్టత కొరవడినట్లు తెలుస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులకు పూర్తి సమాచారం రాలేదు. అటు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రభుత్వం ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉండగా.. అందులో ఇప్పటివరకూ 20 లక్షలకు పైగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈ కేవైసీ చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ కేవైసీ కాకుంటే గ్యాస్ కంపెనీల వద్ద ఉండే డేటా, ప్రభుత్వం వద్ద ఉండే డేటా సరిపోయే అవకాశాలు లేవు. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఈ కేవైసీ నమోదు కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్తున్నారు.

పథకం అమలు ఇలా

  • ఈ నెల 29వ తేదీ నుంచి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం. బుక్ చేసుకోగానే లబ్ధిదారుని ఫోన్ నెంబరుకు సందేశం వెళ్తుంది.
  • పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో సిలిండర్లు డెలివరీ చేస్తారు. డెలివరీ అయిన 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుని ఖాతాలో రాయితీ సొమ్ము జమ అవుతుంది.
  • ఈ పథకం అమలుకై 3 బ్లాక్ పీరియడ్లుగా పరిగణిస్తారు. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 31 వరకూ, మూడో బ్లాక్ పీరియడ్ డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకూ పరిగణిస్తారు.
  • మొదటి సిలిండర్ మార్చి 31లోపు, రెండోది జులై 31లోపు, మూడోది నవంబర్ 30లోపు ఎప్పుడైనా పొందొచ్చు. పథకం అమల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్.. 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చెయ్యొచ్చు.

Also Read: Andhra Pradesh: విద్యుత్ చార్జీలు పెంచాలని కోరింది ఎమ్మెల్యే జగన్ రెడ్డి - మంత్రి గొట్టిపాటి సంచలనం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Employee Unions: ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget