అన్వేషించండి

Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు, బుకింగ్ ప్రాసెస్ ఇలా!

Andhra News: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాయితీ నిధుల విడుదలకు అనుమతిచ్చింది. ఈ నెల 31 నుంచి ఉచిత సిలిండర్లు లబ్ధిదారులకు అందనున్నాయి.

AP Government Funds To Free Gas Cylinder Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల (Free Gas Cylinder) పథకానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ఈ పథకం రాయితీ నిధులు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌర సరఫరాలశాఖ తెరిచిన ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఓ సిలిండర్ రాయితీ మొత్తం రూ.895 కోట్లు విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 

దీపావళి నుంచి ప్రారంభం

ఈ నెల 31 నుంచి దీపావళి సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్పీజీ కనెక్షన్ కలిగి అర్హత గల ప్రతీ కుటుంబానికి ఈ పథకం వర్తింపచేయాలని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 కాగా.. కేంద్రం ప్రతి సిలిండర్‌కు రూ.25 సబ్సిడీ ఇస్తుండగా.. ప్రస్తుతం ప్రతీ సిలిండర్ ధర రూ.851గా ఉంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది. ఐదేళ్లకు రూ.13,423 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులు ప్రతి 4 నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఈ పథకం ద్వారా పేదల జీవన ప్రమాణం పెరుగుతుందని సర్కారు భావిస్తోంది.

ఈ కేవైసీ తప్పనిసరి

మరోవైపు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా తీసుకొని వంట గ్యాస్ సిలిండర్ రాయితీ ఇస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వంట గ్యాస్ ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నప్పటికీ.. ఆధార్, ఫోన్ నెంబర్ ఆధారంగా బుకింగ్ అవుతోంది. రాయితీ పొందాలంటే రేషన్ కార్డుల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఎలా పొందుపరచాలనే దానిపై స్పష్టత కొరవడినట్లు తెలుస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులకు పూర్తి సమాచారం రాలేదు. అటు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రభుత్వం ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉండగా.. అందులో ఇప్పటివరకూ 20 లక్షలకు పైగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈ కేవైసీ చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ కేవైసీ కాకుంటే గ్యాస్ కంపెనీల వద్ద ఉండే డేటా, ప్రభుత్వం వద్ద ఉండే డేటా సరిపోయే అవకాశాలు లేవు. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఈ కేవైసీ నమోదు కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్తున్నారు.

పథకం అమలు ఇలా

  • ఈ నెల 29వ తేదీ నుంచి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం. బుక్ చేసుకోగానే లబ్ధిదారుని ఫోన్ నెంబరుకు సందేశం వెళ్తుంది.
  • పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో సిలిండర్లు డెలివరీ చేస్తారు. డెలివరీ అయిన 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుని ఖాతాలో రాయితీ సొమ్ము జమ అవుతుంది.
  • ఈ పథకం అమలుకై 3 బ్లాక్ పీరియడ్లుగా పరిగణిస్తారు. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 31 వరకూ, మూడో బ్లాక్ పీరియడ్ డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకూ పరిగణిస్తారు.
  • మొదటి సిలిండర్ మార్చి 31లోపు, రెండోది జులై 31లోపు, మూడోది నవంబర్ 30లోపు ఎప్పుడైనా పొందొచ్చు. పథకం అమల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్.. 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చెయ్యొచ్చు.

Also Read: Andhra Pradesh: విద్యుత్ చార్జీలు పెంచాలని కోరింది ఎమ్మెల్యే జగన్ రెడ్డి - మంత్రి గొట్టిపాటి సంచలనం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sai Krishna Murder Case: లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది: సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు
లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది: సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు
Palnadu Road Accident: హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
Breaking News: రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు
రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Palnadu Road Accident: హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
IPL Star Shashank Singh : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు, !
పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు !
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Embed widget