అన్వేషించండి

Free Bus Service: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఆ రోజు నుంచే!

Andhrapradesh News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 నుంచే దీన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Free Bus Service Scheme For Women In AP: ఏపీలో మహిళలకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పలు కీలక హామీలను నెరవేర్చింది. సర్కారు ఏర్పడిన నెల రోజుల్లోనే పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం వంటి పథకాల అమలు సహా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి వాటినీ అమలు చేసింది. తాజాగా, మహిళలు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Scheme) అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఒకే రోజు రెండు పథకాలను ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్ల ఏర్పాటు సహా మహిళలకు ఫ్రీ బస్ సర్వీసును సైతం ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకం అమలు విధానంపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశాఖ వేదికగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

అధికారుల అధ్యయనం

అటు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీ అధికారులు ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు తీరును అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. పథకం అమలు చేస్తే ఆర్టీసీపై పడే ఆర్థిక భారం, పథకం అమలైతే తలెత్తే సమస్యలు, ఆర్థికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? వంటి అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

అదే రోజు మరో పథకం

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 15వ తేదీనే అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిరుపేదలకు రెండు పూటలా కడుపు నింపేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలిదశలో 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు క్యాంటీన్ల ఏర్పాటుకు టెండర్లు పిలవగా.. ఈ నెల 22 వరకూ గడువు ఉంది. ఈ నెలాఖరులోగా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలకు టెండర్లు ఖరారు చేయనుంది. గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల భవనాలను రూ.20 కోట్లతో ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు.

దాతల నుంచి విరాళాలు

అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం ఓ ట్రస్ట్ ప్రారంభించి.. ప్రత్యేక వెబ్ సైట్ సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యాంటీన్లకు దాతలు ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతంలో కేవలం రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేవారు. ఇప్పుడు కూడా అవే ధరలతో అన్న క్యాంటీన్లలో భోజనం అందించాలని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: Pawan Kalyan: 'చెత్త నుంచి సంపద సృష్టించేలా ప్రణాళిక' - పిఠాపురంలో తొలిసారిగా ఆ ప్రాజెక్ట్, డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget