అన్వేషించండి

Free Bus Service: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఆ రోజు నుంచే!

Andhrapradesh News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 నుంచే దీన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Free Bus Service Scheme For Women In AP: ఏపీలో మహిళలకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పలు కీలక హామీలను నెరవేర్చింది. సర్కారు ఏర్పడిన నెల రోజుల్లోనే పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం వంటి పథకాల అమలు సహా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి వాటినీ అమలు చేసింది. తాజాగా, మహిళలు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Scheme) అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఒకే రోజు రెండు పథకాలను ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్ల ఏర్పాటు సహా మహిళలకు ఫ్రీ బస్ సర్వీసును సైతం ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకం అమలు విధానంపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశాఖ వేదికగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

అధికారుల అధ్యయనం

అటు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీ అధికారులు ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు తీరును అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. పథకం అమలు చేస్తే ఆర్టీసీపై పడే ఆర్థిక భారం, పథకం అమలైతే తలెత్తే సమస్యలు, ఆర్థికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? వంటి అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

అదే రోజు మరో పథకం

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 15వ తేదీనే అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిరుపేదలకు రెండు పూటలా కడుపు నింపేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలిదశలో 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు క్యాంటీన్ల ఏర్పాటుకు టెండర్లు పిలవగా.. ఈ నెల 22 వరకూ గడువు ఉంది. ఈ నెలాఖరులోగా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలకు టెండర్లు ఖరారు చేయనుంది. గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల భవనాలను రూ.20 కోట్లతో ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు.

దాతల నుంచి విరాళాలు

అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం ఓ ట్రస్ట్ ప్రారంభించి.. ప్రత్యేక వెబ్ సైట్ సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యాంటీన్లకు దాతలు ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతంలో కేవలం రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేవారు. ఇప్పుడు కూడా అవే ధరలతో అన్న క్యాంటీన్లలో భోజనం అందించాలని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: Pawan Kalyan: 'చెత్త నుంచి సంపద సృష్టించేలా ప్రణాళిక' - పిఠాపురంలో తొలిసారిగా ఆ ప్రాజెక్ట్, డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నంవరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబువినాయక నిమజ్జనం వేడుకల్లో అంబానీ ఫ్యామిలీముంబైలో సందీప్ రెడ్డి వంగాను కలిసిన జూనియర్ ఎన్టీఆర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
Pawan Kalyan: బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
Bengaluru Rameshwaram Cafe Blast :  వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
Embed widget