అన్వేషించండి

Cyclone Montha Impact on AP: మొంథా తుపానుపై ఏపీ సన్నద్ధత, రూ.14 కోట్లు విడుదల.. జిల్లాలకు ప్రత్యేక అధికారులు

Cyclone Montha Latest News Updates | మొంథా తుపానుపై ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. 11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసింది. జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

Andhra Pradesh Rains | అమరావతి: బంగాళాఖాతంలో ‌ ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ హెచ్చరించింది. అక్టోబర్‌ 28న మొంథా అనే తీవ్ర తుఫాను రూపంలో ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది. మొంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌  తీర ప్రాంత జిల్లాలన్నింటికీ సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అధికారులు తక్షణమే తమ తమ జిల్లాలకు చేరుకొని సైక్లోన్‌ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి, కలెక్టర్లతో సమన్వయంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ జిల్లాలపై తుపాను ప్రభావం అధికం..

ఆర్‌.పి. సిసోడియాను తూర్పు తీర ప్రాంతాల జోనల్‌ ఇన్‌చార్జిగా నియమించారు. సిసోడియా పశ్చిమ గోదావరి జిల్లా నుండి చిత్తూరు వరకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. అజయ్‌ జైన్‌కు శ్రీకాకుళం జిల్లా నుండి  కోనసీమ జిల్లాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. మొంథా తుఫాను ప్రభావం ఈ జిల్లాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇతర జిల్లాలకు కూడా సీఎస్ ప్రత్యేక అధికారులను నియమించారు. కె.వి.ఎన్‌. చక్రధరబాబు (శ్రీకాకుళం), పట్టణశెట్టి రవి సుబాష్‌ (విజయనగరం), నారాయణ భారత్‌ గుప్తా (పార్వతీపురం మన్యం), వదరేవు వినయ్‌ చంద్‌ (అల్లూరి సీతారామరాజు), వి.ఆర్‌. కృష్ణ తేజ (కాకినాడ), కె. కన్నా బాబు (తూర్పు గోదావరి), విజయరామరాజు (కొనసీమ), వి. ప్రసన్న వెంకటేశ్‌ (పశ్చిమ గోదావరి), కాంతిలాల్‌ డాండే (ఏలూరు), అమ్రపాలి కాటా (కృష్ణా), శశిభూషణ్‌ కుమార్‌ (ఎన్టీఆర్), ఎం. వేణుగోపాల్‌ రెడ్డి (బాపట్ల), కోనా సశిధర్‌ (ప్రకాశం), ఎన్‌ యువరాజ్‌ (నెల్లూరు), పి. అరుణ్‌ బాబు (తిరుపతి), పి.ఎస్‌. గిరీశా (చిత్తూరు)లను ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. 

అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలి

ఈ అధికారులు మొంథా తుఫాను సమయంలో ఉపశమన, రక్షణ, సహాయక చర్యలను సమన్వయం చేసుకోవాలి. ప్రతి బాధిత కుటుంబానికి సాయం చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి. తుఫాను అనంతరం నష్టం అంచనా, పరిహారం పంపిణీ, ప్రజల సాధారణ జీవన పునరుద్ధరణ వరకు ఈ అధికారులు సేవలు అందించనున్నారు. వీరు అన్ని శాఖల మధ్య (రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇంధనం, రోడ్లు & భవనాలు, నీటివనరులు, ఆరోగ్యం) సమన్వయంతో పనిచేయనున్నారు. అనుభవజ్ఞులైన అధికారులు సిసోడియా, అజయ్‌ జైన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రజలు మరో మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 
అమరావతి: మొంథా తుపాను ప్రభావంతో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణ సాయంగా 11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అధిక వర్షపాతం నమోదైన మండలాల్లో ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు, అత్యవసర సదుపాయాలకు ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకుని అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
Embed widget