అన్వేషించండి

Amaravathi Farmers Mahapadyatra: అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనుమతి లేదు - అర్థరాత్రి డీజీపీ ఉత్తర్వులు

Amaravati Farmers Mahapadyatra: అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గే అవకాశం ఉన్నందునే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Amaravati Farmers Mahapadyatra: అమరావతి రాజధాని రైతులు పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఒకటి అయిపోగానే మరొక కార్యక్రమాన్ని తీసుకొస్తూ.. తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతులను అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు.

ఆ ఉత్తర్వుల్లో ఏముందంటే..?

"మీరు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మహాపాద యాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందులో 200 మందికిపైగా పాల్గొంటారని, ఒకవేళ ఆ సంఖ్య బాగా పెరిగితే ఒక్కో బృందంలో 200 మందికి మించకుండా వేర్వేరు బృందాలుగా వెళ్తామని చెప్పారు. మేం మీరు పంపిన విజ్ఞప్తిని ఆయా జిల్లా పోలీసుల అధికారులకు పంపించాం. దీనిపై అధికారులందరి అభిప్రాయాలను కోరాం. మీ విజ్ఞప్తిని, వారి అభిప్రాయాలను పరిశీలించిన మీదట ఈ కింది ఉత్తర్వులు ఇస్తున్నానని".. ఈ ఉత్తర్వుల ద్వారా వెల్లడించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే అమరావతి రైతులు గతేడాది అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. 

71 క్రిమినల్ కేసులు నమోదు..

అప్పుడు కూడా కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో అనుమతి ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. పాదయాత్రలో ఆ షరతులన్నీ ఉల్లంఘించారని.. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి గాయ పరచడం, వారిని ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం వంటి నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. అందుకు వివిధ జిల్లాల్లో అమరావతి రైతులపై 71 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. రెండు కేసుల్లో శిక్ష కూడా పడినట్లు వివరించారు. అయితే ఇప్పుడు పాదయాత్రం కోసం ప్రతిపాదించిన మార్గంలోని వివిధ ప్రాంతాల్లో మూడు రాజధానులపై వివిధ ఆంక్షలు ఉన్నాయన్నారు. కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం కూడా పాదయాత్ర మార్గంలో ఉందని... చెప్పారు. 

ఎంత మంది వస్తారో కూడా మీకు తెలీదు..

200 మందితో పాదయాత్ర చేస్తామని చెబుతూనే.. ప్రజల సంఖ్య పెరిగితే బృందాలుగా చీలి వెళ్తామంటున్నారని వివరించారు. అసలు పాదయాత్రకు ఎంతమంది వస్తారన్న దానిపై వారికే నియంత్రణ లేదన్నది అర్థం అవుతోందని డీజీపీ వివరించారు. పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారనేది కూడా సరిగ్గా తెలియనప్పుడు... వారిని గుర్తించడమే కాదు యాత్రను పర్యవేక్షించడం కూడా కష్టమే అవుతుందన్నారు. ఈ కారణాలన్నింటి దృష్ట్యా మీరు పాదయాత్ర చేసే క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే అవకాశం ఉందన్నారు. యాత్రలో మహిళలు కూడా పాల్గొంటారు కాబట్టి భద్రత కల్పించడం మరింత కష్టమవుతుందని తెలిపారు. కోనసీమ జిల్లాలో ఇటీవల జిల్లా పేరు విషయంలోనే రెండు వర్గాలు ర్యాలీ చేయడం వల్ల శాంతి భద్రతల సమస్యగా మారి, మంత్రి, ఎమ్మెల్యేల ఇల్లు తగులబెట్టడం వరకు వెళ్లిందని చెప్పుకొచ్చారు. 

శ్రీకాకుళం జిల్లాలోనూ రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. అమరావతి రైతుల పాదయాత్ర మీదుగానూ సాగనుంది. కాబట్టి పాదయాత్ర క్రమంలో ఏ చిన్న గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశాల్ని, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మహా పాదయాత్రకు అనమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.

టాప్ హెడ్ లైన్స్

Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget