అన్వేషించండి

Amaravathi Farmers Mahapadyatra: అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనుమతి లేదు - అర్థరాత్రి డీజీపీ ఉత్తర్వులు

Amaravati Farmers Mahapadyatra: అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గే అవకాశం ఉన్నందునే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Amaravati Farmers Mahapadyatra: అమరావతి రాజధాని రైతులు పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఒకటి అయిపోగానే మరొక కార్యక్రమాన్ని తీసుకొస్తూ.. తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతులను అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు.

ఆ ఉత్తర్వుల్లో ఏముందంటే..?

"మీరు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మహాపాద యాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందులో 200 మందికిపైగా పాల్గొంటారని, ఒకవేళ ఆ సంఖ్య బాగా పెరిగితే ఒక్కో బృందంలో 200 మందికి మించకుండా వేర్వేరు బృందాలుగా వెళ్తామని చెప్పారు. మేం మీరు పంపిన విజ్ఞప్తిని ఆయా జిల్లా పోలీసుల అధికారులకు పంపించాం. దీనిపై అధికారులందరి అభిప్రాయాలను కోరాం. మీ విజ్ఞప్తిని, వారి అభిప్రాయాలను పరిశీలించిన మీదట ఈ కింది ఉత్తర్వులు ఇస్తున్నానని".. ఈ ఉత్తర్వుల ద్వారా వెల్లడించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే అమరావతి రైతులు గతేడాది అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. 

71 క్రిమినల్ కేసులు నమోదు..

అప్పుడు కూడా కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో అనుమతి ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. పాదయాత్రలో ఆ షరతులన్నీ ఉల్లంఘించారని.. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి గాయ పరచడం, వారిని ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం వంటి నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. అందుకు వివిధ జిల్లాల్లో అమరావతి రైతులపై 71 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. రెండు కేసుల్లో శిక్ష కూడా పడినట్లు వివరించారు. అయితే ఇప్పుడు పాదయాత్రం కోసం ప్రతిపాదించిన మార్గంలోని వివిధ ప్రాంతాల్లో మూడు రాజధానులపై వివిధ ఆంక్షలు ఉన్నాయన్నారు. కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం కూడా పాదయాత్ర మార్గంలో ఉందని... చెప్పారు. 

ఎంత మంది వస్తారో కూడా మీకు తెలీదు..

200 మందితో పాదయాత్ర చేస్తామని చెబుతూనే.. ప్రజల సంఖ్య పెరిగితే బృందాలుగా చీలి వెళ్తామంటున్నారని వివరించారు. అసలు పాదయాత్రకు ఎంతమంది వస్తారన్న దానిపై వారికే నియంత్రణ లేదన్నది అర్థం అవుతోందని డీజీపీ వివరించారు. పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారనేది కూడా సరిగ్గా తెలియనప్పుడు... వారిని గుర్తించడమే కాదు యాత్రను పర్యవేక్షించడం కూడా కష్టమే అవుతుందన్నారు. ఈ కారణాలన్నింటి దృష్ట్యా మీరు పాదయాత్ర చేసే క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే అవకాశం ఉందన్నారు. యాత్రలో మహిళలు కూడా పాల్గొంటారు కాబట్టి భద్రత కల్పించడం మరింత కష్టమవుతుందని తెలిపారు. కోనసీమ జిల్లాలో ఇటీవల జిల్లా పేరు విషయంలోనే రెండు వర్గాలు ర్యాలీ చేయడం వల్ల శాంతి భద్రతల సమస్యగా మారి, మంత్రి, ఎమ్మెల్యేల ఇల్లు తగులబెట్టడం వరకు వెళ్లిందని చెప్పుకొచ్చారు. 

శ్రీకాకుళం జిల్లాలోనూ రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. అమరావతి రైతుల పాదయాత్ర మీదుగానూ సాగనుంది. కాబట్టి పాదయాత్ర క్రమంలో ఏ చిన్న గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశాల్ని, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మహా పాదయాత్రకు అనమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
YS Jagan: మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
Akividu issue: చలో ఆకివీడు అంటూ భారీ ప్రచారం - పోలీసుల వార్నింగ్ - ఆదివారం ఏం జరగబోతోంది?
చలో ఆకివీడు అంటూ భారీ ప్రచారం - పోలీసుల వార్నింగ్ - ఆదివారం ఏం జరగబోతోంది?

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SRH vs LSG: సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
Iran-US War: అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
Rayavalasa: అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
Cucumber Water : వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
Who is Ashok Sharma: ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
Embed widget