అన్వేషించండి

Amaravathi Farmers Mahapadyatra: అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనుమతి లేదు - అర్థరాత్రి డీజీపీ ఉత్తర్వులు

Amaravati Farmers Mahapadyatra: అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గే అవకాశం ఉన్నందునే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Amaravati Farmers Mahapadyatra: అమరావతి రాజధాని రైతులు పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఒకటి అయిపోగానే మరొక కార్యక్రమాన్ని తీసుకొస్తూ.. తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతులను అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు.

ఆ ఉత్తర్వుల్లో ఏముందంటే..?

"మీరు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మహాపాద యాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందులో 200 మందికిపైగా పాల్గొంటారని, ఒకవేళ ఆ సంఖ్య బాగా పెరిగితే ఒక్కో బృందంలో 200 మందికి మించకుండా వేర్వేరు బృందాలుగా వెళ్తామని చెప్పారు. మేం మీరు పంపిన విజ్ఞప్తిని ఆయా జిల్లా పోలీసుల అధికారులకు పంపించాం. దీనిపై అధికారులందరి అభిప్రాయాలను కోరాం. మీ విజ్ఞప్తిని, వారి అభిప్రాయాలను పరిశీలించిన మీదట ఈ కింది ఉత్తర్వులు ఇస్తున్నానని".. ఈ ఉత్తర్వుల ద్వారా వెల్లడించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే అమరావతి రైతులు గతేడాది అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. 

71 క్రిమినల్ కేసులు నమోదు..

అప్పుడు కూడా కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో అనుమతి ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. పాదయాత్రలో ఆ షరతులన్నీ ఉల్లంఘించారని.. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి గాయ పరచడం, వారిని ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం వంటి నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. అందుకు వివిధ జిల్లాల్లో అమరావతి రైతులపై 71 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. రెండు కేసుల్లో శిక్ష కూడా పడినట్లు వివరించారు. అయితే ఇప్పుడు పాదయాత్రం కోసం ప్రతిపాదించిన మార్గంలోని వివిధ ప్రాంతాల్లో మూడు రాజధానులపై వివిధ ఆంక్షలు ఉన్నాయన్నారు. కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం కూడా పాదయాత్ర మార్గంలో ఉందని... చెప్పారు. 

ఎంత మంది వస్తారో కూడా మీకు తెలీదు..

200 మందితో పాదయాత్ర చేస్తామని చెబుతూనే.. ప్రజల సంఖ్య పెరిగితే బృందాలుగా చీలి వెళ్తామంటున్నారని వివరించారు. అసలు పాదయాత్రకు ఎంతమంది వస్తారన్న దానిపై వారికే నియంత్రణ లేదన్నది అర్థం అవుతోందని డీజీపీ వివరించారు. పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారనేది కూడా సరిగ్గా తెలియనప్పుడు... వారిని గుర్తించడమే కాదు యాత్రను పర్యవేక్షించడం కూడా కష్టమే అవుతుందన్నారు. ఈ కారణాలన్నింటి దృష్ట్యా మీరు పాదయాత్ర చేసే క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే అవకాశం ఉందన్నారు. యాత్రలో మహిళలు కూడా పాల్గొంటారు కాబట్టి భద్రత కల్పించడం మరింత కష్టమవుతుందని తెలిపారు. కోనసీమ జిల్లాలో ఇటీవల జిల్లా పేరు విషయంలోనే రెండు వర్గాలు ర్యాలీ చేయడం వల్ల శాంతి భద్రతల సమస్యగా మారి, మంత్రి, ఎమ్మెల్యేల ఇల్లు తగులబెట్టడం వరకు వెళ్లిందని చెప్పుకొచ్చారు. 

శ్రీకాకుళం జిల్లాలోనూ రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. అమరావతి రైతుల పాదయాత్ర మీదుగానూ సాగనుంది. కాబట్టి పాదయాత్ర క్రమంలో ఏ చిన్న గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశాల్ని, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మహా పాదయాత్రకు అనమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.

టాప్ హెడ్ లైన్స్

Vizag Steel Plant Fire Accident: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం - ద్రవ ఉక్కు ఒలికి భారీగా ఎగసిపడిన మంటలు - భారీ ప్రాణనష్టం?
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం - ద్రవ ఉక్కు ఒలికి భారీగా ఎగసిపడిన మంటలు - భారీ ప్రాణనష్టం?
Chandrababu Naidu Siddhantam tour: 1500 కోట్ల భూ కబ్జా కేసులో అరెస్టయిన లీడర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు - వైసీపీపై చంద్రబాబు విమర్శలు
1500 కోట్ల భూ కబ్జా కేసులో అరెస్టయిన లీడర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు - వైసీపీపై చంద్రబాబు విమర్శలు
Breaking News:విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు- పలువురికి గాయాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు- పలువురికి గాయాలు
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
This Week Theatrical Releases : పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
Prithviraj Sukumaran : వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
Breaking News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
Embed widget