అన్వేషించండి

YS Jagan: జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు, చంద్రబాబుకు వేస్తే ముగింపు పలికినట్లే: సీఎం జగన్

Andhra Pradesh News: ఏపీలో అన్ని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓట్లు వేయాలని, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు రద్దు అవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

AP Elections 2024: కనిగిరి: ‘జగన్‌కు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపు.. చంద్రబాబుకు కనుక ఓటేస్తే పథకాలకు ముగింపు. చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలు, కుట్రలు’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పదో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. కొనకొనమిట్లలో ఏర్పాటు చేసిన వైసీపీ బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్‌ నిర్ణయిస్తాయి. ఇవి ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నికలు కావు. పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. అవ్వాతాతలకు పింఛన్లు రాకుండా తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో చంద్రబాబు ఫిర్యాదు చేయించారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవాలని కుట్రలు పన్నిన వ్యక్తి చంద్రబాబు’ అంటూ మండిపడ్డారు.

YS Jagan: జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు, చంద్రబాబుకు వేస్తే ముగింపు పలికినట్లే: సీఎం జగన్

సంక్షేమం కొనసాగాలంటే వైసీపీనే రావాలి.. 
చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే. పిల్లలు బడికి వెళితే అమ్మ ఒడి రావాలన్నా, అక్కాచెల్లెమ్మల సాధికారత కొనసాగాలన్నా వైసీపీ అధికారంలో ఉండాలి. వైఎస్సార్ రైతు భరోసా కొనసాగాలన్నా, అవ్వాతాతల సంక్షేమం కొనసాగాలా, వెనక్కి వెళ్లాలా అని నిర్ణయిస్తాయి ఈ ఎన్నికలు. రాష్ట్రంలో అవ్వాతాతలకు, వితంతువులకు వారి ఇంటి వద్దకు ఫించన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. మనం ఇంటింటికి పింఛన్లు ఇవ్వడం నేరమని ఫిర్యాదు చేయించారు. ఆదివారం అయినా వాలంటీర్లు నెల ఒకటో తేదీన ఫించన్లు ఇచ్చేవాళ్లు. కానీ చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలు పింఛన్లకు కూడా లంచాలు తీసుకున్నాయి. రోజుల తరబడి క్యూ లైన్లలో నిలుచున్నా పింఛన్ డబ్బులు చేతికి వచ్చేవి కాదు. అవ్వాతాతలకు ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద పింఛన్ ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకించి ఈసీకి ఫిర్యాదు చేయించారు. పింఛన్ల కోసం మండుటెండలో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చనిపోతున్నారు. వీటన్నింటికి కారకుడు చంద్రబాబు’ అని సీఎం జగన్ ఆరోపించారు.

 

మంచి చూడలేని శాడిస్ట్ చంద్రబాబు 
పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్ట్ చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తిని ఏమనాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్‌ మీడియం పెడుతుంటే అడ్డుపడుతున్నాడు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్నాడు. చంద్రబాబు సహా టీడీపీ నేతలు వాలంటీర్లను కించపరిచి  మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ గుర్తుకురావు. 58 నెలల జగన్ పాలనపై ఎవరిని అడిగినా తమకు జరిగిన మేలు గురించి చెబుతారు. దేశంలో రూ.3 వేల పెన్షన్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. 

గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పగటి పూటే రైతులకు ఉచిత కరెంటు, ఉచిత పంటబీమా సైతం అందిచ్చాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు. వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నాం. ఏకంగా 30 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించాం.  అమ్మఒడి ఇచ్చాం. ప్రభుత్వ బడులు రూపు రేఖలు మార్చేశాం. అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ రుణాలు అందిచ్చాం. 

వైసీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం.. 
వాహన మిత్ర, లా నేస్తంతో పాటు అక్కాచెల్లెమ్మలకు రాజకీయ సాధికారత వైసీపీ హయాంలోనే వచ్చింది. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చాం. కొత్త మెడికల్‌ కాలేజీలు. మేనిఫెస్టోలో నూటికి 90 శాతం పైగా హామీలు నెరవేర్చాం. ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగంగా జరగుతోంది. 5 ఏళ్లకు మనం ఇన్ని చేస్తే, 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు. ట్యాబ్లెట్లు వేసుకున్నా చంద్రబాబు కడుపుమంట తగ్గదు. 2014లో చంద్రబాబు ఇదే కూటమితో ముందుకువచ్చారు. రుణమాఫీ చేయలేదు. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అర్హులైన పేదవారికి మూడు సెంట్ల స్థలం కూడా ఇవ్వలేదు. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే. వైసీపీ గుర్తు ఫ్యాన్.. మన గుర్తుకు ఓటేసి మీ బిడ్డ జగన్‌ను గెలిపించి’ సంక్షేమ పథకాలకు జై కొట్టాలని జగన్ పిలుపునిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget