అన్వేషించండి

AP Welfare Scheme: ఆ కారణంతోనే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తున్నాం.... సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు... ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల

ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్ టైల్ పరిశ్రమలకు రూ.1124 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది ఏపీ ప్రభుత్వం. కొనుగోలు శక్తిని పెంచేందుకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ప్రకటించారు. కరోనా కష్టకాలంలోనూ వరుసగా రెండో ఏడాది పరిశ్రమలకు రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనే లక్ష్యంతో గత ఏడాది మే 22న రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించామని సీఎం జగన్ తెలిపారు. 


AP Welfare Scheme: ఆ కారణంతోనే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తున్నాం.... సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు... ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల

ఆర్థిక వ్యవస్థ బలోపేతం

ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోతే పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని అందుకోసం అప్పు చేసైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించామన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం జగన్ గుర్తుచేశారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రోడ్డున పడే పరిస్థితి ఉందన్న ఆయన ఎంఎస్‌ఎంఈలకు ఊతం అందిస్తే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెప్పారు. 


AP Welfare Scheme: ఆ కారణంతోనే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తున్నాం.... సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు... ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల

10 లక్షల ఉద్యోగాలు 

ఎంఎస్ఎంఈలతో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడంతో వారిలో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు పారిశ్రామిక రంగం క్షీణిస్తుందన్నారు. అందువల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, ఉపాధిని నిలబెట్టేందుకు పథకాలు ఉపయోగపడ్డాయన్న ఆయన.. సంక్షేమ పథకాల అమలుతో కష్టాల్లోనూ పేదలను ఆదుకోగలిగామని సీఎం జగన్ తెలిపారు. 

Also Read: RRR Vs Ysrcp : సీపీఎస్‌పై జగన్ చెప్పాడంటే చేస్తాడంతే .. తేల్చేసిన రఘురామకృష్ణరాజు!

రూ.2 వేల కోట్లు ప్రోత్సాహకాలు

ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలతో 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ పరిశ్రమలకు రూ.1124 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు రూ.684 కోట్లు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఇప్పటివరకు రూ.2,086 కోట్లు ప్రోత్సాహకాలు ఇచ్చామని తెలిపారు. ప్రోత్సాహకాలు పొందుతున్న పరిశ్రమల్లో 42 శాతం మహిళలు ఉన్నారని స్పష్టం చేశారు. 

 

Also Read: TN Assembly on Pawan Kalyan: పవన్ కల్యాణ్ ట్వీట్ పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ... అధికారంలోకి రావడానికే రాజకీయం, వచ్చాక కాదు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget