అన్వేషించండి

AP Welfare Scheme: ఆ కారణంతోనే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తున్నాం.... సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు... ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల

ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్ టైల్ పరిశ్రమలకు రూ.1124 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది ఏపీ ప్రభుత్వం. కొనుగోలు శక్తిని పెంచేందుకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ప్రకటించారు. కరోనా కష్టకాలంలోనూ వరుసగా రెండో ఏడాది పరిశ్రమలకు రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనే లక్ష్యంతో గత ఏడాది మే 22న రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించామని సీఎం జగన్ తెలిపారు. 


AP Welfare Scheme: ఆ కారణంతోనే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తున్నాం.... సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు... ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల

ఆర్థిక వ్యవస్థ బలోపేతం

ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోతే పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని అందుకోసం అప్పు చేసైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించామన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం జగన్ గుర్తుచేశారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రోడ్డున పడే పరిస్థితి ఉందన్న ఆయన ఎంఎస్‌ఎంఈలకు ఊతం అందిస్తే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెప్పారు. 


AP Welfare Scheme: ఆ కారణంతోనే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తున్నాం.... సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు... ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల

10 లక్షల ఉద్యోగాలు 

ఎంఎస్ఎంఈలతో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడంతో వారిలో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు పారిశ్రామిక రంగం క్షీణిస్తుందన్నారు. అందువల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, ఉపాధిని నిలబెట్టేందుకు పథకాలు ఉపయోగపడ్డాయన్న ఆయన.. సంక్షేమ పథకాల అమలుతో కష్టాల్లోనూ పేదలను ఆదుకోగలిగామని సీఎం జగన్ తెలిపారు. 

Also Read: RRR Vs Ysrcp : సీపీఎస్‌పై జగన్ చెప్పాడంటే చేస్తాడంతే .. తేల్చేసిన రఘురామకృష్ణరాజు!

రూ.2 వేల కోట్లు ప్రోత్సాహకాలు

ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలతో 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ పరిశ్రమలకు రూ.1124 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు రూ.684 కోట్లు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఇప్పటివరకు రూ.2,086 కోట్లు ప్రోత్సాహకాలు ఇచ్చామని తెలిపారు. ప్రోత్సాహకాలు పొందుతున్న పరిశ్రమల్లో 42 శాతం మహిళలు ఉన్నారని స్పష్టం చేశారు. 

 

Also Read: TN Assembly on Pawan Kalyan: పవన్ కల్యాణ్ ట్వీట్ పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ... అధికారంలోకి రావడానికే రాజకీయం, వచ్చాక కాదు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Best Foods to Eat Raw : ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Embed widget