అన్వేషించండి

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో అధికార పర్యటనకు వెళ్తున్నట్లు జగన్ వేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

CM Jagan Davos Tour : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దావోస్‌ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును సీఎం జగన్‌ కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతు సడలించాలని కోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ వేశారు. ముఖ్యమంత్రి హోదాలో దావోస్‌లో అధికారంగా పర్యటనకు వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. విదేశాలకు వెళ్లేందుకు జగన్‌కు అనుమతిస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు జగన్‌ దావోస్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. 

స్విట్జర్లాండ్‌ దావోస్‌లో జరిగే 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలోని ఏపీ నుంచి ఒక టీమ్ దావోస్ లో పర్యటిస్తుంది. ఈ బృందం ఏపీలో పెట్టుబడి అవకాశాలు ప్రపంచ దేశాల కంపెనీలకు తెలియజేసుందుకు ఈ సదస్సులో పాల్గొంటుంది. ఇక్కడి పురోగతిని సదస్సులో తెలియజేయనుంది. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ దావోస్‌ సదస్సుకు సంబంధించిన లోగోను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల బుక్‌లెట్‌ను గురువారం ఆవిష్కరించారు. ఏపీ తరఫున పెవిలియన్‌ థీమ్‌ ఏర్పాటు చేసి, 18 అంశాలను ప్రదర్శిస్తామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర ముఖ్యమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తామన్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణ అంశాన్ని దావోస్‌ వేదికగా కంపెనీలకు తెలియజేస్తామన్నారు.  దాదాపు 30 అంతర్జాతీయ కంపెనీలతో సమావేశం అవుతున్నామని మంత్రి తెలిపారు. సీఎం పర్యటనలో పాల్గొంటున్నందున పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిచ్చే విషయమై తక్షణమే నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. 

తొలిసారి దావోస్ కు సీఎం జగన్ 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తొలిసారిగా దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సారి ఇదే సదస్సుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులు హాజరు అవుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏటా దావోస్ లో జరిగే సదస్సుకు హాజరయ్యే వారు. దావోస్ కేంద్రంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం అయ్యేవారు. ఆ సమయంలో దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం సాగేది. ఇప్పుడు సీఎం హోదాలో తొలిసారి సీఎం జగన్ పెట్టుబడుల సదస్సుకు వెళ్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఈ పర్యటన సీఎం జగన్, మంత్రి సమర్థతకు పరీక్షగా మారనుంది.

మే 22 నుంచి మే 26 వరకు పర్యటన

ఈ నెల 22 నుంచి మే 26 వరకు సీఎం జగన్ రెడ్డి దావోస్ పర్యటన ఉండనుంది. సీఎంతో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ  మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్ లో జరగబోయే దావోస్ ఎకనామిక్   ఫోరమ్ లో వందల సంఖ్యలో కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ సదస్సులో కోవిడ్  ముందు ఉన్న  పరిశ్రమల పరిస్థితి కోవిడ్ తర్వాత పరిస్థితిపై చర్చ  జరుగుతుంది. రాబోయే కాలంలో పారిశ్రామిక మార్పులపైన కూడా చర్చ జరగనుంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget