అన్వేషించండి

Loan For Education: ఉన్నత విద్య కోసం వడ్డీలేని రుణాలు, త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu | ఉన్నత విద్య కోసం వడ్డీలేని రుణాలు అందిస్తామని, 14 ఏళ్ల తరువాత తిరిగి చెల్లించేలా సౌకర్యం కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.

అమరావతి: ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఊరట కలిగించే ప్రకటన చేశారు. వడ్డీలేని విద్య రుణాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రుణాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పావలా వడ్డీ పథకంతో అనుసంధానిస్తామని చెప్పారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఇది అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకం కింద రుణాల మంజూరుకు ఎటువంటి భద్రత అవసరం లేదని, 14 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుందన్నారు. నైపుణ్య శిక్షణ కోర్సులకూ ఈ పథకం వర్తించనుందని పేర్కొన్నారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా పావలా వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. దీనిలో భాగంగా నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ఇది అమ్మాయిల చదువును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉండబోతుందని పేర్కొన్నారు.

ఆర్టీసీ ఆధునికీకరణ.. అన్ని ఏసీ బస్సులే లక్ష్యం
ఆర్టీసీ బస్‌స్టాండ్లను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టే పనిలో ప్రభుత్వం ఉన్నదన్నారు. వాణిజ్య సముదాయాలు, కార్గో సేవలు, ప్రకటనల ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేవుడి దయతో అన్ని బస్సులు ఏసీ బస్సులుగా మారే రోజులు దూరంలో లేవన్నారు.

కుల ధ్రువీకరణ పత్రాలు, శ్మశానాల స్థలాలు
త్వరలో శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శ్మశాన వాటికల కోసం అవసరమైన స్థలాల కేటాయింపును కలెక్టర్లు ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జర్నలిస్టుల గృహ నిర్మాణ పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు.

 


Loan For Education: ఉన్నత విద్య కోసం వడ్డీలేని రుణాలు, త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు: సీఎం చంద్రబాబు

రజకుల కోసం ఆధునిక సదుపాయాలు
రాష్ట్రంలోని రజకుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 25 మందికి మించి ఉన్న ప్రతి చోట ఆధునిక ధోబీఘాట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇస్త్రీ చేసుకునే కోసం షెడ్లు, సోలార్‌ లేదా విద్యుత్తుతో నడిచే తోపుడు బండ్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వడ్డెరుల కోసం క్వారీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటామన్నారు.

యూనివర్సల్‌ హెల్త్‌కార్డు, యువతకు ఉద్యోగ మేళాలు
రాష్ట్రంలో త్వరలోనే యూనివర్సల్‌ హెల్త్‌కార్డ్‌ అమలులోకి రానుంది. డిజిటల్‌ కార్డుల రూపంలో ఇది అందుబాటులోకి రానుందని ఏపీ సీఎం వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల కేవైసీ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలన్నారు. ప్రతి జిల్లాలో యువతకు ఉపాధి కల్పించేలా జాబ్ మేళాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.

క్రైస్తవుల కోసం చర్చిల నిర్మాణానికి ఆర్థిక సాయం
క్రైస్తవులకు సంబంధించిన చర్చిల నిర్మాణానికి మరియు మరమ్మతులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. జెరూసలేం యాత్రికులకు కూడా ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. క్రైస్తవ ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిపి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడ హజ్‌హౌస్‌ను త్వరలో పూర్తి చేస్తామన్నారు. మసీదుల నిర్వహణ కోసం ప్రతి మసీదుకు రూ.5,000 ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

సుప్రీంకోర్టు జీవో 3ను కొట్టేసిన నేపథ్యంలో, గిరిజనుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం త్వరలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనుందని సీఎం చెప్పారు. వారికి న్యాయం జరిగేలా ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వ్యాపారాల విషయంలో భయపడిన ఆర్యవైశ్యులకు అనువైన వాతావరణాన్ని కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించామని పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కాపు భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన భూములను కేటాయించనున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు సీవీడ్ సాగుతో మంచి జీవనోపాధిని కల్పించేందుకు ప్రత్యేక శాఖ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ మోడల్‌ పై ప్రశంసలు
బ్రాహ్మణ కార్పొరేషన్‌ తీసుకున్న మోడల్‌ను ఇతర కార్పొరేషన్లు కూడా అనుసరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ నిధులను కార్పస్‌ ఫండ్‌గా నిలుపుకొని, దాతల సహాయంతో శాశ్వత ఆదాయాన్ని సృష్టించడం, ఆస్తుల సేకరణ వంటి మోడల్‌ సరైనదని చెప్పారు. కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములుగా మార్చిన తీరు అభినందనీయం అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Breaking News: డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget