అన్వేషించండి

CM Chandrababu: 'టీడీపీ కొనసాగుంటే 2021లోనే పోలవరం పూర్తి' - ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం

AP Assembly Sessions: 2014 -19 మధ్య రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై శుక్రవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు.

White Paper On Financial Status Of Andhrapradesh: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఆదాయ వనరులు బాగా తగ్గాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.11,762 కోట్లు కేటాయించామని.. 2019లో టీడీపీ అధికారంలో కొనసాగుంటే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తై ఉండేదని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేశారు. 'రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. విభజన సమయంలో చాలా సమస్యలు వచ్చాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో 52 శాతం ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వచ్చింది. 2014 - 19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఏపీని నిలిపాం. రూ.16 లక్షల కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నాం. రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయి.' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నుంచి వైసీపీ పాలన వరకూ రాష్ట్ర పరిస్థితిని వివరించారు.

'అభివృద్ధి చేసుంటే..'

 విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో పింఛన్లు సైతం రావనే పరిస్థితులు నెలకొన్నాయని.. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువగా ఉందన్నారు. 'ప్రముఖ కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో సమస్యలు పరిష్కారం కాలేదు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చింది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం కలిసివచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుంది. పోలవరం పూర్తైతే ప్రతి ఎకరాకు నీరందుతుంది. టీడీపీ హయాంలో రూ.1667 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చింది. వైసీపీ హయాంలో పట్టిసీమను సరిగ్గా నిర్వహించలేదు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప ఎయిర్ పోర్ట్స్ అభివృద్ధి చేశాం. విశాఖ - చెన్నై, చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్‌లో 34 శాతం ఖర్చు చేశాం.' అని చంద్రబాబు వివరించారు.

Also Read: Jagan : "జగన్‌ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget