అన్వేషించండి

CM Chandrababu: 'టీడీపీ కొనసాగుంటే 2021లోనే పోలవరం పూర్తి' - ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం

AP Assembly Sessions: 2014 -19 మధ్య రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై శుక్రవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు.

White Paper On Financial Status Of Andhrapradesh: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఆదాయ వనరులు బాగా తగ్గాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.11,762 కోట్లు కేటాయించామని.. 2019లో టీడీపీ అధికారంలో కొనసాగుంటే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తై ఉండేదని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేశారు. 'రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. విభజన సమయంలో చాలా సమస్యలు వచ్చాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో 52 శాతం ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వచ్చింది. 2014 - 19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఏపీని నిలిపాం. రూ.16 లక్షల కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నాం. రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయి.' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నుంచి వైసీపీ పాలన వరకూ రాష్ట్ర పరిస్థితిని వివరించారు.

'అభివృద్ధి చేసుంటే..'

 విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో పింఛన్లు సైతం రావనే పరిస్థితులు నెలకొన్నాయని.. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువగా ఉందన్నారు. 'ప్రముఖ కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో సమస్యలు పరిష్కారం కాలేదు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చింది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం కలిసివచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుంది. పోలవరం పూర్తైతే ప్రతి ఎకరాకు నీరందుతుంది. టీడీపీ హయాంలో రూ.1667 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చింది. వైసీపీ హయాంలో పట్టిసీమను సరిగ్గా నిర్వహించలేదు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప ఎయిర్ పోర్ట్స్ అభివృద్ధి చేశాం. విశాఖ - చెన్నై, చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్‌లో 34 శాతం ఖర్చు చేశాం.' అని చంద్రబాబు వివరించారు.

Also Read: Jagan : "జగన్‌ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
Pantangi Toll Plaza: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
The Raja Saab Movie Review - 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
Embed widget