అన్వేషించండి

AP Cabinet Meeting Decisions June 2026: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు

Chandrababu Serious on AgriGold issue: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఏపీ సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకంగా 31 కొత్త పోస్టులను మంజూరు చేశారు.

Agri Gold Victims: ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠిన వైఖరి అవలంబించారు. అమరావతి సచివాలయంలో గురువారం  నాడు సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారుల అలసత్వం అడ్డంకిగా మారడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

 ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి నిప్పులు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ ఇష్యూ ప్రస్తావనకు రాగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బాధితుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఏర్పాటు చేయాల్సిన కేబినెట్ సబ్ కమిటీ  ప్రక్రియ ఎందుకు పెండింగ్‌లో పడిందంటూ సీఎం అధికారులను నిలదీశారు.  బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ, యంత్రాంగంలో ఈ స్థాయి నిర్లక్ష్యం ఏంటి  అంటూ ఉన్నతాధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాల్లో తాత్సార్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

 ఆరు నెలల డెడ్‌లైన్ - మంత్రుల బృందం ఏర్పాటు 

గత ప్రభుత్వాల హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్, నిధుల రికవరీ ప్రక్రియలో జరిగిన లోపాలను, సిఐడి   అధికారుల వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా, త్వరలోనే మంత్రుల బృందాన్ని అధికారికంగా రంగంలోకి దించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే ఆరు నెలల కాలంలోనే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాధితుల క్లెయిమ్‌లను పరిశీలించి, వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కార్యాచరణ ముగించాలని అధికారులకు ఖచ్చితమైన డెడ్‌లైన్‌ విధించారు.

 వేగవంతానికి 31 కొత్త పోస్టుల మంజూరు 

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, సమస్యను వేగంగా కొలిక్కి తెచ్చేందుకు చంద్రబాబు కేబినెట్ ఒక కీలకమైన పరిపాలనా నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రిగోల్డ్ కేసుల విచారణను, లీగల్ కాంప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా 31 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త పోస్టుల్లో న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారులు , అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉంటారు. వీరి ద్వారా బాధితుల దరఖాస్తుల స్క్రీనింగ్,  ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం కానుంది.

అమరావతి అభివృద్ధి, ఇతర కీలక కేబినెట్ నిర్ణయాలు 

అగ్రిగోల్డ్ ఇష్యూతో పాటు ఈ కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధిపై సర్కార్ పెద్ద పీట వేసింది. అమరావతి హైకోర్టు పరిసర ప్రాంతాల్లో రూ. 547 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు, అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 20కి పైగా కీలక ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల మండలి.. రాష్ట్రంలో ఉపాధి కల్పన, మౌలిక వసతులు మరియు కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేసింది.
 
దాదాపు 11 లక్షలకు పైగా బాధితులు ఉన్న అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని త్వరగా ముగించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయం వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సీఎం స్వయంగా గడువు విధించి, కొత్త పోస్టులను మంజూరు చేయడం ద్వారా ఈ ప్రక్రియలో ఇకపై జాప్యానికి తావుండదని స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. మరి ఈ కొత్త 31 పోస్టుల నియామకం, కేబినెట్ సబ్ కమిటీల నివేదికల అనంతరం ఆరు నెలల్లో బాధితుల చేతికి డబ్బులు ఎలా అందుతాయనేది వేచి చూడాలి. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Meeting Decisions June 2026: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు
అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు
Arunachalam Giri Pradakshina Gang Rape Case: అరుణాచలం వెళ్లడానికి ఆలోచించాల్సిందే - భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేర ముఠాలు !
అరుణాచలం వెళ్లడానికి ఆలోచించాల్సిందే - భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేర ముఠాలు !
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Janhvi Kapoor: 'పెద్ది'గాడి విజయం కోసం 3500 మెట్లు ఎక్కిన హీరోయిన్... తిరుమలలో జాన్వీ కపూర్
'పెద్ది'గాడి విజయం కోసం 3500 మెట్లు ఎక్కిన హీరోయిన్... తిరుమలలో జాన్వీ కపూర్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Kerala Menstrual Leave for Schoolgirls:కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Peddi Vs Pushpa: పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
Embed widget