అన్వేషించండి

AP Cabinet Meeting Decisions June 2026: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు

Chandrababu Serious on AgriGold issue: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఏపీ సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకంగా 31 కొత్త పోస్టులను మంజూరు చేశారు.

Agri Gold Victims: ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠిన వైఖరి అవలంబించారు. అమరావతి సచివాలయంలో గురువారం  నాడు సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారుల అలసత్వం అడ్డంకిగా మారడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

 ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి నిప్పులు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ ఇష్యూ ప్రస్తావనకు రాగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బాధితుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఏర్పాటు చేయాల్సిన కేబినెట్ సబ్ కమిటీ  ప్రక్రియ ఎందుకు పెండింగ్‌లో పడిందంటూ సీఎం అధికారులను నిలదీశారు.  బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ, యంత్రాంగంలో ఈ స్థాయి నిర్లక్ష్యం ఏంటి  అంటూ ఉన్నతాధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాల్లో తాత్సార్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

 ఆరు నెలల డెడ్‌లైన్ - మంత్రుల బృందం ఏర్పాటు 

గత ప్రభుత్వాల హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్, నిధుల రికవరీ ప్రక్రియలో జరిగిన లోపాలను, సిఐడి   అధికారుల వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా, త్వరలోనే మంత్రుల బృందాన్ని అధికారికంగా రంగంలోకి దించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే ఆరు నెలల కాలంలోనే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాధితుల క్లెయిమ్‌లను పరిశీలించి, వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కార్యాచరణ ముగించాలని అధికారులకు ఖచ్చితమైన డెడ్‌లైన్‌ విధించారు.

 వేగవంతానికి 31 కొత్త పోస్టుల మంజూరు 

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, సమస్యను వేగంగా కొలిక్కి తెచ్చేందుకు చంద్రబాబు కేబినెట్ ఒక కీలకమైన పరిపాలనా నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రిగోల్డ్ కేసుల విచారణను, లీగల్ కాంప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా 31 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త పోస్టుల్లో న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారులు , అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉంటారు. వీరి ద్వారా బాధితుల దరఖాస్తుల స్క్రీనింగ్,  ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం కానుంది.

అమరావతి అభివృద్ధి, ఇతర కీలక కేబినెట్ నిర్ణయాలు 

అగ్రిగోల్డ్ ఇష్యూతో పాటు ఈ కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధిపై సర్కార్ పెద్ద పీట వేసింది. అమరావతి హైకోర్టు పరిసర ప్రాంతాల్లో రూ. 547 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు, అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 20కి పైగా కీలక ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల మండలి.. రాష్ట్రంలో ఉపాధి కల్పన, మౌలిక వసతులు మరియు కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేసింది.
 
దాదాపు 11 లక్షలకు పైగా బాధితులు ఉన్న అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని త్వరగా ముగించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయం వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సీఎం స్వయంగా గడువు విధించి, కొత్త పోస్టులను మంజూరు చేయడం ద్వారా ఈ ప్రక్రియలో ఇకపై జాప్యానికి తావుండదని స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. మరి ఈ కొత్త 31 పోస్టుల నియామకం, కేబినెట్ సబ్ కమిటీల నివేదికల అనంతరం ఆరు నెలల్లో బాధితుల చేతికి డబ్బులు ఎలా అందుతాయనేది వేచి చూడాలి. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
Kesineni Brothers War: అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Deputy CM Pawan Kalyan: ఢిల్లీ మెడలు వంచుతాం అనే దక్షిణాది నేతలు అక్కడికి రాగానే భయపడతారు?: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ మెడలు వంచుతాం అనే దక్షిణాది నేతలు అక్కడికి రాగానే భయపడతారు?: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Brothers War: అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
Nagative Campaign on Varanasi: OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
Football World Cup: మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
Vaibhav Sooryavanshi Fight Video: శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Embed widget