అన్వేషించండి

AP Cabinet Meeting Decisions June 2026: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు

Chandrababu Serious on AgriGold issue: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఏపీ సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకంగా 31 కొత్త పోస్టులను మంజూరు చేశారు.

Agri Gold Victims: ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠిన వైఖరి అవలంబించారు. అమరావతి సచివాలయంలో గురువారం  నాడు సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారుల అలసత్వం అడ్డంకిగా మారడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

 ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి నిప్పులు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ ఇష్యూ ప్రస్తావనకు రాగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బాధితుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఏర్పాటు చేయాల్సిన కేబినెట్ సబ్ కమిటీ  ప్రక్రియ ఎందుకు పెండింగ్‌లో పడిందంటూ సీఎం అధికారులను నిలదీశారు.  బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ, యంత్రాంగంలో ఈ స్థాయి నిర్లక్ష్యం ఏంటి  అంటూ ఉన్నతాధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాల్లో తాత్సార్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

 ఆరు నెలల డెడ్‌లైన్ - మంత్రుల బృందం ఏర్పాటు 

గత ప్రభుత్వాల హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్, నిధుల రికవరీ ప్రక్రియలో జరిగిన లోపాలను, సిఐడి   అధికారుల వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా, త్వరలోనే మంత్రుల బృందాన్ని అధికారికంగా రంగంలోకి దించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే ఆరు నెలల కాలంలోనే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాధితుల క్లెయిమ్‌లను పరిశీలించి, వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కార్యాచరణ ముగించాలని అధికారులకు ఖచ్చితమైన డెడ్‌లైన్‌ విధించారు.

 వేగవంతానికి 31 కొత్త పోస్టుల మంజూరు 

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, సమస్యను వేగంగా కొలిక్కి తెచ్చేందుకు చంద్రబాబు కేబినెట్ ఒక కీలకమైన పరిపాలనా నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రిగోల్డ్ కేసుల విచారణను, లీగల్ కాంప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా 31 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త పోస్టుల్లో న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారులు , అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉంటారు. వీరి ద్వారా బాధితుల దరఖాస్తుల స్క్రీనింగ్,  ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం కానుంది.

అమరావతి అభివృద్ధి, ఇతర కీలక కేబినెట్ నిర్ణయాలు 

అగ్రిగోల్డ్ ఇష్యూతో పాటు ఈ కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధిపై సర్కార్ పెద్ద పీట వేసింది. అమరావతి హైకోర్టు పరిసర ప్రాంతాల్లో రూ. 547 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు, అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 20కి పైగా కీలక ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల మండలి.. రాష్ట్రంలో ఉపాధి కల్పన, మౌలిక వసతులు మరియు కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేసింది.
 
దాదాపు 11 లక్షలకు పైగా బాధితులు ఉన్న అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని త్వరగా ముగించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయం వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సీఎం స్వయంగా గడువు విధించి, కొత్త పోస్టులను మంజూరు చేయడం ద్వారా ఈ ప్రక్రియలో ఇకపై జాప్యానికి తావుండదని స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. మరి ఈ కొత్త 31 పోస్టుల నియామకం, కేబినెట్ సబ్ కమిటీల నివేదికల అనంతరం ఆరు నెలల్లో బాధితుల చేతికి డబ్బులు ఎలా అందుతాయనేది వేచి చూడాలి. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Gym Trainer Case: విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
MCGS MSME Scheme: మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget