అన్వేషించండి

Badvel By Poll: బద్వేల్ లో బైపోల్ కాదు బస్ పోల్... వైసీపీ భారీగా రిగ్గింగ్ పాల్పడిందని బీజేపీ ఆరోపణ... రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్

బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు. బద్వేల్ బై పోల్ కాదని బస్ పోల్ అన్నారు. భారీగా రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. బద్వేల్ ఉపఎన్నికలో భారీగా రిగ్గింగ్‌ జరిగిందన్నారు. పోలీసులు కూడా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునల్‌ దేవ్‌ధర్‌తో కలిసి జీవీఎల్‌ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. పక్క నియోజకవర్గాల నుంచి అద్దె ఓటర్లను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. ఎన్నికల్ని అపహాస్యం చేసేలా వైసీపీ వ్యవహరించిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బద్వేలులో తిష్టవేసి దొంగ ఓట్లు వేయించారని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన పోలింగ్‌లో కనీసం  50 నుంచి 60 వేల దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. బద్వేలులోని 28 పోలింగ్‌ కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని విమర్శించారు. ఎన్నికల అధికారులు, పరిశీలకులు కేవలం ప్రేక్షకపాత్రకు పరిమితం అయ్యారన్నారు. అక్రమాలు జరిగిన చోట్ల రీపోలింగ్‌ జరపాలని ఈసీని కోరామని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Also Read: బద్వేలులో 70 శాతానికిపైగా పోలింగ్.. కలకలం రేపిన దొంగ ఓటర్లు !

బీజేపీ ఏజెంట్లకు బెదిరింపులు

బద్వేల్ ఉపఎన్నిక సీఎం జగన్, వైసీపీల అక్రమాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మాట, మడమ తిప్పని పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. ఆదివారం కడపలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ తీరుపై విమర్శలు చేశారు. బద్వేల్‌ పోలింగ్ చూస్తే 55 శాతం కూడా ఓటింగ్ మించకూడదని, కానీ దొంగ ఓట్లు వల్ల ఓటింగ్ శాతం పెరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. ఓటమి భయంతో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వైసీపీ నాయకులు బీజేపీ ఏజెంట్లను బెదిరించారన్నారు. తిరుపతి ఉప ఎన్నికలా అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. 

Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ! 

బద్వేల్ లో ప్రజాస్వామ్యం ఖూనీ

బద్వేల్‌లో దొంగ ఓటర్లు బారులు తీరారని సోము వీర్రాజు విమర్శించారు. సిద్ధవటం, కడప, ప్రొద్దుటూరు నుంచి అద్దె ఓటర్లను వాహనాల్లో తరలించారన్నారని ఆరోపించారు. బద్వేలు ఉప ఎన్నికలో అడుగడుగునా దౌర్జన్యాలు జరిగాయన్నారు. అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించి, ప్రజాస్వా్మ్యాన్ని ఖూనీ చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేలులోని 28 చోట్లలో రీపోలింగ్ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీలా బీజేపీకి దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దొంగ ఓట్లు వేయించుకునే వైసీపీకి బీజేపీ గురించి మాట్లాడే హక్కులేదన్నారు. బద్వేల్‌లో బై పోల్ జరగలేదని, బస్ పోల్ అని ఎద్దేవా చేశారు.

Also Read: వైసీపీ మాటలకు అర్థాలే వేరులే... వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి... విశాఖ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget