Breaking News Live: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్కు కరోనా పాజిటివ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 12న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఆమడగూరు మండలం మొలకవారిపల్లి ఎగువ తాండలో విషాదం చోటుచేసుకుంది. నిన్న చెరువులో గల్లంతైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతదేహాలను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాల వెలికితీతకు వర్షంలో రాత్రంతా పోలీసులు, గ్రామస్థులు శ్రమించారు.
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్కు కరోనా పాజిటివ్
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కి కరోనా సోకింది. గత రెండు మూడు రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రి గంగుల ఇబ్బంది పడుతున్నారు. నేడు జరిగిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా ఆయనను నేరుగా కలిసిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఈటల రాజేందర్ పై ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు చేశారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పార్టీ, పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతల దాడి చేశారని మరోవైపు ఫిర్యాదు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించి సభ నిర్వహించడంతో పాటు టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లును తప్పుదోవ పట్టించడం, టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ కు తెలిపారు.





















