అన్వేషించండి

Ambati Rambabu: కేంద్ర బృందం ప్రశంసిస్తే కేంద్ర మంత్రి విమర్శలా.... వరదల్ని మానవ తప్పిదంతా చిత్రీకరించేందుకు ప్రయత్నం

అధికారం లేకపోయే సరికి చంద్రబాబుకు అన్నీ విషాద దినాలుగా కనిపిస్తాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. అన్నమయ్య కట్ట తెగిపోతే మానవ తప్పిదంగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం చాలా దురదృష్టకరమని, ఆయన మరణానికి సంతాప సూచకంగా.. రెండు తెలుగు రాష్ట్రాలు మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ సంతాప దినాల్లో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలకు ప్రతి విమర్శ చేసే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబుకు సంతాప దినాలు లేవు... సంతోష దినాలు లేవని.. అధికారం లేకపోతే అన్ని దినాలను విషాద దినాలుగా భావించే మనస్తత్వం చంద్రబాబుదని విమర్శించారు.  

ప్రకృతి విపత్తుని మానవ తప్పిదంగా చిత్రీకరిస్తూ విమర్శలు

ఇటీవల రాయలసీమలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సగటున 10.7 శాతం వర్షపాతం నమోదైందన్నారు. కొండకు చిల్లు పడిందా.. అన్నట్టు కుండపోత వర్షాలు పడ్డాయని, దీంతో ఊహించని విపత్తు సంభవించిందన్నారు. తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. అన్నమయ్య డ్యామ్ కట్ట తెగి ఊళ్ల మీదకు వరద పోటెత్తిందని తెలిపారు. అన్నమయ్య కట్ట తెగడం మీద విమర్శలు చేస్తున్నారని, ఇది మానవ తప్పిదం కాదన్నారు. కానీ మానవ తప్పిదంగా చిత్రీకరించి వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  అసత్యాలు ప్రచారం చేసి ఏదోరకంగా ప్రభుత్వం పరువు తీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో పెరిగిందంటే సీఎం జగన్ వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే.. "అక్కడ ప్రజలు తిరగబడలేదట. ఆయనతో ప్రేమగా మాట్లాడారట. ఇంత వరదలు వస్తే... జగన్ పై నిప్పులు చెరగాలి, దూషించాలి.. గడ్డం పట్టుకుంటారేంటే.. ఈ ప్రజలకు బుద్ధి ఉందా లేదా.." అని ప్రజల మీద చంద్రబాబు తిరుగుబాటు ప్రకటించారని అంబటి అన్నారు. 

కేంద్ర మంత్రి తెలుసుకుని మాట్లాడాలి

సీఎం జగన్ కంటే ముందుగానే చంద్రబాబు వరద ప్రాంతాలకు వెళ్లి తానే ముందు వచ్చానని.. అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి ఆరోపించారు. చంద్రబాబు అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించడానికి బదులు "నా సతీమణిని తిట్టారు. మీరే న్యాయం చెప్పండి.." అంటూ బాధల్లో ఉన్నవారిని ఓదార్చాల్సింది పోయి, ఆయన బాధ చెప్పుకున్నారని విమర్శించారు.  అన్నమయ్య కట్ట తెగిపోతే ఇది మానవ తప్పిదమా... ప్రకృతి విపత్తా.. అన్నది కేంద్ర మంత్రికైనా, రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతకైనా వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. సుజనా చౌదరో, సీఎం రమేష్ బ్యాక్ గ్రౌండ్ ఇస్తే.. వాళ్ల ఇచ్చిన రిపోర్టును పార్లమెంటులో చదవటం కాదని అంబటి విమర్శించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులు, జరిగిన నష్టంపై అంచనా వేసి వాస్తవాలను నివేదించాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపించిందని, ఆ బృందం రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసించిదని గుర్తుచేశారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ఎవరో చెప్పింది విన్నారని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు రిపేరు చేయాలని 2017లోనే డ్యామ్ సేఫ్టీ నిపుణులు రిపోర్టు ఇచ్చారు, కానీ అప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదని అంబటి విమర్శించారు. 

Also Read: విశాఖ ఆర్కే బీచ్ లో ముందుకొచ్చిన సముద్రం... 200 మీటర్ల మేర కోతకు గురైన బీచ్... పర్యాటకులకు నో ఎంట్రీ

ఓటీఎస్ లో ఏం మోసం ఉంది 

రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం చేసినా చంద్రబాబు విర్శమలు చేస్తుంటారని అంబటి అన్నారు. పేదల పక్కా ఇళ్లకు సంబంధించి వన్ టైం సెటిల్ మెంటు(ఓటీఎస్) స్కీములో మీరెవరూ కట్టొద్దు అని చంద్రబాబు చెబుతున్నారు.  ఆ స్కీంలో ఏం మోసం ఉందో చెబితే బాగుండేదని అంబటి రాంబాబు అన్నారు. పక్కా ఇళ్ల లబ్ధిదారులకు ఓటీఎస్ పథకం ద్వారా పరిపూర్ణమైన హక్కులు కల్పిస్తుంటే వాటిని అమ్ముకోవచ్చు, బ్యాంకులలో పెట్టుకోవచ్చు.. అని చెబుతుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట...? అని విమర్శించారు. 

Also Read: ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget