అన్వేషించండి

Breaking News Live: సాగర్ కెనాల్ లో కారు బోల్తా... కారులో ఎమ్మెల్యే సోదరుడి కుటుంబం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: సాగర్ కెనాల్ లో కారు బోల్తా... కారులో ఎమ్మెల్యే  సోదరుడి కుటుంబం

Background

చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర విషాదం చోటు చేసుకుంది. మున్నేరు వాగులో ఐదుగురు చిన్నారులు గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. బాల ఏసు, చరణ్‌, అజయ్‌తో పాటు మరో చిన్నారి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీసింది. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారుల మృతదేహాలను చూసి బోరున తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో ఏటూరులో విషాదఛాయలు అలముకున్నాయి. గల్లంతైన విషయం తెలిసి మునేటి ఒడ్డుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌసల్ ఆదేశాల మేరకు ఘటనా ప్రాంతంలోనే అధికారులు పంచనామాకు ఏర్పాట్లు చేశారు.

సెల్ ఫోన్ కోసం ఘర్షణ.. ఒకరి హత్య
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం సేవించిన ఇద్దరు కూలీలు సెల్‌ఫోన్‌ కోసం గొడవపడ్డారు. ఈ క్రమంలో భూక్య బీమా అనే 45 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి బండరాళ్లతో కొట్టి చంపి పారిపోయాడు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

బంగారం, వెండి ధరలు
ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,500 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,550 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,300గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,550గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,500 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,550గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,300గా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది వారాలుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత వారం రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. నేడు (జనవరి 11) కూడా పాత ధరలే కొనసాగుతున్నాయి. పెట్రోల్ రూ.107.69 గా ఉండగా.. డీజిల్ ధర కూడా అలాగే రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.10 పైసలు పెరిగి రూ.110.03 గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు పెరిగి రూ.96.32 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.19 పైసలు తగ్గి రూ.110.29గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.20 పైసలు తగ్గి రూ.96.36 గా ఉంది.

22:03 PM (IST)  •  11 Jan 2022

గుంటూరు జిల్లాలో సాగర్ కెనాల్ లో కారు బోల్తా... కారులో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు

గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగోప్పల గ్రామ పరిధిలోని సాగర్ మెయిన్ కెనాల్ లో కారు బోల్తా పడింది. కారులో పిన్నెల్లి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్ మోహన్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మదన్ మోహన్ రెడ్డి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సోదరుడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. 

 

 

15:09 PM (IST)  •  11 Jan 2022

సంకీస గ్రామంలో కరోనా కలకలం... 12 మంది అయ్యప్పస్వాములకు కరోనా పాజిటివ్... 

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో పెరుమాండ్ల సంకీస  గ్రామంలో కరోనా కలకలం రేగింది. పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన 12 మంది అయ్యప్ప స్వాములకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల శబరి యాత్ర చేసి 40 మంది స్వాములు గ్రామానికి తిరిగి వచ్చారు. వీరిలో 12 మందికి కరోనా పాజిటివ్  అని తేలింది. దీంతో గ్రామంలో వైద్యాధికారులు గ్రామస్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

12:44 PM (IST)  •  11 Jan 2022

పిల్లల్ని బావిలో పడేసిన తండ్రి!

* మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో విషాదం
* మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెంలోని బావిలో ఇద్దరు పిల్లలు మృతదేహలు గుర్తింపు
* తండ్రి భూక్య రాము పిల్లలను బావిలో పడేసినట్లు అనుమానిస్తున్న స్థానికులు
* భార్య- భర్తల మధ్య గొడవలే కారణమని అనుమానం..
* సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..
* వివరాలు సేకరించి, విచారణ ప్రారంభించిన పోలీసులు
* మృతులు భూక్య అమ్మి జాక్సన్ (11), భూక్య జానిబేస్టో (9)
* పరారీలో తండ్రి రాము కుమార్ 
* బందువుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మహబూబూబాద్ రూరల్ పోలీసులు

12:14 PM (IST)  •  11 Jan 2022

హన్మకొండ చౌరస్తాలో డేడ్ బాడీ కలకలం

* హన్మకొండ చౌరస్తాలో డేడ్ బాడీ కలకలం

* హన్మకొండ చౌరస్తాలోని స్నేహబార్ ముందు పార్క్ చేసి ఉన్న ఇన్నోవా కారులో డేడ్ బాడీ

* సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

* ఇన్నోవా కారును పరీశీలించి, వివరాలు సేకరిస్తున్న పోలీసులు

* హన్మకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న స్థానికులు

11:07 AM (IST)  •  11 Jan 2022

మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా పాజిటివ్

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. జలుబు, దగ్గు వంటి స్వల్ప లక్షణాలతో పరీక్ష చేయించుకోగా.. కరోనా నిర్ధరణ అయినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వాళ్లంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. మహమ్మారి సోకుతోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.

10:20 AM (IST)  •  11 Jan 2022

వరంగల్ కేఎంసీలో 42కు చేరిన కరోనా కేసులు

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా భయం వదలట్లేదు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 42కు చేరాయి. నిన్న ప్రిన్సిపాల్ మోహన్ దాస్ సహా 26 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. దీంతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP DesamAshutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget