అన్వేషించండి

Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Andhra Pradesh telangana breaking news live updates on 21th May 2022 Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
బ్రేకింగ్ న్యూస్(ప్రతీకాత్మక చిత్రం)

Background

భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(శనివారం) గ్రాముకి రూ.40 పెరిగింది. వెండి ధరలు 100 గ్రాములకు రూ.90 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.50,950గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవాళ(శనివారం) భారీగా పెరిగాయి. తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకి రూ.40 పెరిగి, హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో 10 గ్రాముల ధర రూ.46,700గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకి రూ.44 పెరిగి ప్రస్తుతం రూ.50,950(10 గ్రాములు) ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర గ్రాముకి రూ.0.90 పెరిగి హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,900(ఒక కేజీ) అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల ధర రూ.50,950

దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210

ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700,, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

వెండిధరలు: 

భారత మార్కెట్ లో వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.61,700 ఉండగా, చెన్నైలో రూ.65,900గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.61,700 ఉండగా, కోల్‌కతాలో రూ.61,700, బెంగళూరులో కిలో వెండి రూ.65,900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 ఉండగా, విజయవాడలో రూ.65,900 విశాఖలో రూ. 65,900  వద్ద కొనసాగుతోంది.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం

పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

19:21 PM (IST)  •  21 May 2022

Guntur Crime: గుంటూరు పెదపలకలురులోని ఓ కాలేజ్ పై నుండి దూకిన యువతి

గుంటూరు పెదపలకలురులోని ఓ కాలేజ్ పై నుండి దూకిన యువతి. 
యువతికి స్వల్ప గాయాలు, జి.జి.హెచ్ కి తరలింపు
డిగ్రీ పరీక్ష రాసేందుకు వచ్చిన యువతి.
గత కొంతకాలంగా యువకుడితో ప్రేమలో ఉన్న యువతి.
ప్రేమ వివాహాన్ని ఒప్పుకోరన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న పోలీసులు

18:51 PM (IST)  •  21 May 2022

Fuel Price: వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించింది. పెట్రోల్ పై రూ.9.5, డీజిల్ లీటర్ పై రూ.7 మేర తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ పై రూ.8 తగ్గించగా, డీజిల్ పై రూ.7 మేర తగ్గించినట్లు తెలిపారు.

18:26 PM (IST)  •  21 May 2022

KCR Delhi Tour: సర్వోదయ స్కూల్‌ను సందర్శిస్తున్న కేసీఆర్, కేజ్రీవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శిస్తున్నారు. పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న సిఎం కెసిఆర్ బృందానికి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సమావేశ మందిరంలో విద్యాభివృద్ధి పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సిఎం కెసిఆర్ తిలకిస్తున్నారు. ఢిల్లీలో విద్యాభివృద్ధి దిశగా కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, స్కూల్ కరికులమ్ లను, అక్కడి అధికారులు సహా ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ సిఎం కెసీఆర్ కు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి  సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, మంత్రి వేముల ఫ్రశాంత్రెడ్డి ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ తదితరలు పాల్గొన్నారు

18:25 PM (IST)  •  21 May 2022

MLC Kavitha: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల మార్కెట్ :  తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్ అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెసోళ్లు రైతు రచ్చబండ పేరుతో గ్రామాలకు వస్తే ప్రకృతివనాలు, డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు చూపించాలన్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు, అందులో పొందుపరిచిన అంశాలను వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేశారో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేయలేనివి తెలంగాణ లో అమలు చేస్తామంటూ చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించరు, పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై ఎందుకు విమర్శించరు, ఇరు పార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందన్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా 50 వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది. దేశంలో ఎక్కడైనా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు అందించారా అని ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, బీజేపీలకు లేనే లేదన్నారు.

15:00 PM (IST)  •  21 May 2022

కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ వద్ద డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే కాకినాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం అనుమానాస్ప‌ద స్థితి నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్యం మృత‌దేహానికి కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వ‌హిస్తున్నారని.. టీడీపీ నిజ‌నిర్ధార‌ణ బృందం శనివారం ఆసుపత్రికి వెళ్లింది. టీడీపీ నేతలను ఆసుపత్రిలోకి రానివ్వకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే సుబ్రహ్మణ్యం మృతిపై నిజనిజాలు తేలే వరకు పోరాటం కొనసాగుతుందని చెబుతోన్న టీడీపీ నేతలు బారీకేడ్లను తోసుకుంటూ కాకినాడ జీజీహెచ్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Land Rates Increase: తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు, హైదరాబాద్ కోర్ రీజియన్‌లో 30-50 శాతం పెంపు!
తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు, హైదరాబాద్ రీజియన్‌లో 30-50 శాతం పెంపు!
Bhogapuram International Airport: భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అప్‌డేట్.. 2026 జూన్ నాటికి పనులు పూర్తి
భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అప్‌డేట్.. 2026 జూన్ నాటికి పనులు పూర్తి
Hyderabad Tragedy: హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం, కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం, కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
Vijay Deverakonda Rashmika mandanna: న్యూయార్క్‌లో విజయ్ దేవరకొండ రష్మిక - పరేడ్ 'గ్రాండ్ మార్షల్'గా అరుదైన గౌరవం
న్యూయార్క్‌లో విజయ్ దేవరకొండ రష్మిక - పరేడ్ 'గ్రాండ్ మార్షల్'గా అరుదైన గౌరవం
Advertisement

వీడియోలు

Asia Cup 2025 Surya Kumar Yadav | కెప్టెన్ గా రాణిస్తున్నా..ఆటగాడిగా ఫెయిల్ అవుతున్న SKY | ABP Desam
Asia Cup 2025 Team India Selection | ఆసియా కప్ భారత జట్టులో ఊహించని మార్పులు.? | ABP Desam
Pakistan Man Illegal Affair in Hyderabad | హైదరాబాద్ లో లవ్ జిహాద్ కేసు | ABP Desam
Why not Pulivendula Slogan Win | కుప్పంను కొడదామనుకున్నారు..పులివెందులే పోయింది | ABP Desam
Tollywood Workers Strike | ఆ ఒక్క మెసేజ్ తో సమ్మె విరమించడానికి మేం సిద్దంగా ఉన్నాం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land Rates Increase: తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు, హైదరాబాద్ కోర్ రీజియన్‌లో 30-50 శాతం పెంపు!
తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు, హైదరాబాద్ రీజియన్‌లో 30-50 శాతం పెంపు!
Bhogapuram International Airport: భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అప్‌డేట్.. 2026 జూన్ నాటికి పనులు పూర్తి
భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అప్‌డేట్.. 2026 జూన్ నాటికి పనులు పూర్తి
Hyderabad Tragedy: హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం, కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం, కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
Vijay Deverakonda Rashmika mandanna: న్యూయార్క్‌లో విజయ్ దేవరకొండ రష్మిక - పరేడ్ 'గ్రాండ్ మార్షల్'గా అరుదైన గౌరవం
న్యూయార్క్‌లో విజయ్ దేవరకొండ రష్మిక - పరేడ్ 'గ్రాండ్ మార్షల్'గా అరుదైన గౌరవం
Vizag Steel Plant Privatization: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రైవేటీకరణ నిర్ణయం, 44 టెండర్లను ఆహ్వానించిన మేనేజ్‌మెంట్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రైవేటీకరణ నిర్ణయం, 44 టెండర్లను ఆహ్వానించిన మేనేజ్‌మెంట్
Revanth Reddy: 21న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి, 20 ఏళ్లలో తొలి సీఎంగా అరుదైన రికార్డ్
21న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి, 20 ఏళ్లలో తొలి సీఎంగా అరుదైన రికార్డ్
This Week Telugu Movies: అనుపమ 'పరదా' To ఉదయభాను 'త్రిబాణధారి బార్బరిక్' వరకూ... - ఈ వీక్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
అనుపమ 'పరదా' To ఉదయభాను 'త్రిబాణధారి బార్బరిక్' వరకూ... - ఈ వీక్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
అంబానీ కాదు, అదానీ అసలే కాదు! - దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కొన్న కేరళ వాసి, ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు
దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్, ఆ డబ్బుతో ఇంకో లగ్జరీ కారు కొనొచ్చు
Embed widget