అన్వేషించండి

TDP Protest: రైతుల కోసం రోడ్డెక్కిన టీడీపీ.. రాయలసీమ జిల్లాల్లో ‘రైతు కోసం తెలుగుదేశం’..

ఏపీలో రైతన్నలకు ఎదురవుతున్న సమస్యలపై పోరాడటానికి టీడీపీ చేపట్టిన ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం ఐదు రోజుల పాటు జరగనున్న నిరసన కార్యక్రమాలు.. రాయలసీమ జిల్లాలతో ఆరంభమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలకు ఎదురవుతున్న సమస్యలపై పోరాడటానికి టీడీపీ చేపట్టిన ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం ఐదు రోజుల పాటు జరగనున్న నిరసన కార్యక్రమాలు.. రాయలసీమ జిల్లాలతో ఆరంభమయ్యాయి. నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లపై ర్యాలీగా వెళ్లి, కూరగాయలు, ఇతర పంటలను నేలపై పోసి నిరసన తెలిపారు. రైతులకు న్యాయం చేయాల్సిందిగా తహసీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలను అందించారు. 

కర్నూలు జిల్లాలో ఇలా.. 
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రైతులకు న్యాయం జరగాలనే టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పత్తికొండ నియోజకవర్గంలో తహసీల్దారు కార్యాలయం ముందు కూరగాయలను నేలపై పోసి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రైతులతో కలసి ట్రాక్టర్లపై తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. బనగానపల్లె, డోన్‌, ఆలూరు నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  

TDP Protest: రైతుల కోసం రోడ్డెక్కిన టీడీపీ.. రాయలసీమ జిల్లాల్లో ‘రైతు కోసం తెలుగుదేశం’..

కడపలో నిరసన కార్యక్రమాలు.. 
కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పులివెందుల పడా కార్యాలయంలో కలెక్టరుకు వినతిపత్రం అందించారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో కేసీ కెనాల్‌ ఆయకట్టు వద్ద రైతులతో నేతలు మాట్లాడారు. వారి సమస్యలపై చర్చించారు. పులివెందుల, కడప ఏడు రోడ్ల కూడలి, బద్వేలు, చెన్నూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో టీడీపీ నేతల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయం వద్ద టమాటాలను నేలపై పారబోసి నిరసన తెలియజేశారు. 

అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున.. 
అనంతపురం జిల్లాల్లో తెలుగు దేశం నేతలు రైతన్నలకు మద్దతుగా తమ గళం విప్పారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుంతకల్లులో ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించగా.. పెనుకొండలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. హిందూపురంలో స్థానిక నాయకులు రోడ్డుపై కూరగాయలు పడవేశారు. కళ్యాణదుర్గం, రాప్తాడు, శింగనమల, పుట్టపర్తిలో నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు.  

Also Read: Cheating Couple : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?

ALso Read: Perni Nani : సినిమా పెద్దల సూచనలతోనే ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు - ఏపీ సర్కార్ క్లారిటీ

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget