అన్వేషించండి

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డుపై త్వరలో కాలుష్య రహిత వాహనాలు… టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ పలు కీలక నిర్ణయాలు

త్వరలో తిరుమల ఘాట్ రోడ్లపై కాలుష్య రహిత వాహనాలు తిరగనున్నాయి. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో తిరుమల అభివృద్ధి పనులు-నిధుల కేటాయింపుపై చర్చించారు.

ఆహ్లాదంగా కనిపించే తిరుమల ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువే. నిత్యం భారీగా తరలివచ్చే భక్తులు ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. రోజూ పది వేలకు పైగా వాహనాలు ఘాట్ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసి విషయానికి వస్తే.. రాష్ట్రంలోనే ఇంధన వ్యయానికి సరిపడా రాబడిని తెచ్చిపెడుతూ ఏపీలో రెండోస్థానంలో తిరుమల ఆర్టీసీ విభాగం ఉంది. అయితే ప్రశాంతమైన సప్తగిరులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయంటే అందుకు కారణం ఆర్టీసీ అని కూడా అంటున్నారు. అందుకే కాలుష్యం వెదజల్లే బస్సులకు చెక్ పెట్టి కాలుష్యరహిత వాహనాలు వినియోగానికి టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య భవన్లో నిర్వహించిన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ మొదటి సమావేశంలో చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి, కన్వీనర్ ఏవి ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు తిరుమల అభివృద్ధిపై  పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


Tirumala: తిరుమల ఘాట్ రోడ్డుపై త్వరలో కాలుష్య రహిత వాహనాలు… టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ పలు కీలక నిర్ణయాలు

గ్రీన్ ఎనర్జీ వినియోగం దిశగా చర్యలు చేపట్టామని, తిరుమలని కాలుష్య రహితంగా తీర్చి దిద్దుతామన్నారు చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి. ఇందుకోసం 35 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేసారు. 35 టాటా ఎనక్స వాహనాలను ఉద్యోగులు కేటాయిస్తామని... కాలుష్య నివారణ టీటీడీ యంత్రాంగంతోనే మొదలెడతామన్నారు. నెలకి రూ.32 వేల చొప్పున చెల్లిస్తారని చెప్పిన అయన... ఐదు సంవత్సరాల అనంతరం వాహనాలు సొంతం అవుతాయన్నారు. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలోనే తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను పరుగులు పెట్టనున్నాయి.

గతేడాది వారం రోజుల పాటు ఒక ఎలక్ట్రికల్ బస్సును ప్రయోగాత్మకంగా తిరుపతి- తిరుమల మధ్య నడిపించారు. 32 మంది కూర్చునే విధంగా ఈ బస్సును అశోక్ లైలాండ్ సంస్థ తయారు చేసింది. ఈ బస్సును నడిపేందుకు అధికారులు అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్‌లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. తిరుమలకు నిత్యం వచ్చే ఆర్.టి.సి బస్సుల స్థానంలో విడతల వారీగా ఈ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.


Tirumala: తిరుమల ఘాట్ రోడ్డుపై త్వరలో కాలుష్య రహిత వాహనాలు… టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ పలు కీలక నిర్ణయాలు

టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ తీసుకున్ననిర్ణయాలు

  • 21-22 డైరీలు, 12 లక్షల క్యాలెండర్లు, 2 లక్షల చిన్న డైరీలు ముద్రణ
  • చినజియర్ స్వామి రాయలసీమలో పర్యటించి ఆలయాలు అభివృద్ధి చేయాలని సూచన
  • మొత్తం పది ఆలయానికి రూ.10 కోట్ల నిధులు కేటాయింపు
  • చిత్తూరు వాయిల్పాడులో ఆలయం రాతి నిర్మాణంకోసం రూ.6 కోట్లు కేటాయింపు
  • నెల్లూరు జిల్లాలో సీతారామ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు కేటాయింపు
  • బర్డ్‌ చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయింపు
  • గో సంరక్షణ కోసం తిరుపతి, తిరుమల, పలమనేరులో మూడు గోశాలలు అభివృద్ధి
  • స్వామివారి నైవేద్యానికి దేశీయ ఆవుల పాలు వినియోగంచాలని నిర్ణయం… త్వరలోనే తిరుమలకు 25 గిర్ ఆవులు
  • స్వామివారి ప్రసాదానికి నెయ్యి తయారీలో భక్తులను భాగస్వామ్యం చేసేందుకు నూతనసేవ నవనీత ప్రారంభం
  • దీపారాధనకి నెయ్యి, భక్తులు విరాళంగా ఇవ్వవచ్చు, దేశీయ ఆవు నెయ్యి మాత్రమే ఇవ్వాలి
  • 15రకాల పంచగవ్య ఉత్పత్తుల-నాలుగు నెలల్లో భక్తులకు అందుబాటులోకి
  • శ్రీవాణికి ప్రాయారిటీ దర్శనం,ఇప్పట్లో దర్శనాల‌ సంఖ్య పెంచేది లేదు
  • శ్రీవాణి ట్రస్టుకి 150 కోట్ల రూపాయలు కేటాయింపు… ట్రస్టు ఆధ్వర్యంలో ఊరికో గుడి నిర్మాణం
  • శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయంలో త్వరలోనే నిర్ణయం

మరోవైపు వర్చువల్‌ సేవ టికెట్లను ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్‌లో అందబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు వర్చువల్‌ సేవ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈనెల 30, 31 తేదీలకు సంబంధించిన వర్చువల్ సేవ టికెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. శనివారం ఉదయం 11 గంటల నుంచి టికెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు టీటీడీ తెలిపింది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Embed widget