Summer Holidays: నేటి నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు, అత్యవసర పిటిషన్ల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు
High court Summer Holidays ఏపీ హైకోర్టుకు మే 12వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇచ్చారు. అత్యవసర పిటిషన్ల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Summer Holidays For AP High Court | అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. నేటి (మే 12వ తేదీ) నుంచి జూన్ 13 వరకు ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు అని వెల్లడించారు. దాంతో తిరిగి జూన్ 16 నుంచి పూర్తిస్థాయి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 15, 22, 29 వ తేదీల్లో విచారణలు చేపడతాయి. ఇందులో భాగంగా మే 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా, జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా విచారణ చేపట్టనున్నారు.
మే 29న జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా విచారణ చేపట్టనుండగా.. జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్బెంచ్గా కేసులు విచారించనున్నారని ఉత్వర్వులలో హైకోర్టు పేర్కొంది.
రెండో దశ వెకేషన్ కోర్టులు జూన్ 5, 12వ తేదీల్లో విచారణ చేపడతాయి. కాగా, జూన్ 5, 12 వ తేదీల్లో జస్టిస్ జస్టిస్ ఎం.కిరణ్మయి, జస్టిస్ టి.సి.డి.శేఖర్ డివిజన్ బెంచ్, జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్గా వ్యవహరించి కేసుల విచారణ నిర్వహిస్తారు.






















