అన్వేషించండి

Devineni Uma Maheswara Rao: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరు

కృష్ణాజిల్లా జి.కొండూరులో నమోదైన కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఇదివరకే ఇరు వైపుల వాదనలు విన్న ఏపీ హైకోర్టు నేడు దేవినేని ఉమకు ఊరట కల్పిస్తూ తీర్పునిచ్చింది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. దేవినేని బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నుంచి సానుకూల స్పందన లభించింది. ఆయనపై కృష్ణాజిల్లా జి.కొండూరులో నమోదైన కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇదివరకే హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు ముగియగా, తీర్పు నేటికి వాయిదా వేసింది. విచారణ ముగియడంతో మాజీ మంత్రి దేవినేనికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

తనపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని, తాను ఏ తప్పు చేయలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మొదట్నుంచీ చెబుతున్నారు. ఫిర్యాదుదారుడు ఎవరో తనకు అసలు తెలియదని, ఆయన సామాజిక వర్గం ఏమిటో కూడా తనకు తెలియదని దేవినేని అన్నారు. ఇదే విషయాన్ని దేవినేని తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. పోలీసులు మాజీ మంత్రిని తప్పుడు కేసులో ఇరికించారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగిన అక్రమ మైనింగ్ విషయం తెలుసుకున్న దేవినేని ఉమ పరిశీలనకు మాత్రమే వెళ్లారని ఆయన లాయర్ కోర్టుకు తెలిపారు.

Also Read: River Boards: తెలంగాణకే కాదు ఏపీకి కూడా "గెజిట్"పై అభ్యంతరాలు.. నదీ బోర్డుల వివాదంలో సరికొత్త ట్విస్ట్..!

మైనింగ్‌ పరిశీలనకు వెళ్లినప్పుడు పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో దేవినేనిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. తనకు బెయిట్ మంజూరు చేయాలని ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దేవినేని ఉమ బెయిట్ దరఖాస్తు పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి.. ఇరువైపుల వాదనలు పూర్తి చేసింది. నేడు మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 

కాగా, మైనింగ్ వద్దకు పరిశీలనకు వెళ్లిన తనపై దాసరి సురేశ్‌ అనే వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశార ని టీడీపీ నేత ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షతోనే దేవినేని ఉమపై కేసు పెట్టారని, ఫిర్యాదుదారుడి ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు ఆధారాలతో వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరైంది. దేవినేని ఉమకు బెయిల్ మంజూరు కావడపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: AP Pensions Late: ఏపీ సర్కార్‌పై నమ్మకం పోతోందా.. కేంద్రమే పెన్షన్ ఇవ్వాలని కోరనున్న రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget