అన్వేషించండి

Devineni Uma Maheswara Rao: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరు

కృష్ణాజిల్లా జి.కొండూరులో నమోదైన కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఇదివరకే ఇరు వైపుల వాదనలు విన్న ఏపీ హైకోర్టు నేడు దేవినేని ఉమకు ఊరట కల్పిస్తూ తీర్పునిచ్చింది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. దేవినేని బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నుంచి సానుకూల స్పందన లభించింది. ఆయనపై కృష్ణాజిల్లా జి.కొండూరులో నమోదైన కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇదివరకే హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు ముగియగా, తీర్పు నేటికి వాయిదా వేసింది. విచారణ ముగియడంతో మాజీ మంత్రి దేవినేనికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

తనపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని, తాను ఏ తప్పు చేయలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మొదట్నుంచీ చెబుతున్నారు. ఫిర్యాదుదారుడు ఎవరో తనకు అసలు తెలియదని, ఆయన సామాజిక వర్గం ఏమిటో కూడా తనకు తెలియదని దేవినేని అన్నారు. ఇదే విషయాన్ని దేవినేని తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. పోలీసులు మాజీ మంత్రిని తప్పుడు కేసులో ఇరికించారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగిన అక్రమ మైనింగ్ విషయం తెలుసుకున్న దేవినేని ఉమ పరిశీలనకు మాత్రమే వెళ్లారని ఆయన లాయర్ కోర్టుకు తెలిపారు.

Also Read: River Boards: తెలంగాణకే కాదు ఏపీకి కూడా "గెజిట్"పై అభ్యంతరాలు.. నదీ బోర్డుల వివాదంలో సరికొత్త ట్విస్ట్..!

మైనింగ్‌ పరిశీలనకు వెళ్లినప్పుడు పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో దేవినేనిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. తనకు బెయిట్ మంజూరు చేయాలని ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దేవినేని ఉమ బెయిట్ దరఖాస్తు పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి.. ఇరువైపుల వాదనలు పూర్తి చేసింది. నేడు మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 

కాగా, మైనింగ్ వద్దకు పరిశీలనకు వెళ్లిన తనపై దాసరి సురేశ్‌ అనే వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశార ని టీడీపీ నేత ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షతోనే దేవినేని ఉమపై కేసు పెట్టారని, ఫిర్యాదుదారుడి ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు ఆధారాలతో వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరైంది. దేవినేని ఉమకు బెయిల్ మంజూరు కావడపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: AP Pensions Late: ఏపీ సర్కార్‌పై నమ్మకం పోతోందా.. కేంద్రమే పెన్షన్ ఇవ్వాలని కోరనున్న రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget