అన్వేషించండి

River Boards: తెలంగాణకే కాదు ఏపీకి కూడా "గెజిట్"పై అభ్యంతరాలు.. నదీ బోర్డుల వివాదంలో సరికొత్త ట్విస్ట్..!

ప్రాజెక్టుల్ని కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని అదే పనిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. ఇప్పుడు తీసుకున్న తర్వాత అభ్యంతరాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.

కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులపై రెండు తెలుగు ప్రభుత్వాలకూ అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. గెజిట్ విషయంలో తమతో సంప్రదించకపోవడం దగ్గర్నుంచి అన్ని ప్రాజెక్టులనూ.. బోర్డులకు కిందకు తేవడంపై నిరసన వ్యక్తం చేస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు. కాబట్టి వారి విషయంలో క్లారిటీ ఉంది. అనూహ్యంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గెజిట్ అమలుకు సహకరించేందుకు సిద్ధంగా లేదు. 

కృష్ణా, గోదావరి బోర్డులపై గెజిట్ విడుదల చేయాలంటూ అదే పనిగా కేంద్రానికి లేఖలు రాసి సాధించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. గెజిట్ అమలుకు సహకరించాలని... హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అధికారులు కోరారు. కానీ ఏపీ అధికారులు మాత్రం తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ అధికారులు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో వారి అభిప్రాయం నమోదు కాలేదు. కానీ ఏపీ అధికారులు హాజరై..  బెర్డు గెజిట్‌లపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని.. అమలుకు సహకరించబోమని చెప్పేశారు. ఏం అభ్యంతరాలో చెప్పమంటే.. తాము ఇక్కడ చెప్పబోమని..నేరుగా కేంద్రానికే చెబుతామని చెప్పి.. వచ్చేశారు. 

ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్ర అధికారులు విస్మయానికి గురయ్యారని జలవనరుల నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రాజెక్టులను ఏపీనే .. కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని మొదట కోరింది. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కృష్ణా జలాల వివాదంలో వివాదాలకు దిగాయి.  సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిలిపివేయాలని ఎన్జీటీ, కేఆర్ఎంబీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని ఆరోపిస్తూ.. తెలంగాణ సర్కార్.. డెడ్ స్టోరేజీ వరకూ అన్ని ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయాలని జీవో జారీ చేసింది. ఆ మేరకు ఉత్పత్తి కూడా చేశారు. ఆ సమయంలో ఏపీ సీఎం జగన్.. ప్రాజెక్టుల్ని కేంద్ర అధీనంలోకి తీసుకోవాలని లేఖలు రాశారు. చివరికి ప్రాజెక్టుల్ని కేంద్ర అధీనంలోకి తీసుకుని బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ... గెజిట్ జారీ చేశారు. 

అయితే ఈ విషయంలో కేంద్రం మరింత చొరవ తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిలోకి... ప్రతీ చిన్న ప్రాజెక్టును చేర్చారు. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతలను చేర్చలేదు. అంటే.. అసలు అ ప్రాజెక్టును గుర్తించలేదన్న మాట. ఈ ప్రాజెక్టుల పరిధిని డిసైడ్ చేస్తూ విడుదల చేసిన గెజిట‌్‌ను అమలు చేస్తే ... ఏపీ తీవ్రంగా నష్టపోతుందని... జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకున్నట్లుగా చెబుతోంది. అన్ని ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి తేవడం వద్దని... కేవలం వివాదం ఉన్న ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధఇలోకి తీసుకుంటే చాలన్నట్లుగా  వాదిస్తోంది. ఇదే అంశాన్ని కేంద్రానికి చెప్పాలని అనుకుంటోంది. అందుకే గెజిట్ అమలుకు సహకరించేందుకు ఏపీ సర్కార్ కూడా వెనుకడుగు వేస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Arava Sridhar: పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget