అన్వేషించండి

River Boards: తెలంగాణకే కాదు ఏపీకి కూడా "గెజిట్"పై అభ్యంతరాలు.. నదీ బోర్డుల వివాదంలో సరికొత్త ట్విస్ట్..!

ప్రాజెక్టుల్ని కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని అదే పనిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. ఇప్పుడు తీసుకున్న తర్వాత అభ్యంతరాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.

కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులపై రెండు తెలుగు ప్రభుత్వాలకూ అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. గెజిట్ విషయంలో తమతో సంప్రదించకపోవడం దగ్గర్నుంచి అన్ని ప్రాజెక్టులనూ.. బోర్డులకు కిందకు తేవడంపై నిరసన వ్యక్తం చేస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు. కాబట్టి వారి విషయంలో క్లారిటీ ఉంది. అనూహ్యంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గెజిట్ అమలుకు సహకరించేందుకు సిద్ధంగా లేదు. 

కృష్ణా, గోదావరి బోర్డులపై గెజిట్ విడుదల చేయాలంటూ అదే పనిగా కేంద్రానికి లేఖలు రాసి సాధించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. గెజిట్ అమలుకు సహకరించాలని... హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అధికారులు కోరారు. కానీ ఏపీ అధికారులు మాత్రం తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ అధికారులు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో వారి అభిప్రాయం నమోదు కాలేదు. కానీ ఏపీ అధికారులు హాజరై..  బెర్డు గెజిట్‌లపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని.. అమలుకు సహకరించబోమని చెప్పేశారు. ఏం అభ్యంతరాలో చెప్పమంటే.. తాము ఇక్కడ చెప్పబోమని..నేరుగా కేంద్రానికే చెబుతామని చెప్పి.. వచ్చేశారు. 

ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్ర అధికారులు విస్మయానికి గురయ్యారని జలవనరుల నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రాజెక్టులను ఏపీనే .. కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని మొదట కోరింది. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కృష్ణా జలాల వివాదంలో వివాదాలకు దిగాయి.  సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిలిపివేయాలని ఎన్జీటీ, కేఆర్ఎంబీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని ఆరోపిస్తూ.. తెలంగాణ సర్కార్.. డెడ్ స్టోరేజీ వరకూ అన్ని ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయాలని జీవో జారీ చేసింది. ఆ మేరకు ఉత్పత్తి కూడా చేశారు. ఆ సమయంలో ఏపీ సీఎం జగన్.. ప్రాజెక్టుల్ని కేంద్ర అధీనంలోకి తీసుకోవాలని లేఖలు రాశారు. చివరికి ప్రాజెక్టుల్ని కేంద్ర అధీనంలోకి తీసుకుని బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ... గెజిట్ జారీ చేశారు. 

అయితే ఈ విషయంలో కేంద్రం మరింత చొరవ తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిలోకి... ప్రతీ చిన్న ప్రాజెక్టును చేర్చారు. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతలను చేర్చలేదు. అంటే.. అసలు అ ప్రాజెక్టును గుర్తించలేదన్న మాట. ఈ ప్రాజెక్టుల పరిధిని డిసైడ్ చేస్తూ విడుదల చేసిన గెజిట‌్‌ను అమలు చేస్తే ... ఏపీ తీవ్రంగా నష్టపోతుందని... జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకున్నట్లుగా చెబుతోంది. అన్ని ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి తేవడం వద్దని... కేవలం వివాదం ఉన్న ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధఇలోకి తీసుకుంటే చాలన్నట్లుగా  వాదిస్తోంది. ఇదే అంశాన్ని కేంద్రానికి చెప్పాలని అనుకుంటోంది. అందుకే గెజిట్ అమలుకు సహకరించేందుకు ఏపీ సర్కార్ కూడా వెనుకడుగు వేస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Advertisement

వీడియోలు

విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
హార్దిక్ కాళ్ళు మొక్కిన ఫ్యాన్ డేంజర్ లో పాండ్య, కోహ్లీ.. ఇంకా!
రివెంజ్‌ ముఖ్యం బిగిలు.. సిరీస్ కొట్టేయాలని పట్టుదలగా ఉన్న టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత పెళ్లి ఫోటోలు... పువ్వల్లే సామ్ నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ చూడండి
సమంత పెళ్లి ఫోటోలు... పువ్వల్లే సామ్ నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ చూడండి
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Bigg Boss Telugu Day 87 Promo : టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
Embed widget