By: ABP Desam | Updated at : 07 Aug 2021 06:59 AM (IST)
ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు
ఆగస్టులో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాల అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 2021-22 ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సొంత మగ్గంపై నేసే కార్మిక కుటుంబాలకు 24 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను బడ్జెట్లో రూ.199 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్నినాని తెలిపారు.
అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు, అనధికారిక ఆవాసాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2019 అక్టోబరు 15 నాటికి.. 300 చదరపు గజాల వరకు ఉన్న వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. జోనల్, రహదారి అభివృద్ధి, బృహత్తర ప్రణాళికల్లో భాగంగా ఉన్న భూములకు, ఆమోదం తెలిపిన లేఅవుట్లకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. 75 చదరపు గజాలు, అడుగుల వరకూ ఉన్న వాటిని భూమి మూల విలువలో 75 శాతం రుసుముతో క్రమబద్ధీకరించాలని తెలిపింది. లబ్ధిదారు కేటగిరీ-1కి చెందినవారైతే ఉచితంగా పట్టా, డీ ఫారం పట్టా పంపిణీ చేయాలని సూచించింది. 75- 150 చదరపు గజాల వరకూ భూమి మూల విలువలో 75 శాతం రుసుము, 150- 300 చదరపు గజాల వరకూ 100 శాతం రుసుముతో క్రమబద్ధీకరించేందుకు అనుమతించింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది.
అసైన్డు ఇంటి స్థలం లేదా అసైన్డు ఇంటి విక్రయానికి ప్రస్తుతమున్న గడువును 20 నుంచి పదేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఏపీ అసైన్డు, భూముల చట్టానికి సవరణలను ఆమోదించింది. సవరించిన చట్టం అమల్లోకి వచ్చే నాటికి అసైన్డు స్థలం లేదా అసైన్డు ఇంటిని విక్రయించిన వాటికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. చట్టం అమల్లోకి వచ్చిన తరువాత విక్రయించాలనుకుంటే నిర్దేశిత విధానం ప్రకారం రుసుములు తీసుకుని అమ్మకానికి అనుమతివ్వాలని నిర్ణయించింది. పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమోదించింది.
రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని పరిధిలోకి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలుతో పాటు గోదావరి, ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థల్లోని కొంత భాగాన్ని తీసుకురానున్నారు. 207 గ్రామాలు, 17 మండలాలు, 3 పట్టణ స్థానిక సంస్థలతో 1,566 చదరపు కిలోమీటర్ల పరిధితో ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
Gold-Silver Prices Today 01 December 2023: గోల్డ్ కొనేవారికి గుడ్న్యూస్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!
Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు
Anantapur News: వైద్యం వికటించి చిన్నారికి తీవ్ర అస్వస్థత, అధికారులు పట్టించుకోలేదని ఫ్యామిలీ ఆందోళన
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్రా గెలుచుకుంటే మాత్రం అమర్ ఏమైనా సూపర్ స్టారా? - శివాజీ
/body>