అన్వేషించండి

Chandrababu on Telangana Election Results: 'అహంకార ఫలితం తెలంగాణలో చూశాం' - ఏపీలోనూ అదే రిపీట్ అవుతుందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Andhra News: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తొలిసారి స్పందించారు. అహంకారంతో ఉంటే ఏం జరిగిందో చూశామని, అదే ఏపీలో రిపీట్ అవుతుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Comments on Telangana Election Results: ఏపీలో జగన్ (CM Jagan) ప్రభుత్వం అహంకారంతో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామని, మరో 3 నెలల్లో ఏపీలో కూడా చూస్తామని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం మిగ్ జాం తుపాను (Michaung Cyclone) ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నందివెలుగులో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పొలాల్లోకి దిగి స్వయంగా నీట మునిగిన పంటను పరిశీలించారు. ఈ క్రమంలో తెనాలికి చేరుకునే సమయంలో వీఎస్ఆర్, ఎస్వీఆర్ కళాశాల విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని చంద్రబాబుకు స్వాగతం పలికారు.

'ఎంతో క్షోభ అనుభవించా'

40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎక్కడా తాను తప్పు చేయలేదని, అంతా చట్ట ప్రకారమే పని చేశానని చంద్రబాబు స్పష్టం చేశారు. చేయని తప్పునకు తనను అరెస్ట్ చేశారని, ఎంతో క్షోభ అనుభవించినట్లు చెప్పారు. తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. తాను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని తెలిసే సీఎం జగన్ హడావుడిగా పర్యటన మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. అయితే, తుపాను ప్రాంతాల్లో తప్ప ఎక్కడో తిరుగుతున్నారని విమర్శించారు.

'నేనే పరిహారం ఇస్తా'

'మిగ్ జాం' తుపాను ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చంద్రబాబు అన్నారు. 'ఈ తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందన్న సమయంలో ఇలా జరగడం బాధాకరం. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యింది. ఈ క్రమంలోనే ఎక్కువ నష్టం జరిగింది. డ్రైనేజీలో పూడిక తీయక పొలాల్లోకి మురికి నీళ్లు వస్తున్నాయి. అన్నదాతలు ఇంత ఇబ్బంది పడుతున్నా అధికారులు ఎవరూ సకాలంలో రాలేదు. తుపాను వల్ల రైతులు ఎకరాకు రూ.50 వేలు నష్టపోయారు. రైతులకు ఏమైనా ఇన్ పుట్ సబ్సిడీ వచ్చిందా.? మనకు జరిగిన అన్యాయంపై పోరాడదాం. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే బాధ్యత నాది. వైసీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే, 3 నెలల తర్వాత నేనే పరిహారం అందిస్తాను. కౌలు రైతులకు కూడా పూర్తి స్థాయిలో సాయం అందిస్తాం.' అని చంద్రబాబు తెలిపారు. అప్పుడు కరువు, ఇప్పుడు తుపాను రైతులను దెబ్బ తీశాయని, దేశంలోనే రైతులు ఎక్కువగా అప్పుల పాలైంది ఏపీలోనే అని అన్నారు. పట్టిసీమ నీరు వదిలి ఉంటే ఈ సరికే రైతులు పంటల్ని కాపాడుకునే వారని చెప్పారు. తన షెడ్యూల్ ఖరారైతే తప్ప సీఎం, అధికారుల్లో కదలిక లేదని ఎద్దేవా చేశారు.

Also Read: Chandrababu Comments: 'నేను వెళ్తున్నాననే జగన్ హడావుడి' - సీఎంపై చంద్రబాబు విమర్శలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget