అన్వేషించండి

Anantapur: టీడీపీ అధినేతపై మడకశిర తెలుగు తమ్ముళ్ల గుస్సా..! మళ్లీ పాత పద్ధతేనా అంటూ ఉసూరు..

గత రెండురోజుల క్రితం మడకశిర సమీక్షా సమావేశం అమరావతిలో జరిగింది. ఈ సమీక్షా సమావేశంపైనే అందరూ అగ్రహంగా వున్నారు.

అసమ్మతి కార్యకలాపాలపై అధినేత సమీక్ష అంటే పార్టీని ప్రక్షాళన చేస్తాడని అనుకొన్నారు అంతా.. కానీ అధినేత ఏమాత్రం మారలేదు.. ముందు మాదిరిగానే ఉత్తుత్త బెదిరింపులు.. సర్దడాలతోనే సరిపోయింది అధినేత సమీక్ష అంటూ ఊసూరుమంటున్నారు మడకశిర తెలుగుతమ్ముళ్ళు. మడకశిరలో టీడీపీ బలంగా వుంది. ఎంతలా అంటే మొన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రధాన నేతలు ఎవ్వరూ సహకరించకున్నా ఒక జడ్పీటీసీ  గెలుచుకొన్నారంటే ఇక నేతలంతా కలిసికట్టుగా పనిచేసుంటే ఫలితాలు ఏవిదంగా వుండేవో వూహించుకోవచ్చు. కానీ. నేతల అసమ్మతి.. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత కూడా ఏమాత్రం తగ్గకపోగా.. మరింత అధికమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ ఏవిధంగా తన పార్టీలోని నేతలను కంట్రోల్ చేస్తున్నాడో ఆవిధంగా తమ నేత ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నాడంటూ మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. గత రెండురోజుల క్రితం మడకశిర సమీక్షా సమావేశం అమరావతిలో జరిగింది. ఈ సమీక్షా సమావేశంపైనే అందరూ అగ్రహంగా వున్నారు.. వివరాల్లోకి వెలితే..

మడకశిరలో పార్టీ కార్యక్రమాలన్ని చూసేది.. దగ్గరుండి నడిపించేది.. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. అయితే, అది షెడ్యూల్డ్ నియోజకవర్గం కావడంతో గత ఎన్నికల్లో ముందు నుంచి పార్టీలో వున్న ఈరన్నను ఎమ్మెల్యేను చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఈరన్నను డమ్మీని చేసి గుండుమల తిప్పేస్వామి చక్రం తిప్పాడన్నది ఈరన్న వర్గీయుల వాదన. అదేమీ కాదు గుండమల లేకపోతే నియోజకవర్గంలో పట్టు ఎక్కడన్నది తిప్పేస్వామి వర్గీయుల భావన. అయితే గుండమల గత 2014 ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చాడని, కానీ అంతకుముందు నుంచి కూడా పార్టీ బలంగా వుందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు ఈరన్న వర్గీయులు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోకి గుండుమల తిప్పేస్వామి వెళ్లేందుకు సిద్ధం అవుతాడని, ప్రస్తుతం కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నడంటూ ఈరన్న వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ ఇద్దరి నేతల మధ్య పార్టీ నలిగిపోతుంది.

కార్యకర్తలు ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఈ విషయాన్ని తేలుద్దామని అధినేత అమరావతిలో మడకశిర నియోజకవర్గ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఇరువర్గాలు కూడా పెద్ద ఎత్తున తమ అనుచరులతో అమరావతి చేరుకొన్నారు. వీరందరిని చూసిన చంద్రబాబు బలప్రదర్శనకు వచ్చారా అంటూ నేతలపై మండిపడ్డారు. ఇద్దరు సర్దుకొని పనిచేయాలని సూచించాకు. బలమైన మడకశిరలో ఏదో ఒకటి తేల్చకుండా.. మళ్ళీ పాత పద్ధతిలోనే చెప్పడంతో కార్యకర్తలకు చిర్రెత్తుకొచ్చినట్లు తెలుస్తోంది. గట్టిగా నిర్ణయం తీసుకొని.. ఇంచార్జ్ విషయంలో క్లారిటీ ఇచ్చి పనిచేయమని చెప్తే పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది. 

ఎవరిని తప్పించినా రెండేళ్లు ఎన్నికలకు సమయం ఉంది కనుక అన్ని సర్దుకొని సన్నద్దం అయ్యే అవకాశాలు వున్నాయి. కానీ అధినేత మాత్రం ఎప్పట్లానే సర్దే ప్రయత్నం చేయడంతో కార్యకర్తల్లో  తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికైనా మారారు అనుకొంటే ఏ మాత్రం అధినేత మారలేదంటూ ఊసురుమంటున్నారు మడకశిర తెలుగు తమ్ముళ్ళు. అవతల పార్టీ మాత్రం ఏ నిర్ణయం అయినా ఆలోచించకుండా తీసుకొంటూ అందరిని ఆశ్చర్యపరుస్తూ వుంటారు. తమ నేతలు ఎందుకు ఇంతలా బయపడుతారో అన్నది అర్థం కావడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Also Read: Omicron Cases In AP: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్ నిర్ధారణ

Also Read: Omicrona Updates: తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు....ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, టీఎస్ లో 140 

Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget