అన్వేషించండి

Mid Day Meals : మధ్యాహ్న భోజనం తిని 82 మంది విద్యార్థులకు అస్వస్థత - అనంతపురం, నంద్యాలలో ఘటనలు

Anantapur Govt School : అనంతపురం పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

Anantapur Govt School : అనంతపురం పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత చిన్నారులు ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో వారిని తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది అనంతపురం సర్వజన ఆసుపత్రికి(Anantapur Govt General Hospital) తరలించారు. ఆస్పత్రిలో చిన్నారులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.  చిన్నారులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని సొమ్మసిల్లి పడిపోతూ ఉండడంతో విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. ఆసుపత్రి వైద్య సిబ్బంది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సత్వరమే మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. విద్యార్థులకు ఎటువంటి హాని లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు.  చిన్నారుల అస్వస్థతకు కారణాలపై విచారించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారాన్ని తెలుసుకున్న అనంతపురం ఎంపీ రంగయ్య(MP Rangayya) ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. 

నంద్యాలలో 42 మంది విద్యార్థులకు అస్వస్థత 

కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(Primary School)లో మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో 92 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం(Mid Day Meal) చేశారు. వీరిలో కొంత మంది వెంటనే వాంతులు చేసుకుని స్పృహ తప్పిపడిపోయారు. పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థులను గుర్తించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో రంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని, అందరూ క్షేమమేనన్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పాడైన గుడ్లు వడ్డించడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసిందన్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో స్పష్టం చేశారు. 

మంత్రి సురేష్ ఆరా 

నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) ఆరా తీశారు. డీఈవోతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలుసుకున్న మంత్రి విద్యార్థులకు అందించే ముందు ఆహార పదార్థాలు పరీక్షించాలని ఆదేశించారు. పిల్లలందరికీ పరీక్షలు చేసి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థులందరూ సురక్షితంగా ఇళ్లకు వెళ్లే వరకూ విద్యాశాఖ అధికారులు ఆసుపత్రిలో ఉండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. 

Also Read : Vijayawada Mayor: ఫస్ట్ డే ప్రతీ షోకు 100 టికెట్లు పంపాలి-విజయవాడ మేయర్ లేఖ వైరల్

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Breaking News: అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ- కాసేపట్లో మాజీ ఐపీఎస్ కీలక ప్రెస్‌మీట్
అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ- కాసేపట్లో మాజీ ఐపీఎస్ కీలక ప్రెస్‌మీట్
YS Sharmila Rajya Sabha Seat: చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
Embed widget