By: ABP Desam | Updated at : 24 Mar 2022 03:31 PM (IST)
న్యాయవ్యవస్థపై ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలు
కోర్టుల్లో ఏ బెంచ్పైకి వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పే పరిస్థితి వచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. కోర్టులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. తాను రెండు వ్యవస్థలను క్షణ్ణంగా పరిశీలించానన్నారు. వ్యవస్థలపై పైచేయి సాధించాలనుకోవడం సరికాదని చెవిరెడ్డి న్యాయవ్యవస్థను ఉద్దేశించి అన్నారు. మిగతా రెండు వ్యవస్థలపై పెత్తనంతో బలప్రదర్శన చేయాలనుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు ఎన్నుకుంటారన్నారు. బాగా పనిచేస్తే తిరిగి ఎన్నిక అవుతారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారి అని చెవిరెడ్డి పేర్కొన్నారు.
న్యాయమూర్తులు ఎవరికి జవాబుదారి అని చెవిరెడ్డి ప్రశ్నించారు. వారికి నైపుణ్యాలు ఉన్నాయో లేదో నిర్దారించేదెవరు...? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలు తాను అడం లేదని.. రెండో పరిపాలన సంస్కరణ కమిటీ అడిగిన ప్రశ్నలు అని చెవిరెడ్డి స్పష్టం చేసారు. సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టు వరకు అన్నింటికి కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఉండాలని చెప్పారు. మోదీ ప్రబుత్వం కూడా 2018లో న్యాయవ్యవస్థ జవాబదారీతనం కోసం చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేసిందన్నారు.
కార్యనిర్వాహక ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. అలాంటప్పుడు న్యాయవ్యవస్థను పరిరక్షించే జడ్జిల ఎంపిక మరింత కఠినంగా ఉండాలన్నారు. యూపీఎస్సీ తరహాలోనే జడ్జిల నియామకం ఉండాలి. ఇష్టం ఉన్న వారిని నియమించుకోనే కొలిజియం వ్యవస్థ ప్రజాస్వామ్యమబద్దమైనా అని ఆలోచించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆలంటి విధానాలు కొనసాగడం ఎంత వరకు సహేతుకమని ప్రశఅనించారు. న్యాయమూర్తులు న్యాయంగా ఉండటంతోపాటు న్యాయంగా కనిపంచాలని సలహా ఇచ్చారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఏం చేస్తామో మేనిఫెస్టో ఇస్తాం. ఎన్నికల కమిషన్కు ఇచ్చాం. ప్రజలకు ఆ పథకాలు అమలు చేయాలంటే రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండాలన్నారు. వ్యవస్థల మేనేజ్మెంట్ ద్వారా అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తుంటే.. ప్రజల మనసులు గెలుచుకొని అధికారంలోకి రావాలన్న నిబద్దత తమదన్నారు. కోర్టుల భుజాలపై తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చాలనే సంస్కృతి ప్రతిపక్షానిదని విమర్శించారు. కోర్టులు ఆ వాస్తవాలు గమనించాలన్నారు. జస్టిస్ చంద్రు ఇచ్చిన తీర్పులు 90 శాతం బాధితుల పక్షాన ఉన్నాయని. అలాంటి చంద్రు కూడా అన్న మాటలు గుర్తు చేసుకోవాలని న్యాయవ్యవస్థకు అసెంబ్లీ వేదికగా చెవిరెడ్డి సలహా ఇచ్చారు.
కోర్టులు పాలనలో జోక్యం చేసుకుంటే ప్రభుత్వాలు చేసేది ఏంటని చెవిరెడ్డి ప్రశఅనిచారు. కోర్టులు తాము తీసుకున్న నిర్ణయాలకు ఎవరికి జవాబుదారి అని.. ఎప్పుడైనా ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయం కాగలవా అని ప్రశఅనించారు. డిక్రీల ద్వారానే పాలిస్తామంటే పాలన గతి తప్పుతుందన్నారు. దేశానికి ప్రజాభిప్రాయమే సుప్రీం. మూడు వ్యవస్థలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది. ఈ మూడు వ్యవస్థల మధ్య సమస్య రాకుండా ఉండాలంటే ముందడుగు వేయాలని కేంద్రానికి చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్
AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర
Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Pawan Kalyan On Konaseema Violence: ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసును కవర్ చేసుకునేందుకు ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది : పవన్ కళ్యాణ్ ఆరోపణలు
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్ రెడీ- ఐఎస్బీ హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ