అన్వేషించండి

మొన్న టౌన్ ప్లానింగ్, ఇప్పుడు హోర్డింగ్‌లు- గుంటూరు కార్పొరేషన్‌లో రగడ !

గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రణాళిక విభాగంలో ప్రకటన బోర్డుల నిర్వహణ, ఫీజుల వసూళ్లలో జరుగున్న అవినీతిపై చర్చకు వచ్చింది. వైసీపీ చేసిన ఈ ఆరోపణలతో ఒక్కసారిగా రగడ మొదలైంది.

గుంటూరు కార్పోరేషన్‌లో అధికారులుపై అధికార పక్షం నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న టౌన్‌ప్లానింగ్‌లో అక్రమాలు అంటూ విరుచుకుపడిన నేతలు ఇప్పడు ప్రకటనల హోర్డింగ్‌ల ఏర్పాటులో అవినీతిపై నిలదీయటం కలకలం రేపింది.

కౌన్సిల్ సమావేశంలోనే రగడ

గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రణాళిక విభాగంలో ప్రకటన బోర్డుల నిర్వహణ, ఫీజుల వసూళ్లలో జరుగున్న అవినీతిపై చర్చకు వచ్చింది. కొన్నేళ్లుగా ప్రకటనల హోర్డింగ్స్‌ ఏర్పాటు, వాటి నుంచి వచ్చే అద్దెల్లో వ్యత్యాసం ఉంటుందని వైసీపీ ఆరోపించింది. అధికారుల అవినీతి బయటకు రానీయకుండా జాగ్రత్తలు పడుతున్నారంటూ వైసీపీ కార్పోరేటర్లు అధికారిక సమావేశంలోనే ప్రస్తావించారు. కోట్లలో అవినీతి జరుగుతోందని, పాలకవర్గం వచ్చిన తరువాత కూడా అవినీతికి అడ్డు లేకుండాపోయిందని వైసీపీకి చెందిన కార్పొరేటర్లు షేక్ రోషన్, అచ్చాల వెంకట రెడ్డి, వెంకటకృష్ణ ఆచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నగరర పాలక సంస్థ అధికారిక సమావేశంలోనే ఈ అంశం ప్రస్తావనకు రావటంతో మేయర్‌సహా మున్సిపల్ కమిషనర్‌ కూడా ఖంగుతినాల్సి వచ్చింది. ప్రకటన బోర్డుల అవినీతిపై గతంలోనే పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో చర్చించినప్పటికి అధికారుల తీరులో మార్పు లేదని కార్పోరేటర్లు ఫైర్ అయ్యారు. భవానీ యాడ్స్ అనే సంస్థకు చెందిన వ్యక్తులు మరికొన్ని డమ్మీ సంస్థలను ఏర్పాటు చేసి, పట్టణ ప్రణాళిక అధికారులతో కుమ్మక్కై దందా సాగిస్తున్నారని ఆరోపించారు. నగరంలో 75 శాతం వరకు ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నారంటూ కార్పోరేటర్లు కామెంట్ చేశారు. ప్రకటనల ద్వారా లక్షలు ఆర్జిస్తున్న వ్యక్తి ఒకరు జీఎంసీకి చెల్లింపులు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఇందులో అధికారుల భాగస్వామ్యం లేకుండా జరుగుతుందని తాము అనుకోవటం లేదని వ్యాఖ్యానించారు.

అధికారులు వివరణ ఏంటంటే ?

ఈ వ్యవహరంపై గుంటూరు నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారి మూర్తి, డీసీపీ కోటయ్య వివరణ ఇచ్చారు. నగరంలో బోర్డులు, హోర్డింగ్స్‌ తదితర వాటి గురించి వివరాలను కౌన్సిల్ ముందు ఉంచారు. అయితే అధికారుల లెక్కలపై కార్పోరేటర్లు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమ తీరు మార్చుకోవాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు డిమాండు చేశారు. గడప గడప' కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్తుంటే స్థానిక సమస్యలపై నిలదీస్తున్నారని పలువురు కార్పొరేటర్లతోపాటు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కూడా తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రజలు చిన్న చిన్న పనులు చేయించాలని అడుతున్నారని, వాటిని కూడా పూర్తి చేయించలేని పరిస్థితుల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లతామని వ్యాఖ్యానించారు.

గతంలో కూడా టౌన్ ప్లానింగ్‌లో అవినీతి...

గత సమావేశంలో కూడా టౌన్ ప్లానింగ్‌లో అవినీతి వ్యవహరాలపై నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలోనే వైసీపీ కార్పోరేటర్లే స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహరంపై అధికారులు తాత్కాలికంగా వివరణ ఇచ్చినప్పటికి ఆ తరువాత కూడా అదే తంతు కొనసాగుతుందని కార్పోరేటర్లు గుర్రుగా ఉన్నారు. గుంటూరు కార్పోరేషన్ పరిధిలో ఇళ్ళ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో జరుగుతున్న అవినీతిపై వైసీపీ కార్పోరేటర్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అదే టౌన్ ప్లానింగ్‌లో ప్రకటనల హోర్డింగ్‌ల రూపంలో అవినీతి ఆరోపణలు రావటం, అది కూడా వైసీపీ కార్పోరేటర్లే ప్రస్తావించటంపై చర్చ జరుగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget