అన్వేషించండి

Gannavaram News: గన్నవరంలో TDP గెలిచే సంప్రదాయం కొనసాగేనా? జనం జగన్‌కు జై కొడతారా?

Gannavaram Candidates: కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న గన్నవరం నియోజకవర్గాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోగా...ఆ తర్వాత తెలుగుదేశం వశం చేసుకుంది. మరోసారి ఈ సంప్రదాయం కొనసాగేనా...?

Gannavaram Constituency: కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం(Machilipatnam) లోక్‌సభ పరిధిలో ఉన్న గన్నవరం(Gannavaram) అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోట. సీపీఎం వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఇక్కడ నుంచి  మూడుసార్లు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఆ తర్వాత కాంగ్రెస్ కొంత ప్రాభల్యం చూపినా...ప్రస్తుతం ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డగా మారింది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండగా...ఆయన వైసీపీలో చేరారు..

కామ్రెడ్‌ల కంచుకోట
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితం ఏదైనా ఉందంటే అది కృష్ణాజిల్లాలోని గన్నవరం(Gannavaram) నియోజకవర్గమే. అక్కడ పోటీపడుతున్న అభ్యర్థుల వల్లే ఈ రిజల్ట్‌పై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. అయితే నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచీ ఇక్కడ ఫలితాలు సంచలనమే. 1955లో గన్నవరం నియోజకవర్గం ఏర్పడగా....కమ్యునిస్టు పార్టీ సీనియర్ నేత, సీపీఏం వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య సీపీఐ(CPI) తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆతర్వత జరిగిన1962ఎన్నికల్లోనూ ఆయన రెండోసారి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు గెలిచి కాంగ్రెస్(Congress) హ్యాట్రిక్ కొట్టింది. 1967లో సీతారామయ్య, 1968లో జరిగిన ఉప ఎన్నికల్లో కె.వెంకటరత్నం, విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఆనంబాబు విజయం సాధించారు.1978లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం తరఫున పుచ్చలపల్లి సుందరయ్య పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి లంకా వెంకటేశ్వరరావు(Lanka Venkateswararo) భారీ మెజార్టీతో విజయం సాధించారు.

1983 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అభ్యర్థి కొమ్మినేని శేషగిరిరావుపై స్వల్ప ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థి ముసునూరు రత్నబోస్‌ గెలుపొందారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ములుపూరు బాలకృష్ణారావు...కాంగ్రెస్ అభ్యర్థి కొలుసు పెద్ద బీదయ్యపై విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ చేరిన ముసునూరు రత్నబోస్(Rathna Bosu)...1989లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణారావుపై స్వల్ప ఓట్ల తేడాతో మరోసారి విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచినా...గన్నవరంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి గద్దె రామ్మోహన్ తెలుగుదేశం అభ్యర్థి దాసరి బాలవర్థనరావుపై  సంచలన విజయం సాధించారు. అనంతరం ఆయన తెలుగుదేశంలో చేరారు.

1999లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(Gadde Rammohan) విజయవాడ ఎంపీగా పోటీ చేయగా....తెలుగుదేశం నుంచి దాసరి బాలవర్థనరావు, కాంగ్రెస్ నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరావు పోటీపడ్డారు. విజయం ఈసారి దాసరిని వరించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావుపై ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేసి గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ముద్రబోయిన, దాసరి పోటీపడ్డారు. కాంగ్రెస్ నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేయగా...తెలుగుదేశం నుంచి దాసరి పోటీచేసి మరోసారి  గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi)కి టిక్కెట్ ఇచ్చింది. వైసీపీ(YCP) నుంచి పోటీపడిన దుట్టా రామచంద్రరావుపై ఆయన తొమ్మిదిన్నర వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

గత ఎన్నికల్లో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తెలుగుదేశం టిక్కెట్ కేటాయించగా....వైసీపీ నుంచి ఎన్నారై యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkatrao) పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీ 838 ఓట్ల తేడాతో వల్లభనేని వంశీ గెలుపొందారు. అనంతరం ఆయన వైసీపీలో చేరగా....వంశీపై ఓటమిపాలైన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలో చేరారు. మరోసారి వీరిరువురి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
Embed widget