అన్వేషించండి

Andhra Pradesh: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం- ఈసారి 9వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడి

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు 9వేల కోట్లకుపైగా కేటాయించినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. రైల్వే జోన్‌పై కూడా కీలక ప్రకటన చేశారు

Budget 2024-25: కేంద్రబడ్జెట్‌లో ఈసారి ఏపీపై గట్టిగానే ఫోకస్ పెట్టామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే అమరావతికి నిధులు ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కుమ్మరించనున్నారు. ఇప్పుడు రైల్‌ ప్రాజెక్టులపై కీలక ప్రకటన చేశారు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కోసం తొమ్మిదివేల నూట యాభై ఒక్క కోట్లు ఖర్చు చేయనున్నట్టు సభలో తెలిపారు. ఇందులో రెండు వేల కోట్లు అమరావతి రైల్వే లైన్ కోసమేనంటూ వెల్లడించారు. 

ఏపీ రైల్వే ప్రాజెక్టులకు 9వేల కోట్లు

ఇన్నాళ్లు ఆగిపోయిన అమరావతిపై ఇప్పుడు నిధులు వరద పారుతోంది. ఈసారి బడ్జెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులను కేంద్రం ప్రకటించింది. అమరావతి రైల్వేలైన కోసం 2,047 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మీడియా సమావేశంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీంతోపాటు ఇతర పనుల కోసం 9,151 కోట్ల రూపాయాలు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. 2009-14 కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి ఏపీకి ఐదేళ్లు సగటున దాదాపు 900 కోట్లు రూపాయాలు కేటాయిస్తే దానికి పది రెట్లు ఈసారి కేటాయించినట్టు కేంద్ర మంత్రి తన ప్రసంగంలో వెల్లండించారు. 

అమరావతి పరిధిలో కొత్త ప్రాజెక్టు

విద్యుదీకరణ పనులు కూడా ఏపీలో దాదాపు పూర్తైనట్టు కేంద్రమంత్రి తెలిపారు. 73, 743 కోట్ల వ్యయంతో 5,329 కిలోమీటర్ల మేర 41 ప్రాజెక్టులు అమలు అవుతున్నట్టు పేర్కొన్నారు. అమరావతిని ఇతర ప్రాంతాలకు అనుసంధానిస్తూ 56 కిలోమీటర్లు పరిధిలో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నట్టు వివరించారు. విజయవాడ- ఏరుపాలెం నుంచి అమరావతి స్టేషన్, నంబూరు కు వేసే లైన్ డీపీఆర్‌ దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. 

భూమి ఇచ్చిన తర్వాత రైల్వే జోన్‌ పనులు ప్రారంభం

విశాఖ జోన్‌ ఇంత వరకు ఏపీకి అప్పగించలేదని తెలిపారు వైష్ణవ్. దీనికి సంబంధించిన భూమి ఇంత వరకు ఫైనలైజ్ కాలేదని.. అందుకే ఆలస్యమవుతుందని వివరించారు. కొత్త ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఏపీలో గత పదేళ్లలో 151 కొత్త రైల్వే లైన్లను నిర్మించినట్టు మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. 195 లైన్లను అప్‌గ్రేడ్ చేసిన విద్యుదీకరించామన్నారు. 743 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది విజయవాడ స్టేషన్‌ను 'అమృత్ స్టేషన్‌'గా గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు అనకాపల్లి లాంటి మరో 15 స్టేషన్లను ఈ స్కీమ్‌లో చేర్చినట్టు వివరించారు.  

బెంగళూరు- విజయవాడ మధ్య వందేభారత్!
త్వరలోనే బెంగళూరు విజయవాడ స్టేషన్ల మధ్య వందేభారత్‌ రైలును ప్రారంభిస్తామన్నారు అశ్వనీ వైష్ణవ్. ముంబయి, విజయవాడ మధ్య దూరం ఎక్కువగా ఉన్నందున ఈ రెండు స్టేషన్ల మధ్య వందేభారత్ సాధ్యం కాదని తేల్చేశారు. 

Also Read: ఉమ్మడి విశాఖ జిల్లాలాలోని అందమైన జలపాతాలు ఇవే.. సందర్శనకు వెళ్లిపోండి

Also Read: హైదరాబాద్‌కు దగ్గర్లోనే అందమైన వాటర్ ఫాల్స్, పొద్దున్నే వెళ్తే సాయంత్రానికి వచ్చేయొచ్చు!

Also Read: తిరుపతికి అతి సమీపంలోనే ప్రఖ్యాత జలపాతాలు, దేవుడి దర్శనానికి వెళ్లినప్పుడు వీటిపైనా ఓ లుక్కేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget