అన్వేషించండి

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అజెండా ఇదే!

ఏపీ  సీఎం  జగన్  ఈ రాత్రి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని  నరేంద్రమోడీతో  భేటీ  అవుతారు. పలు కీలక అంశాలపై చర్చిస్తారు.

ఏపీ సీఎం జగన్  ఈ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి పయమం అవుతున్నారు. ఏపీకి రావాల్సిన ఆర్ధిక సహాయం, నిధులు, పోలవరం ప్రాజెక్ట్ ఇతర అంశాల ప్రధాని మోడీతో చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో రేపు సమావేశం కానున్నారు సీఎం  జగన్. ఏపీకి రావాల్సిన ఆర్థిక సహకారంతోపాటు రాష్ట్ర విభజన సమస్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మూడు రాజధానులు అంశంపై  కేంద్ర సహకారానికి సంబంధించి కూడా చర్చ అభ్యర్థించనున్నారు. గతంలో ప్రధానితో సమావేశం అయినప్పుడు పోలవరం నిధులు, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన అంశాలపై చర్చించారు. దీంతో పాటు ఏపికి రావాల్సిన ఆర్థిక సహాయం, ప్రస్తుతం ఉన్న ఆర్థిక  పరిస్థితి  ప్రధానికి  వివరించే  అవకాశం  ఉందన్న ప్రచారం జరుగుతుంది. 

తెలుగు రాష్ట్రాల మధ్య... 

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన అంశాలపై అధికారులు చర్చలు జరిపారు. అయితే అవి ముందుకు సాగటం లేదు. తెలంగాణా సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై కూడా మోడీకి జగన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఆస్తులకు సంబంధించి పిటిషన్ వేయడంతో ఈ అంశం కూడా ప్రధాని దృష్టికి సీఎం జగన్ తీసుకు వెళ్లే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నిధులు అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది బడ్జెట్ కూడా ఉండడంతో ఏపీకి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరే అవకాశం ఉంది.

రైల్వే జోన్ పై .....
 
రైల్వే ప్రాజెక్టుల వ్యవహరంపై కూడ ఈసారి ప్రధానికి సీఎం వివరిస్తారని అంటున్నారు. విభజన తరువాత రైల్వేపరంగా అందాల్సిన ప్రయోజనాలు కూడా ఏపీకి ఇప్పటికి దక్కలేదు. దీంతో ప్రాజెక్టుల విషయంలో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే, వెనుకబడి ఉంది. రైల్వే జోన్ పై కూడా క్లారిటి రావాల్సి ఉంది. ఈ విషయంపై వీలయితే జగన్ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, మంత్రిని కూడా కలసి రైల్వే జోన్‌పై తేల్చాలని కోరతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఈ రాత్రికే ఢిల్లీకి...

సీఎం జగన్ తన షెడ్యూలో పలు మార్పులు చేసుకున్నారు. వాస్తవానికి 28వ తేదీన ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి అదే రోజు ప్రధానితో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసుకొని ఈ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, గన్నవరం వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీకి వెళతారు. అక్కడ రాత్రికి బస చేసి 28వ తేదీన ప్రధానితో సమావేశం  అవుతారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలసే అవకాశం ఉంది.

ముందు నిధుల విడుదల అనంతరం ఢిల్లీకి పయనం

రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 79 వేల 65 మంది కొత్త పెన్షనర్ల ఖాతాల్లో రూ.590 కోట్లు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలనే సంకల్పంతో మరో అవకాశం ఇస్తూ లబ్ధిదారుల అకౌంట్లకు నగదు ట్రాన్స్ ఫర్ చేస్తారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget