అన్వేషించండి

TDP Leaders: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో జగన్ లో అసహనం, ఫిర్యాదులు లేకున్నా మార్గదర్శిపై లేనిపోని ఆరోపణలు!

TDP Leaders on CM Jagan: సీఎం జగన్ లో అసంతృప్తి పెరగడం వల్లే.. ఒక్క ఫిర్యాదు కూడా రాని మార్గదర్శి సంస్థపై అనవసరంగా సీఐడీ దర్యాప్తు చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. 

TDP Leaders on CM Jagan: ఏపీలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో అసంతృప్తి పెరిగిపోయిందని టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ మూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. విశ్వసనీయత ఉన్న సంస్థలపై కావాలనే కోపం పెట్టుకుని.. పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. రెండు లక్షల మంది వినియోగ దారులు ఉన్న అతిపెద్ద సంస్థ మార్గదర్శి అని బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు. తాను కూడా ఆ సంస్థలో చందాదారుడినే అని వివరించారు.

వినియోగదారుడి నుంచి ఒక్క ఫిర్యాదు లేకపోయినా చేతిలో కీలుబొమ్మలా ఉన్న సీఐడీతో మార్గదర్శిపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు అవినీతి, అరాచకాలను తమకు చెందిన మీడియా సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారనే కోపంతోనే మార్గదర్శిపై సీఎం జగన్ కోపం పెంచుకున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సంస్థపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. సీఎం జగన్ పుట్టక ముందు నుంచి మార్గదర్శి సంస్థ ఉందని.. దానిపై సీఐడీ దాడిని తీవ్రంగా ఖండించారు బండారు సత్యనారాయణ. 

నీకు రోజులు దగ్గర పడ్డాయి జగన్.. ప్రత్తిపాటి మండిపాటు 
"85 ఏళ్ల రామోజీరావు ఈ దేశానికి ఒక లెజెండ్. తెలుగు జాతి గర్వించేలా కృషి చేశారు. సీబీఐ, ఈడీ కేసులు పెట్టి 16 నెలలు జైలులో ఉన్న సీఎం జగన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని.. ప్రభుత్వ వైఫల్యాల చూపిస్తున్నారనే ఉద్దేశ్యంతోనే మార్గదర్శి సంస్థలపై దాడులు చేయిస్తున్నారు. మార్గదర్శి సంస్థలపై కస్టమర్ల నుండి ఒక్క ఫిర్యాదు కూడా రాకపోయినా మార్గదర్శి సంస్థల ఎండీ శైలజ గారిని టార్గెట్ చేస్తూ.. జగన్మోహన్ రెడ్డి నీచ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

పేద ప్రజలకు ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని అందించడమే కాకుండా మార్గదర్శి చిట్స్ ద్వారా అందరికీ అండగా నిలుస్తున్న శైలజని టార్గెట్ చేయడం దారుణం. నీకు రోజులు దగ్గర పడ్డాయి జగన్. అలాగే మీ నాన్నగారి హయాంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారిని అడ్డుగా పెట్టుకుని అదే మార్గదర్శి సంస్థలపై దాడులు చేసి ఏమీ చేయలేకపోయారు. రామోజీ రావు, మార్గదర్శి సంస్థల ఎండీ శైలజలను టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

మార్గదర్శిపై ఫైర్ అయిన మాజీ ఎంపీ ఉండవల్లి 

మార్గదర్శి చిట్స్ వ్యాపారంలో అనేక నిబంధనలను ఉల్లంఘించిందని, ఇప్పుడు అవే అక్రమాలు బయట పడుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలే అన్నారు. కొన్ని రోజుల కిందట రాజమండ్రిలో మార్గదర్శి వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించిందనే విషయాన్ని తాను ఏనాడో చెప్పానని నష్టాల్లో నడుస్తోందని కూడా చెప్పానని దానిపై ఆ సంస్థ ద్వారా తప్పులు బయ టకు తీసినందుకు తనపై రామోజీరావు కేసులు పెట్టించారని ఆరోపించారు.  ప్రస్తుతం ఏపీ సీఐడీ విచారణలో అందుకు తగ్గట్లే చిట్ అక్రమాలు జరిగినట్లు ఇప్పుడు తేలుతోందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget