అన్వేషించండి

AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

TDP Without Alliance: పొత్తుల అంశంపై మాట్లాడుతూ మాజీ మంత్రి, ఏపీ టీడీపీ ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సింగిల్‌గా బరిలోకి దిగితే టీడీపీ ఘన విజయం సాధిస్తామన్నారు.

TDP Leader Prathipati Pulla Rao About Alliance: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్‌గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనుంది. తమకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని, తమ నేత వైఎస్ జగన్ సంక్షేమ పాలనకు ఓట్లు పడతాయని ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పలు సందర్బాలలో ప్రస్తావించారు. అయితే పొత్తుల అంశంపై మాట్లాడుతూ మాజీ మంత్రి, ఏపీ టీడీపీ ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ పొత్తు లేకపోయినా 160 సీట్లు గెలిచే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. అమరావతి రాజధాని అభివృద్ధి చేయకుండా భూములను అమ్ముకునే అధికారం సీఎం జగన్ మోహన్ రెడ్డికికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. 

సీఎం జగన్ చేతగాని పనులు, చెత్త పరిపాలనకు ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మూడు సంవత్సరాల వైఎస్సార్ సీపీ పాలన కేవలం విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేతలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎకరా రూ 10 కోట్లకి అమ్మాలని భావిస్తే.. మీ దుర్మార్గానికి ఎవరు ముందుకు వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధి చేయకుండా అమ్ముకునే అధికారం సీఎం జగన్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అధికార పార్టీ ప్లీనరీలకు ఆ పార్టీ నేతలే ముఖం చాటేస్తుండగా.. చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

వెన్నెముక లేని సీఎం జగన్
వెన్నెముక లేని సీఎంగా జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, ప్రపంచంలోనూ పేరు తెచ్చుకున్నారంటూ మాజీ మంత్రి ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టించిన టిడ్కో ఇల్లు పేద ప్రజలకు ఇవ్వలేదు. కనీసం ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న నివాస స్థలాల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరికీ తెలుసునన్నారు. విషపూరిత హానికరమైన మూడు రకాల మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తూ పేదవాడి ప్రాణాలను బలిగొంటున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో ఖజానా నింపుకోవాలని దురాలోచన ఇప్పటికైనా ఆపాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

మెడలు వంచుతానని.. ఢిల్లీలో మోకరిల్లారు 
రాష్ట్రంలో మొత్తం తమ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి రాగానే తన కేసుల మాఫీ కోసం కేంద్రం పెద్దల ముందు మోకరిల్లడం సిగ్గుచేటు అంటూ ప్రతిపాటి పుల్లారావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిన సీఎం జగన్‌కు.. టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే అర్హత కోల్పోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget