అన్వేషించండి

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!

Chandra Babu News: ఉండవల్లిలో తెలుగుదేశం ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. APలో కరవు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

చాలా కాలం తర్వాత టీడీపీ అధినేత రాజకీయ సమావేశాల్లో పాల్గొన్నారు. నాలుగు నెలల తర్వాత ఆయన తొలిసారిగా ఎంపీలతో సమావేశమయ్యారు. నాల్గో తేదీ నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను చర్చించారు. ప్రతిపక్షాలే టార్గెట్‌గా ఏపీ సాగుతున్న పాలన తీరును పార్లమెంట్‌లో ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. ప్రత్యర్థులపై అక్రమకేసులు బనాయించి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలన్నారు. 

ఉండవల్లిలో తెలుగుదేశం ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు నేతలకు పలు సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లో కరవు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. కరవు నివారణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 29 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి రావాల్సినవి, విభజన చట్టంలోని హామీలు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారని, స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడటం లేదని, రైల్వే జోన్‌ గురించి మాట్లాడేవాళ్లే లేరని ధ్వజమెత్తారు. వీటన్నింటిపై వైసీపీ వైఖరిని పార్లమెంట్‌ సాక్షిగా ఎండగట్టాలని సూచించారు చంద్రబాబు. 

రాష్ట్రంలోని ప్రజాసమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రత్యర్థులపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని అన్నారు చంద్రబాబు. ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలకు లెక్కేలేకుండా పోతోందన్నారు. పేదరికం, నిరుద్యోగం, మహిళలపై దాడులు, కరవు, ధరల పెరుగుదల, ఛార్జీల మోత, అప్పులు, ఇలా ప్రధానాంశాలపై చర్చించారు.  రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయిందన్నారు టీడీపీ నేతలు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇసుక దోపిడీదారులపై ఈడీ దర్యాప్తు జరుగుతోందని ఏపీలో అంతకు మించి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చెయ్యాలన్నారు.  

లేని సమస్యలను సృష్టించి ప్రజల దృష్టి మరల్చడం తప్ప ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ఆరోపించారు టీడీపీ నేతలు, సాగర్ ప్రాజెక్టు వద్ద లేని సమస్యను సృష్టించారని ఆరోపించారు. అసలు కక్ష రాజకీయాలపై ఉన్న శ్రద్ధ నిధుల వినియోగం ఇతర అంశాలపై లేదని ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget