అన్వేషించండి

Sajjala Ramakrishna Reddy: స్కామ్‌లలో చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు - సజ్జల

AP Latest News in Telugu: చంద్రబాబు అనే వ్యక్తి దోపిడీకి గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపణలు చేశారు.

YSRCP News: నిన్న తెలంగాణ హైకోర్ట్ చంద్రబాబు చేసిన మహా దోపిడీ గురించి తీర్పు వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కేవలం నాలుగు రోజుల్లో అనేక నిర్ణయాలను దారుణంగా తీసుకున్నారని.. వాటిని రద్దు చేయాలనీ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి దోపిడీకి గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారని ఆరోపణలు చేశారు. 2004 వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి మీద విచారణకు కమిటీ వేశారని సజ్జల గుర్తు చేశారు.

20 ఏళ్ల క్రితం కుంభకోణం - సజ్జల
స్పోర్ట్స్ ఆథారిటీ పేరుతొ 2003 లో ఒక కంపెనీ స్టార్ట్ అయిందని.. 2004 లో ఎంవోయూ జరిగిందని సజ్జల చెప్పారు. ‘‘20 ఏళ్ళ తర్వాత చంద్రబాబు చేసిన కుంభకోణంపై తెలంగాణ హైకోర్ట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు ఎకరం 50 వేలకే సేల్ డీడ్ క్యాబినెట్ లో పెట్టకుండా చంద్రబాబు ఇచ్చారు. 400 ఎకరాలు విలువ అప్పట్లో రూ.వెయ్యి కోట్లు. ఇప్పుడు వాటి విలువ రూ.లక్ష కోట్లు దాకా ఉంటుంది. తల తోక లేని కంపెనీకి ఇచ్చి 20 ఏళ్ళ క్రితమే చంద్రబాబు స్కెచ్ వేసారు.

చరిత్రలో స్కామ్ లలో నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు. 2014 నుంచి 19 మధ్యలో అమరావతి స్టారప్ ఏరియాకి 1500 ఎకరాలు ధారాదత్తంగా ఇచ్చారు. సేమ్ 2003 లో చేసిన భూస్కామ్ లాంటిదే. హైదరాబాద్ లో రాష్ట్ర భూములు కాజేశాడు. 2014 నుంచి 19 మధ్యలో అమరావతి రైతుల భూములపై స్కామ్ చేస్తున్నాడు. కొట్టేసిన భూములను అమ్మడానికి రకరకాల క్రియేషన్ చంద్రబాబు చేస్తాడు. ఇది అమరావతి కాదు భ్రమరావతి. సిమెన్స్ పేరుతో 350 కోట్లు కుంభకోణం చేశాడు. అది కూడా బోగస్ కంపెనీ. బయట వ్యక్తులని తీసుకువచ్చి టీడీపీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చాడు.

టీడీపీ ప్రభుత్వంలో ఆధారాలు లేని స్కామ్ లు చంద్రబాబు చాలా చేసాడు. చంద్రబాబు హయాంలో క్యాబినెట్ లో జరిగేది ఒకటి..బయటికి వచ్చే జీవోలు మరొకటి. పెద్ద కంపెనీల పేరు మీద హడావిడి చేసి స్కామ్ లు చేయడం చంద్రబాబుకి బాగా తెలుసు. ప్రజలు మర్చిపోతారని మళ్ళీ దోచుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. వైఎస్సార్ హయాంలో చంద్రబాబు చేసిన స్కామ్ లు జగన్ హయాంలో బయటికి వస్తున్నాయి.

2024లో ఏదో ఒక రకంగా అధికారంలో రావాలి అని చూస్తున్నాడు. అలా వస్తే చాప చుట్టినట్టు రాష్టాన్ని చుట్టేసి రాష్టాన్ని అమ్మేస్తాడు. అవసరం అయితే కేజీ బంగారం కారు కూడా ఇస్తా అని అబద్దపు హామీలు ఇస్తాడు. చంద్రబాబు ఎప్పుడు ఒక్కడే రాడు.. ఏదో ఒకటి కలుపుకొని వస్తాడు. ఈ సారి బీజేపీ కాంగ్రెస్ కూడా కలుపుకొని వస్తున్నాడు. చంద్రబాబు కనికట్టు మాటలను షర్మిల మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు చుసిన అవే మాటలు షర్మిల అంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా దిగజారుడు మాటలు కూడా వస్తాయి.

వైసీపీ నుండి పోయిన నాయకులకి టెక్కెట్ ఇవ్వడంపై చంద్రబాబు మాట్లాడాలి. చంద్రబాబు జనసేనకి అన్ని తక్కువ సీట్ల ఇవ్వడం మీద వాళ్ల పార్టీ వాళ్ళకే నచ్చడం లేదు. అలాగే బీజేపీ పార్టీ కూడా అనుకున్న అన్ని సీట్లు చంద్రబాబు ఇవ్వడు. మా పార్టీ ఎన్నికలకి సిద్ధంగా ఉంది,సీట్ల సర్దుబటు గొడవలు టీడీపీ, జనసేనలో ఉన్నాయి. మేము బలంగా ఉన్నాము కాబట్టి అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి అంటే వాళ్ళ బలహీనత అలా ఉంది. 50 శాతానికి పైగా ఓట్లు ప్రతి నియోజకవర్గంలో మా పార్టీకి ఉంది. ఒక జీరో పక్కన ఇంకో జీరో వచ్చినా దానికి విలువ లేదు’’ అని సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
Embed widget