అన్వేషించండి

Margadarsi Case: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు - మెయిల్ చేసినట్లు వెల్లడి

Margadarsi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో విచారణకు రావాలంటూ సీఐడీ నోటీలుసు పంపినప్పటికీ.. రామోజీరావు, శైలజా కిరణ్ లు గైర్హాజరు అయ్యారు. 

Margadarsi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో జులై 5వ తేదీన విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు పంపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విచారణ ఏ1 చెరుకూరి రామోజీ రావు, ఏ2 శైలజా కిరణ్ లు గైర్హాజరు అయ్యారు. అయితే ముందుగానే వారు సీఐడీ విచారణకు హాజరు కాలేమని ఈ మెయిల్ చేసిన్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల వల్ల రామోజీ రావు రాలేని పరిస్థితిలో ఉన్నందున విచారణకు హాజరు కాలేమని చెప్పినట్లు సమాచారం. 

జూన్ 22న నోటీసులు ఇచ్చిన సీఐడీ

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో నిందితులుగా ఉన్న రామోజీ రావు, శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి జులై 5వ తేదీన గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో రామోజీ రావు ఏ1గా, శైలజా కిరణ్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీరావు నివాసంలో రెండు విడతలుగా రామోజీరావు, శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. 

ఎఫ్ఐఆర్ లో రామోజీరావు,  శైలజా కిరణ్ పేర్లు                              

మొత్తం మూడు చట్టాల  కింద కేసులు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్  34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982లోని సెక్షన్  76,79 ప్రకారం  ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది.  నమోదైన ఎఫ్ఐఆర్‌లలో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్,  అలాగే ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్,  అలాగే ఆయా బ్రాంచీల మేనేజర్ల పేర్లను చేర్చారు.

ఇప్పటికే ఆస్తులు అటాచ్                        

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థకు చెందిన ఆస్తులను  సీఐడీ ద్వారా అటాచ్‌ చేశారు.  మార్గదర్శికి సంబంధించిన రూ. వెయ్యికోట్ల ఆస్తులను రెండు విడతలుగా అటాచ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అటాచ్ చేసిన ఆస్తులను ఈ కేసు తేలేవరకూ ఎటువంటి క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. చిట్స్‌ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. సోదాల సమయంలో తమకు లభించిన ‘రశీదు’లు నిబంధనల అతిక్రమణ జరిగిందనడానికి కీలక ఆధారాలని సీఐడీ  తెలిపింది. 

మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ను హైదరాబాద్‌లో ఆగస్టు 31, 1962న స్థాపించారు. నాలుగు రాష్ట్రాలలో మొత్తం 108 శాఖలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం శాఖల సంఖ్య 37 కాగా 2,351 చిట్ గ్రూపులు ఉన్నాయి 1.04 లక్షల మంది చందాదారులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వార్షిక టర్నోవర్ రూ. 9,677 కోట్లుగా ఉంది. డిపాజిట్లు మళ్లిస్తున్నారని సీఐడీ..అసలు డిపాజిట్లే తీసుకోడం లేదని మార్గదర్శి వాదిస్తోంది. 

 Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drugs Party: గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Bad Girl OTT : ఓటీటీలోకి తమిళ కాంట్రవర్శీ 'బ్యాడ్ గర్ల్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి తమిళ కాంట్రవర్శీ 'బ్యాడ్ గర్ల్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Visakhapatnam Earthquake: విశాఖలో స్వల్ప భూప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
విశాఖలో స్వల్ప భూప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Advertisement

వీడియోలు

New Champions in 2025 | కొత్త ఛాంపియన్స్‌‌ ఇయర్‌గా 2025
Kuldeep Yadav in India vs Australia T20 Series | టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
Shree Charani in Women's ODI World Cup 2025 | విజృంభించిన ఆంధ్రా అమ్మాయి
South Africa Losing 4 World Cups in 2 Years | 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి
Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Party: గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
గచ్చిబౌలిలో మరో డ్రగ్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్, మరోచోట డాక్టర్ల ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం!
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Bad Girl OTT : ఓటీటీలోకి తమిళ కాంట్రవర్శీ 'బ్యాడ్ గర్ల్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి తమిళ కాంట్రవర్శీ 'బ్యాడ్ గర్ల్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Visakhapatnam Earthquake: విశాఖలో స్వల్ప భూప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
విశాఖలో స్వల్ప భూప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Bandla Ganesh : రియల్ హీరో కిరణ్ అబ్బవరం - వాట్సాప్ వాట్సాప్ అంటూ మరో హీరోపై బండ్ల గణేష్ పంచ్... మళ్లీ కాంట్రవర్సీ కామెంట్స్
రియల్ హీరో కిరణ్ అబ్బవరం - వాట్సాప్ వాట్సాప్ అంటూ మరో హీరోపై బండ్ల గణేష్ పంచ్... మళ్లీ కాంట్రవర్సీ కామెంట్స్
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Karthika Pournami Wishes In Telugu: నవంబర్ 05 కార్తీక పౌర్ణమి! మీ  బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
నవంబర్ 05 కార్తీక పౌర్ణమి! మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
Embed widget