అన్వేషించండి

Andhra Pradesh: ఏపీలో వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు - నియంత చట్టంగా అభివర్ణించిన ప్రభుత్వం

AP Land Titling Act: భూములపై హక్కులు పోతాయని భయంతో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకే వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Andhra Pradesh Assembly: వైసీపీ తీసుకొచ్చిన ల్యాండిటైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ రద్దు ప్రతిపాదనను రెవెన్యూపై మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ సభలోప్రవేశ పెట్టారు. దీనిపై మాట్లాడిన మంత్రి... భూమితో ప్రజలకు ఉండే అనుబంధాన్ని దూరం చేసేందుకు నియంత తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఐదేళ్లుగా చేసిన ఎన్నో ప్రభుత్వ భూములు దోచుకున్న వైసీపీ నేతలు, తర్వాత అధికారంలోకి వస్తే ప్రైవేటు భూములుకూడా లాక్కునేందుకు ఈ చట్టం తీసుకొచ్చారని ఆరోపించారు. 

ఈ బిల్లు మాట్లాడిన సీఎం చంద్రబాబు" ఇది భయంకరమైన చట్టం. ఏమాత్రం ఆలోచించకుండా చట్టాన్ని తీసుకురావడంతో చాలా సమస్యలు వచ్చాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే.. పౌరుల ఆస్తి హక్కులు మింగేసే వాళ్లు. ఇప్పటికే చాలా వరకు భూ వివాదాలు పెరిగిపోయాయి. నేను కుప్పంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఐదేళ్లలో అంతటి దారుణాలు చేశారు. 22ఏ ప్రకారం ఎవరిదైనా భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేస్తారు. తర్వాత సెటిల్ మెంట్ చేస్తారు. ఒక వేళ భూ యజమానులు వీళ్ల ఒప్పందాలకు అంగీకరిస్తే దాన్ని ప్రైవేటు భూములుగా మార్చేస్తారు. సెంటిమెంట్‌గా వస్తున్న భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తారు. అలాంటి భూములపై సీఎం ఫొటో వేయడం దుర్మార్గం. ప్రజల్లో ఆవేశం ఉన్నా ఏం చేయలేకపోయారు. భూ సర్వేపేరుతో డబ్బులు ఖర్చు పెట్టి వివాదాలు పెంచారు. వీటన్నింటిపై పూర్తిగా స్టడీ చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం. "

"అప్పుడు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై నిరనస తెలియజేస్తే కనీసం పునరాలోచిస్తామన్న మాట కూడా మాట్లాడలేదు. ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తులు లాగేసే పరిస్థితి ఉంది. భూవివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాలను సెక్షన్ 37 నిషేధిస్తుంది. అంటే నేరుగా హైకోర్టుకు వెళ్లాలి. ఎంతమంది వెళ్లగలుగుతారు. ఈ కొత్త చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు. అంటే వాళ్ల గుమస్తాలను ఇందులో పెడితే ప్రజల జాతకాలు రాస్తారు. ఎవరైనా ఈ భూమి నాది అని పెడితే ట్రైబ్యునల్‌కు వెళ్లిపోతుంది వివాదం. అంటే వివాదాలు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులు లాగేయడానికి చేసిన ప్రయత్నం."

" ఈ చట్టంలో ఉన్న చెప్పిన కొన్ని సెక్షన్‌లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 ను రహస్యంగా దాచి పెట్టారు. అందుకే నేను పవన్ అన్ని సభల్లో చెప్పాం. ప్రజలు నమ్మారు.  ఈచట్టం అమల్లోకి వస్తే ఆస్తులకు రక్షణ ఉండదనే ప్రజలు నమ్మారు. విదేశాల్లో ఉన్న వారి భూములు ఇక్కడ ఉన్నాయి. వాళ్లు రికార్డులు చెక్ చేసుకోకపోతే... వారి భూములు కూడా ప్రభుత్వ భూమలుగా మారిపోతాయి. అందుకే మేము ఇచ్చిన హామీ మేరకు మొదటి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దుపై పెట్టాం. ఇప్పుడు సభల్లో ఆమోదించుకున్నాం. " అని చంద్రబాబు సభలో తెలియజేశారు. 

Also Read: Jagan Dharna: రెడ్‌బుక్‌తో రెచ్చిపోతున్న చంద్రబాబు సర్కారు- ఢిల్లీ ధర్నాలో జగన్ ఆరోపణలు- మద్దతు ప్రకటించిన అఖిలేష్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Why Mouth Taste Bitter During Fever: జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Embed widget