అన్వేషించండి

AP Capital అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు పరిశీలిస్తున్న ఐఐటీ నిపుణులు, త్వరలో ప్రభుత్వానికి నివేదిక

Buildings in Amaravati | అమరావతిలో గతంలోనే నిలిచిపోయిన నిర్మాణాలను ఐఐటీ నిపుణులు పరిశీలించి, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. శుక్రవారం రాజధానికి వచ్చారు.

Buildings in Amaravati | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి మళ్లీ పట్టాలెక్కుతోంది. రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు ఏపీకి వచ్చారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మాణ పనులు చురుకుగా సాగాయి. ఆపై 2019 ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. కొన్ని శంకుస్థాపన జరిగినా, అక్కడే పనులు నిలిచిపోయాయి. ఏపీలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణాలపై ఫోకస్ చేసింది. వాటిని పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం ఐఐటీ ఇంజినీర్లతో అధ్యయనం చేపిస్తోంది. 

చంద్రబాబు గత ప్రభుత్వంలో ప్రారంభమై 2019 నుంచి మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణులు అమరావతికి వచ్చారు. మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ విషయాలను ఐఐటి ఇంజినీర్లు పరిశీలించి రిపోర్ట్ సమర్పించనున్నారు. హైకోర్టును, సెక్రటేరియట్, హెచ్ వోడి కార్యాలయాల టవర్లను ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ సర్కార్ పనులు మొదలు పెట్టింది. అయితే కొన్ని నిర్మాణాలు మధ్యలో ఉండగా, కొన్ని పునాదుల దశలోనే ఆగిపోయాయి. ఇటీవల ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి నిర్మాణాలు పట్టాలెక్కనున్నాయి. నిర్మాణాలు నిలిచిపోయిన అమరావతి కట్టడాల సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఏపీ ప్రభుత్వం ఐఐటీ మద్రాస్ కు అప్పగించింది. ఇక మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను, ఐఏఎస్ అధికారుల నివాసాలు అంచనా వేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది.

ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్ ల నుంచి ఇద్దరేసి ఇంజినీర్ల బృందాలు శుక్రవారం (ఆగస్టు 2న) అమరావతికి వచ్చాయి. నేటి నుంచి ఐఐటీ టీమ్స్ 2 రోజులపాటు అమరావతిలో పర్యటిస్తాయి. గతంలో చేపట్టి, మధ్యలోనే నిలిచిన ఆయా కట్టడాలను పరిశీలించి, వాటి సామర్థ్యం, నాణ్యతపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. రాజధాని అమరావతి పర్యటనలో భాగంగా సీఆర్డీయే (CRDA) అధికారులతో రెండు బృందాల్లోని ఐఐటీ ఇంజినీర్లు విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget