అన్వేషించండి

HCL in AP: ఏపీలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ, 15 వేల మందికి ఉద్యోగాలు

It Minister Nara Lokesh : హెచ్‌సీఎల్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ తో జరిగిన సమావేశంలో సంస్థ ప్రతినిధులు విస్తరణకు అంగీకరించారు.

HCL Company representatives Met Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత భారీగా పెట్టుబడులను ఆకర్షించే పనిలో నిగ్నమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు మరింత విస్తరణ చేసేందుకు ఆయా సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌ తో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు.

హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లిలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ వివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరో 15 వేల ఉద్యోగాలను కల్పించేందుకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్‌ సంస్థలో 4500 మందికి ఉద్యోగాలు లభించాయి. విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు మంత్రికి వెల్లడించారు. రెండో ఫేజ్‌లో భాగంగా నూతన కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. 

ప్రస్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా సేవలు

ఐటీ రంగంలో గత కొన్నాళ్లుగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మార్పులకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్‌సీఎల్‌ సంస్థ సిద్ధమవుతోంది. ఐటీలో అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వారు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్‌ సెన్సస్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌కు హామీ ఇచ్చారు.

విస్తరణకు కావాల్సిన కొన్ని అనుమతులను, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కోరారు. దీనిపట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో విస్తరణ దశగా ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వందలాది మంది నిరుద్యోగులకు మెరుగైన ఉపాధి అవకాశాలు ఈ సంస్థ విస్తరణతో లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత వేగంగా విస్తరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేందుకు ఆయన హామీని ఇచ్చారు. మంత్రితో సమావేశం పట్ల సంస్థ ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. 

విడతల వారీగా రాయితీలు విడుదల చేస్తాం..

మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత టిడిపి హయాంలో అనేక రాష్ట్రాలు పోటీ పడగా, తాను స్వయంగా వెళ్లి హెచ్‌సీఎల్‌ ఛైర్ పర్సన్ శివ్ నాడార్ తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని వెల్లడించారు. రికార్డు టైమ్ లో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం తనకు మంచి అనుభూతినిచ్చిందన్నారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారీ యువతకు 4500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్థత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదన్నారు. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయిందన్నారు. పూర్తిస్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని, అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమన్నారు. కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామని,  మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఐటిలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రతినిధులను అభినందించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget