అన్వేషించండి

Guntur News: జగన్‌కు విభజించి పాలించడం అలవాటైంది, బీసీ కార్పొరేషన్లన నామమాత్రం చేశారు: అచ్చెన్నాయుడు

Guntur News: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విభజించి పాలించడం అలవాటైందని అచ్చెన్నాయుడు విమర్శించారు. బీసీ కార్పొరేషన్లను నామమాత్రం చేశారని ఆరోపించారు.

Guntur News: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజల భాగస్వామ్యంతో రూపొందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయదశమి నాడు ముసాయిదా మేనిఫెస్టో విడుదల చేస్తామని, దానిపై ప్రజల్లో విస్తృత స్థాయిలో చర్చ జరిగాక ఎన్నికల సమయంలో అసలైన ప్రణాళిక ప్రవేశపెడతామని చెప్పారు. గుంటూరు టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఐక్య కార్యాచరణ సదస్సులో మాజీ మంత్రులు యనమన రామకృష్ణుడు, కొల్లు రవీంద్రతో పాటు పలువురు బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. 

'బీసీ కార్పొరేషన్లను నామమాత్రం చేశారు'

బీసీల సమగ్ర కుల గణన, వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీసీల ఐక్య కార్యాచరణ సదస్సులో నాయకులు చర్చించారు. ఎన్టీఆర్ వచ్చాకే బీసీలకు ప్రాధాన్యం వచ్చిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్టీ. రామారావు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. ఆ రిజర్వేషన్లను టీడీపీ హయాంలో చంద్రబాబు 34 శాతానికి పెంచారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విభజించి పాలించడం అలవాటైందని విమర్శించారు. 54 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగానే మిగిలాయని ఆరోపణలు చేశారు. బీసీల కుల గణన జరగాలని.. ఈ అంశంపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయాడు పేర్కొన్నారు. బీసీ జన గణన కోసం అంతా ఏకం కావాలని యనమన రామకృష్ణుడు సూచించారు. బీసీల ఐక్యత వర్ధిళ్లాలి అనే నినాదాన్ని నిజం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని అన్నారు. దాదాపు 144 కులాలు విడివిడిగా పోరాడితే ఏమీ సాధించలేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సర్కారును డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల మాదిరిగానే చట్ట సభల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పెరగాలని యనమల రామకృష్ణుడు ఆకాంక్షించారు.

వేమగిరిలో మహానాడుకు ముమ్మర ఏర్పాట్లు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వద్ద జరగనున్న మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమానికి నేతలు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 27వ తేదీన ప్రతినిధుల సభ, 28వ తేదీన మహానాడు బహిరంగ సభ జరగనుంది. వీటి కోసం వేర్వేరు వేదికలను సిద్ధం చేస్తున్నారు. 27న జరగబోయే ప్రతినిధుల సభకు 15 వేలకు మించి జనాభా హాజరు అవుతారని టీడీపీ పార్టీ అంచనా వేస్తోంది. అలాగే తరువాతి రోజు జరిగే మహానాడు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, తెలుగు దేశం అభిమానులు లక్షల్లో వస్తారని అంచనా. వీరి కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే ప్రతినిధుల సభ, మహానాడు కార్యక్రమాలకు వచ్చే అతిథులకు గోదావరి రుచులతో ఆత్మీయ ఆతిథ్యం పలకనున్నట్లు నాయకులు చెబుతున్నారు. టీడీపీ.. మహానాడు నుండే ఎన్నికల శంఖారావం పూరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరం రాజకీయ కేంద్రం లాంటిది. అక్కడి నుండే మహానాడు ద్వారా ఎన్నికల శంఖారావం పూరించడం శుభసూచకమని టీడీపీ నేతలు అంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Telugu TV Movies Today: ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Telugu TV Movies Today: ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
Saudi Arabia Snowfall: సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
Kitchen to Wellness : ఆరోగ్యం, చర్మ సంరక్షణకై ఇంటి చిట్కాలు.. వంటింట్లో దాగున్న మసాలా దినుసులు చేసే మేజిక్ ఇదే
ఆరోగ్యం, చర్మ సంరక్షణకై ఇంటి చిట్కాలు.. వంటింట్లో దాగున్న మసాలా దినుసులు చేసే మేజిక్ ఇదే
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
Embed widget