అన్వేషించండి

Andhra Pradesh News:వైసీపీకి షాక్ ఇచ్చిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌- ఏపీలో కూటమి తరపున ప్రచారం!

Telugu News: ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వైసీపీకి షాక్ ఇచ్చారు. ఏపీలో కూటమికి మద్దతుగా ప్రచారానికి సిద్ధం అవుతున్నారు.

Yarlagadda Lakshmi Prasad : వైసీపీకి విశ్వహిందీ పరిషత్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్‌ షాక్ ఇచ్చారు. మొన్నటి వరకు అధికార భాష సంఘ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఏపీలో కూటమికి మద్ధతుగా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీతో విభేదించిన ఆయన వైసీపీతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ విజయానికి తన వంతుగా ఆయన కృషి చేశారు. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆయన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్ధతుగా ప్రచారాన్ని చేయనున్నారు. ఈ మేరకు ఆయన పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి సంబంధించిన షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు.

హిందీతోపాటు భారతీయ భాషలు అభివృద్ధికి అండగా నిలుస్తానని ప్రధాని మోదీ భరోసా ఇచ్చినందునే ఎన్‌డీఏ కూటమికి విశ్వహిందీ పరిషత్‌ సంపూర్ణ సహకారాన్ని అందించేందుకు సిద్ధమైనట్టు యార్లగడ్డ ప్రకటించారు. ఈ మేరకు జాతీయ కార్యవర్గం తీర్మానించి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఏపీలోని కూటమి అభ్యర్థులు తరపున ప్రచారం చేయమని ఆదేశించింది. కార్యవర్గం తీర్మానం, ఆదేశాలు మేరకు గురువారం విజయవాడ పశ్చిమ, కైకలూరు, ఉండి శాసనసభతోపాటు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఆయన ప్రచారాన్ని చేపట్టనున్నారు. శుక్రవారం కూడా అనకాపల్లిలోని ఓ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం ధర్మవరం, రాజంపేట నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారాన్ని సాగిస్తారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ హిందీ భాష అభివృద్ధికి చేసిన సేవకుగాను కేంద్ర ప్రభుత్వం విశ్వహిందీ పరిషత్‌ జాతీయ అధ్యక్షుడిగా నియమించింది. 

నాటి నుంచి వైసీపీకి దూరం

గడిచిన ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేసిన యార్లగడ్ల ఆ ప్రభుత్వంలోని కీలక నాయకులతో సన్నిహితంగా మెలిగారు. జగన్‌ సీఎం అయిన తరువాత యార్లగడ్ల లక్ష్మీప్రసాద్‌ను ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు. కొన్నాళ్లపాటు ఆ పదవిలో పని చేసిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పర్యటించి తెలుగు భాష అభివృద్ధికి సంబంధించిన అనేక చర్యలు తీసుకునేందుకు అనుగుణంగా సమీక్షలు నిర్వహించారు. అయితే, రెండేళ్ల కిందట అధికార వైసీపీ ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రొఫెసర్‌ యార్లగడ్ల లక్ష్మిప్రసాద్‌ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరును తీసి వైఎస్‌ఆర్‌ పేరును పెట్టడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఆ తరువాత నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా యార్లగడ్ల లక్ష్మిప్రసాద్‌ ప్రచారం చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

iBomma: పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ కేసులో కొత్త ట్విస్ట్! రవి సినిమాలు పైరసీ చేయలేదని తేల్చిన  పోలీసులు!
పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ కేసులో కొత్త ట్విస్ట్! రవి సినిమాలు పైరసీ చేయలేదని తేల్చిన పోలీసులు!
Pawan Kalyan Palle Panduga: గ్రామలకు పల్లెపండుగ 2.0 తీసుకొచ్చిన పవన్ - రూ. 6787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
గ్రామలకు పల్లెపండుగ 2.0 తీసుకొచ్చిన పవన్ - రూ. 6787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
Karimnagar Check Dam Politics: కరీంనగర్‌లో చెక్ డ్యామ్ బ్లాస్టింగ్ కలకలం - ఇసుక మాఫియా పనేనని ఆరోపణలు
కరీంనగర్‌లో చెక్ డ్యామ్ బ్లాస్టింగ్ కలకలం - ఇసుక మాఫియా పనేనని ఆరోపణలు
Fake IPS: అవసరానికి అయితే IAS లేకపోతే IPS - ఎంత మోసం చేశావు గురూ !
అవసరానికి అయితే IAS లేకపోతే IPS - ఎంత మోసం చేశావు గురూ !
Advertisement

వీడియోలు

South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Iceland Cricket Tweet on Gautam Gambhir | గంభీర్‌ను ట్రోల్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్
Ashwin Tweet on Ind vs SA Test Match | వైరల్ అవుతున్న అశ్విన్ పోస్ట్
Rohit as ambassador of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 అంబాసిడర్‌గా రోహిత్
India vs South Africa Test Highlights | విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
iBomma: పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ కేసులో కొత్త ట్విస్ట్! రవి సినిమాలు పైరసీ చేయలేదని తేల్చిన  పోలీసులు!
పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ కేసులో కొత్త ట్విస్ట్! రవి సినిమాలు పైరసీ చేయలేదని తేల్చిన పోలీసులు!
Pawan Kalyan Palle Panduga: గ్రామలకు పల్లెపండుగ 2.0 తీసుకొచ్చిన పవన్ - రూ. 6787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
గ్రామలకు పల్లెపండుగ 2.0 తీసుకొచ్చిన పవన్ - రూ. 6787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
Karimnagar Check Dam Politics: కరీంనగర్‌లో చెక్ డ్యామ్ బ్లాస్టింగ్ కలకలం - ఇసుక మాఫియా పనేనని ఆరోపణలు
కరీంనగర్‌లో చెక్ డ్యామ్ బ్లాస్టింగ్ కలకలం - ఇసుక మాఫియా పనేనని ఆరోపణలు
Fake IPS: అవసరానికి అయితే IAS లేకపోతే IPS - ఎంత మోసం చేశావు గురూ !
అవసరానికి అయితే IAS లేకపోతే IPS - ఎంత మోసం చేశావు గురూ !
Fake Nandini Ghee racket: టీటీడీ కల్తీ నెయ్యి స్ఫూర్తి - ఏకంగా నందిని నెయ్యికే డూప్లికేట్ - కానీ వెంటనే దొరికేశారు !
టీటీడీ కల్తీ నెయ్యి స్ఫూర్తి - ఏకంగా నందిని నెయ్యికే డూప్లికేట్ - కానీ వెంటనే దొరికేశారు !
5 Reasons for Team India Defeat: గంభీర్ డిజాస్టర్ వ్యూహాలు సహా రెండో టెస్టులో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు
గంభీర్ డిజాస్టర్ వ్యూహాలు సహా రెండో టెస్టులో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు
CM Revanth Reddy: సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి
సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి
Ashu Reddy Photos: బాడ్మింటన్ కోర్టులో అషురెడ్డి... ఆ బ్యాక్ ఫోజ్ వెనుక కష్టం గురించి ఏం చెప్పిందో తెలుసా?
బాడ్మింటన్ కోర్టులో అషురెడ్డి... ఆ బ్యాక్ ఫోజ్ వెనుక కష్టం గురించి ఏం చెప్పిందో తెలుసా?
Embed widget