అన్వేషించండి

Defamation Notice: ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా... లీగల్ నోటీసులు పంపిన ఏబీవీ... క్షమాపణ చెప్పాలని డిమాండ్

వైసీపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ లో పరువురికి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పరువు నష్టం దావా లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పరువునష్టం దావా కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు లీగల్‌ నోటీసులు పంపారు. విజయసాయితో పాటు జగతి పబ్లికేషన్స్‌ ఎండీ సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి టీవీ ఈడీ వినయ్‌ మహేశ్వరి, సాక్షి పత్రిక ఎడిటర్‌ మురళి, ప్రింటర్‌-పబ్లిషర్‌ రామచంద్రమూర్తికి ఏబీ వెంకటేశ్వరరావు నోటీసులు ఇచ్చారు. వీరందరికీ ఏబీవీ జూలై 19న పరువునష్టం దావా నోటీసులు పంపారు. ఎన్నికల్లో రూ.50 కోట్ల తరలింపునకు ఎస్కార్ట్‌ ఇచ్చారనే ఆరోపణపై ఏబీవీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రూ.కోటి పరువునష్టం దావా కేసు వేస్తానని నోటీసుల్లో తెలిపారు.

2019 ఎన్నికల సమయంలో రూ. 50 కోట్ల తరలింపునకు ఎస్కార్ట్ ఇచ్చారనే ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. లేదంటే కోటి రూపాయాలు పరువు నష్టం దావా వేస్తానని ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఏబీవీ వర్సెస్ వైసీపీ టీడీపీ ప్రభుత్వ సమయంలో ఈ-ప్రగతి పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును జైలుకు పంపేందుకు ఈ ఒక్క కేసు చాలని గతంలో విజయసాయిరెడ్డి ఆరోపించారు. అప్పట్లో వీటికి సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అవి బయపడతాయని చెప్పారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.

అప్పట్లో ఈ-ప్రగతితో తమ కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయని విజయసాయి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన కుటుంబ సభ్యులకు వాటితో ఎలాంటి సంబంధం లేదని.. నిరాధార ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని గతంలో ప్రకటించారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావును సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేసిందని, ఈ మేరకు ఓ జీవోను జారీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఏబీవీపై ఉన్న ఆరోపణలు అన్నింటినీ ప్రత్యేకంగా కేంద్రానికి పంపినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌లో ఉన్నారు. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేశారు. అంతకు ముందు నుంచే ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వలేదు. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలపై ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఈ విషయం సుప్రీంకోర్టులో ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget