అన్వేషించండి

ఎన్టీటీపీఎస్‌లో మరో యూనిట్ లైన్ అప్- అందుబాటులోకి రానున్న 800మోగావాట్ల విద్యుత్

ఎన్‌టీటీపీఎస్‌లో స్టేజ్‌ 5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ఎనిమిదో యూనిట్‌ అనేక సవాళ్లు అధిగమించి ఈ స్థాయికి రావడంపట్ల ఏపీ జెన్‌కో అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఇబ్రహీంపట్నంలో గల డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (డాక్టర్‌ ఎన్‌టీటీపీఎస్‌)లో మరో యూనిట్‌ను లైట్‌అప్‌ చేసి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది హర్షధ్వానాల మధ్య ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏజీ జెన్‌కో ఛైర్మన్‌ విజయానంద్, మనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు కంప్యూటర్‌ బటన్‌ నొక్కిలైటఅప్‌ చేశారు.

స్టేజ్ 5లో 800మోగావాట్ల సామర్ధ్యంతో..
డాక్టర్‌ ఎన్‌టీటీపీఎస్‌లో స్టేజ్‌ 5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ఎనిమిదో యూనిట్‌ కోవిడ్‌ లాంటి కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి రావడంపట్ల ఏపీ జెన్‌కో అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. లైట్‌ అప్‌ చేసిన అనంతరం డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో కలిసి ఛైర్మన్‌ విజయానంద్, ఎండీ చక్రధర్‌ బాబు ప్లాంటులోని అనేక విభాగాలను పరిశీలించారు. ఆగస్టు నాటికి సీఓడీకి వీలుగా మిగిలిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజయానంద్ అన్నారు. ఇందుకు ఏపీ జెన్‌కో పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉందని బీహెచ్‌ఈఎల్, బీజీఆర్‌ ప్రతినిధులకు ఏపీ జెన్‌కో ఛైర్మన్‌ విజయానంద్, ఎండీ చక్రధర్‌ బాబు స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా మిగిలిన పనులు పూర్తి చేస్తామని, ఇందుకు తమ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని ఆయా సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. 

రోజుకు 105మిలియన్ యూనిట్లు..
ప్రస్తుతం రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఏపీ జెన్‌కో ప్రతిరోజూ సగటున 105 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. ప్రస్తుత వేసవిలో ఎన్నడూలేని విధంగా అనూహ్యంగా డిమాండు పెరిగినప్పటికీ రాష్ట్ర మొత్తం వినియోగంలో 40 నుంచి 45 శాతం విద్యుత్‌ను ఏపీ జెన్‌కో అందిస్తోంది. కొత్తగా లైట్‌అప్‌ చేసిన యూనిట్‌ ఆగస్టు నుంచి అందుబాటులోకి రాగానే రోజూ సగటున మరో 15 నుంచి 20 మిలియన్‌ యూనిట్లను జెన్‌కో అదనంగా సరఫరా చేయనుందని ఛైర్మన్‌ విజయానంద్, ఎండీ చక్రధర్‌ బాబు అధికారులతో నిర్వహించిన సమీక్షలో తెలిపారు.

ఇవి గొప్ప మైలురాళ్లు : ఛైర్మన్‌ విజయానంద్‌
ఏడాది కాలంలో 1600 మెగావాట్ల అదనపు సామర్థ్యంగల రెండు యూనిట్లు అందుబాటులోకి రావడమనేది ఏపీ జెన్‌కో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని ఛైర్మన్ విజయానంద్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల స్టేజ్‌ 2 యూనిట్‌ ను 2022లోనే ముఖ్యమంత్రి జగన్‌ జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు.  

ఆగస్టు నాటికి సీఓడీ : జెన్‌కో ఎండీ చక్రధర్‌ బాబు
 ట్రయల్‌ రన్‌లో బయటపడే లోటుపాట్లను సరిదిద్దుకుని, మిగిలిన పనులు త్వరతగతిన పూర్తి చేసి ఆగస్టు నాటికి స్టేజ్‌5 ప్లాంటు వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ) చేసేందుకు వీలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామని యూనిట్‌ 8ను త్వరగా అందుబాటులోకి తేవాలని ఎండీ చక్రధర్ బాబు అన్నారు. ప్రభుత్వ సహకారం వల్లే స్టేజ్‌5 లైట్‌ అప్‌ సాధ్యమైందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నందున వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసుకుని వాణిజ్య ఉత్పత్తికి శ్రీకారం చుట్టేలా ముందుకెళతామని చక్రధర్‌ బాబు తెలిపారు. 

సామర్ధ్యం ఇలా పెరుగుతుంది..
డాక్టర్‌ ఎన్‌టీటీపీఎస్‌లో 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తికి శ్రీకారం చుడితే ఏజీ జెన్‌కో విద్యుదుత్పాదన సామర్థ్యం 8789 మెగావాట్లకు పెరుగుతుంది. ప్రస్తుతం జెన్‌కో 5810 మెగావాట్ల థర్మల్, 1773.600 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పాదన సామర్థ్యం కలిగి ఉంది. ఎన్‌టీటీపీఎస్‌లో మరో రెండు నెలల్లో 800 మెగావాట్ల థర్మల్‌ యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తే జెన్‌కో థర్మల్‌ ఉత్పాదన సామర్థ్యం 8789 మెగావాట్లకు పెరుగుతుంది. దీని వలన రాష్ట్ర అవసరాలకు ఎంతో ఉపయోగకంగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ జెన్‌కో విద్యుదుత్పాదన పెరగడం రాష్ట్రానికి అన్ని విధాలా ప్రయోజనం. జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం ఎంత పెరిగితే అంత మోతాదులో రాష్ట్ర అవసరాల కోసం అధిక ధరలకు డిస్కమ్‌లు విద్యుత్‌ కొనాల్సిన అగత్యం తప్పుతుంది.  రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు వీలైనంత అధికంగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్‌కో ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే లోయర్‌ సీలేరులో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం రెండు అదనపు యూనిట్లను 2024 ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి తెచ్చే దిశగా శరవేగంగా పనులు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget