అన్వేషించండి

Emergency Alert: మీ ఫోన్‌లో ఎమర్జెన్సీ అలర్టె వచ్చిందా..? ఎందుకో తెలుసా..?

Emergency Alert: మీ ఫోన్‌లో ఎమర్జెన్సీ అలర్టె వచ్చిందా..? భారత ప్రభుత్వమే ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌ మెసేజ్‌ను దేశంలో పలు స్మార్ట్‌ఫోన్లకు పంపించింది.

భారత్‌లో చాలా మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు ఈరోజు  మధ్యాహ్నం ఒక ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. ముఖ్యంగా ఆండ్రాయిండ్‌ ఫోన్లకు సుమారు మధ్యాహ్నం 12.19 ప్రాంతంలో ఈ మెసేజ్‌ వచ్చింది. పెద్ద బీప్‌ సౌండ్‌, ఫ్లాష్ తో వినియోగదారులకు సందేశం వచ్చింది. దీంతో చాలా మంది ఈ మెసేజ్‌ ఏంటో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. ఏదైనా సైబర్‌ నేరగాళ్ల పని అయ్యిండొచ్చేమో అని కంగారు పడుతుండొచ్చు కూడా. అయితే అలా కంగారు పడాల్సిందేమీ లేదట. భారత ప్రభుత్వమే ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌ మెసేజ్‌ను దేశంలో పలు స్మార్ట్‌ఫోన్లకు పంపించింది. ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షించడంలో భాగంగా శాంపుల్‌ మెసేజ్‌స్‌ను ప్రజలకు పంపించినట్లు తెలుస్తోంది.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ నుంచి ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్ట్‌ చేసేందుకు శాంపుల్‌ మెసేజ్‌ వచ్చింది. తమకు ఎమర్జెన్సీ అలర్ట్‌ అంటూ మెసేజ్‌ వచ్చిందని, మరెవరికైనా ఇలా వచ్చిందా అంటూ పలువురు సోషల్‌మీడియాలో తమ ఫోన్లకు వచ్చిన సందేశం ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ విషయంపై సోషల్‌మీడియా వేదికగా నెటిజన్ల చర్చకు దారి తీసింది.

అయితే భూకంపాలు, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, సునామీలు, ఇతర విపత్తులేమైనా వచ్చినప్పుడు ప్రజలను తక్షణమే అలర్ట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. దీన్ని పరీక్షించడం కోసమే దేశవ్యాప్తంగా కొంతమందికి మెసేజ్‌ పంపించారు. ఇలాంటి టెస్ట్‌లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ నుంచి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. వేర్వేరు సమయాల్లో వేర్వేరు రీజియన్స్‌లో  ట్రయల్స్‌ చేస్తూ ఉంటుంది. ఇలాంటి అత్యవసర హెచ్చరికలు పంపించడంలో మొబైల్‌ ఆపరేటర్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు, ఇతర సమస్యలను అంచనా వేయడానికి ఇలాంటి టెస్ట్‌లు చేస్తుంటారు.

ఈ మెసేజ్‌లోనే దానికి సంబంధించిన వివరాలను కూడా ఇచ్చారు. భారత ప్రభుత్వానికి చెందిన టెలికమ్యూనికేషణ్‌ విభాగంలోని సెల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ పంపించిన నమూనా టెస్టింగ్‌ మెసేజ్‌ ఇది. దీనిని పట్టించుకోవద్దని సందేశంలో తెలిపారు. మీ నుంచి ఎలాంటి స్పందన అవసరం లేదని స్పష్టంచేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్‌-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షించేందుకే ఈ మెసేజ్‌ను పంపించామని తెలిపారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను హెచ్చరించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుందని మెసేజ్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్‌ మెసేజ్‌లు జులై 20, ఆగస్టు 17 తేదీల్లో కూడా వచ్చాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget