అన్వేషించండి

వైసీపీ శ్రేణులు ఖుషీ అయ్యే కార్యక్రమం- కుప్పం నుంచే షూరూ చేసిన జగన్

సీఎం జగన్ జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ వస్తున్నారు. అది కొనసాగిస్తూనే కార్యకర్తలతో కూడా మాటామంతి కార్యక్రమం స్టార్ట్ చేశారు.

175 సీట్లు గెలవాలని వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లకు టార్గెట్ ఫిక్స్‌ చేసిన సీఎం జగన్... తాను కూడా పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఇప్పుడు పార్టీకి కాస్త టైం కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే వివిధ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించిన జగన్... ఇప్పుడు క్రియాశీల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 

సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం నుంచి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముందుగా కుప్పం నియోజకవర్గం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అక్కడ పార్టీ బలాబలాలు, ప్రజల్లో ఉన్న టాక్, పథకాల అమలు అన్నింటిపై వారితో మాట్లాడనున్నారు. 
 
సీఎం జగన్ ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ వస్తున్నారు. అది కొనసాగిస్తూనే కార్యకర్తలతో కూడా మాటామంతి కార్యక్రమం స్టార్ట్ చేశారు. రోజుకో గంటసేపు కార్యకర్తల కోసం కేటాయించనున్నారు సీఎం. మొదటిరోజు కుప్పం  నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్.

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు అధినేత జగన్. పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కీలకం అని జగన్ ఎన్నోసార్లు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను నేరుగా కలవలేకపోయారు. దీంతో కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరిగింది. పార్టీని ఆధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన శ్రేణులకు అధినేతను కలవడం కష్టమైంది. దీంతో చాలా చోట్ల గత ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నట్లు జగన్‌ దృష్టికి వచ్చింది. 

కార్యకర్తలను అధినేత జగన్ పట్టించుకోవడం లేదన్న అపోహ తొలగించేందుకు ఇలా నేరుగా భేటీ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండటంతో కార్యకర్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.  

గురువారం నుంచి ప్రతిరోజూ సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకూ కార్యకర్తల కోసం సమయం కేటాయించారు జగన్. రోజూ 50 మందితో సీఎం భేటీ కానున్నారు. దీని కోసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ఎవరెవరిని కలవాలి... ఆ 50 మంది ఎవరు అనే బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు. గతంలో పార్టీ కోసం కష్టపడి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారిని గుర్తించారు. అలాంటివారి జాబితా పంపాలని సీఎం కార్యాలయం సూచింది.

ఒక్కొక్క కార్యకర్తతో నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం పాటు మాట్లాడనున్నారు సీఎం జగన్. వారితో మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరితో ఫొటో దిగానున్నారు జగన్. దీని ద్వారా కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి పోగొట్టడంతోపాటు వారిని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారు. ఒకవైపు జిల్లాల సమీక్షలు, మరోవైపు కార్యకర్తలను కలవడం ద్వారా పార్టీని గెలుపు బాట పట్టించేలా ముందుకెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Slumdog Teaser : స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
This Week Theatrical Releases : పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
Embed widget