అన్వేషించండి

వైసీపీ శ్రేణులు ఖుషీ అయ్యే కార్యక్రమం- కుప్పం నుంచే షూరూ చేసిన జగన్

సీఎం జగన్ జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ వస్తున్నారు. అది కొనసాగిస్తూనే కార్యకర్తలతో కూడా మాటామంతి కార్యక్రమం స్టార్ట్ చేశారు.

175 సీట్లు గెలవాలని వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లకు టార్గెట్ ఫిక్స్‌ చేసిన సీఎం జగన్... తాను కూడా పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఇప్పుడు పార్టీకి కాస్త టైం కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే వివిధ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించిన జగన్... ఇప్పుడు క్రియాశీల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 

సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం నుంచి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముందుగా కుప్పం నియోజకవర్గం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అక్కడ పార్టీ బలాబలాలు, ప్రజల్లో ఉన్న టాక్, పథకాల అమలు అన్నింటిపై వారితో మాట్లాడనున్నారు. 
 
సీఎం జగన్ ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ వస్తున్నారు. అది కొనసాగిస్తూనే కార్యకర్తలతో కూడా మాటామంతి కార్యక్రమం స్టార్ట్ చేశారు. రోజుకో గంటసేపు కార్యకర్తల కోసం కేటాయించనున్నారు సీఎం. మొదటిరోజు కుప్పం  నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్.

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు అధినేత జగన్. పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కీలకం అని జగన్ ఎన్నోసార్లు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను నేరుగా కలవలేకపోయారు. దీంతో కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరిగింది. పార్టీని ఆధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన శ్రేణులకు అధినేతను కలవడం కష్టమైంది. దీంతో చాలా చోట్ల గత ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నట్లు జగన్‌ దృష్టికి వచ్చింది. 

కార్యకర్తలను అధినేత జగన్ పట్టించుకోవడం లేదన్న అపోహ తొలగించేందుకు ఇలా నేరుగా భేటీ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండటంతో కార్యకర్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.  

గురువారం నుంచి ప్రతిరోజూ సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకూ కార్యకర్తల కోసం సమయం కేటాయించారు జగన్. రోజూ 50 మందితో సీఎం భేటీ కానున్నారు. దీని కోసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ఎవరెవరిని కలవాలి... ఆ 50 మంది ఎవరు అనే బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు. గతంలో పార్టీ కోసం కష్టపడి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారిని గుర్తించారు. అలాంటివారి జాబితా పంపాలని సీఎం కార్యాలయం సూచింది.

ఒక్కొక్క కార్యకర్తతో నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం పాటు మాట్లాడనున్నారు సీఎం జగన్. వారితో మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరితో ఫొటో దిగానున్నారు జగన్. దీని ద్వారా కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి పోగొట్టడంతోపాటు వారిని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారు. ఒకవైపు జిల్లాల సమీక్షలు, మరోవైపు కార్యకర్తలను కలవడం ద్వారా పార్టీని గెలుపు బాట పట్టించేలా ముందుకెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget