అన్వేషించండి

Andhra Pradesh: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు, అభివృద్ధి ప్రణాళికలపై సీఎం దిశానిర్దేశం

Chandra Babu: చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీ వెలికితీతపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

Chandra Babu: కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu)...ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరించనున్నారు. ఇప్పటికే అధికారుల బదిలీలు పూర్తిస్థాయిలో చేపట్టిన సీఎం...రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వారి ముందు ఉంచనున్నారు

నేడు కలెక్టర్ల సదస్సు
వైసీపీ(YCP) హయాంలో జరిగిన అక్రమాలు, సహజ వనరుల దోపిడీపై ప్రత్యేకంగా దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం వాటిని వెలికితీసి చట్టపరంగానే వారిపై చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే నేడు కలెక్టర్ల సదస్సులోనూ నాటి ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, YSR, అన్నమయ్య, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు గుర్తించారు. రెవెన్యూ సిబ్బంది ద్వారా వీటిల్లో జరిగిన అక్రమాలు బయటకు తీయాలని సీఎం చంద్రబాబు నేడు జరగనున్న కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు.  అలాగే వ్యవసాయ భూముల కన్వర్షన్ బాధ్యతలు సైతం కలెక్టర్లకు అప్పగించనున్నారు. అలాగే మదనపల్లె సబ్‌కలెక్టర్ దహానం కేసు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్లాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అప్పుడే పెట్టుబడిదారులు పరుగులు తీస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైల్వేప్రాజెక్టులు, పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్లకు నిర్దేశించనున్నారు.

గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అక్కడి ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే చేపట్టనుంది. ఆయా ప్రాంతాల్లో ఆధార్(Aadhar), రేషన్ కార్డు(Ration Card)లు,ఇల్లు, తాగునీటి వసతులు, రహదారులు సహా అన్ని అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఈనెల 7 నుంచి 20 వరకు సర్వే నిర్వహించనున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది.

మహిళలకు చేయూత
మహిళా సంఘాలను ఆర్థికంగా ఆదుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ...డ్వాక్రాసంఘాలకు ఈ-సైకిళ్లు అందించాలని నిర్ణయించింది.ముందుగా కుప్పం నియోజకవర్గంలో 300 మంది మహిళలకు 45 వేలు విలువ చేసే సైకిల్‌ను 9వేలకే అందిస్తున్నారు. 

సాగునీటి ప్రాజెక్ట్‌లపై దృష్టి
సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం...భారీ ప్రాజెక్ట్‌లే గాక చిన్నతరహా ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించనుంది. అలాగే ఏడున్నర లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేయాలని యోచిస్తోంది. డిజిటల్ విధానంలో పౌరసేవలు అందించేందుకు పీపీపీ విధానంలో ప్రత్యేక ప్రాజెక్ట్ తీసుకురానుంది. గత ఐదేళ్లలో పాడైపోయిన రహదారుల మరమ్మతులు సైతం వెంటనే చేపట్టాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించనున్నారు. రాజధాని ప్రాంతాలంలో ఇంకా సేకరించాల్సిన భూమిపైనా కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు.

సచివాలయంలో సదస్సు
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసం వద్ద ఉన్న ప్రజావేదికలోనే కలెక్టర్ల సదస్సు జరిగేది. కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో ఇప్పుడు సచివాలయంలోనే కలెక్టర్లతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం పదిగంటలకు సదస్సు ప్రారంభం కానుంది. చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రసంగించనున్నారు. అనంతరం విజన్ ఆంధ్ర-2047పై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం వివిధ శాఖలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం మరికొన్ని శాఖలపై చర్చిస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget