అన్వేషించండి

Chandrababu Open Letter: రేపటి నుంచి ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ’ షురూ - ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu Open Letter: తెలుగు దేశం పార్టీ గుర్తు అయిన సైకిల్ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమానికి, మరొకటి అభివృద్ధికి ప్రతీక అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

Chandrababu Open Letter: తెలుగు దేశం పార్టీ గుర్తు అయిన సైకిల్ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమానికి, మరొకటి అభివృద్ధికి ప్రతీక అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ’పై రేపటి నుంచి ప్రచారం కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ.. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు.. రాష్ట్ర ప్రజలందరినీ కలిసే ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం కావాలని కోరారు. అలాగే 2014 నుంచి 2019 మధ్య రెండంకెల వృద్ధితో దేశంలో అగ్రగామిగా ఉన్న నవ్యాంధ్రను.. వైసీపీ సర్కారు నాశనం చేసిందని ఆరోపించారు. కేవలం నాలుగున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అన్నదాతలకు గిట్టుబాటు ధరలు లేవని, మహిళలకు సాధికారత కల్పించలేదని వివరించారు. అసలు స్త్రీలకు రాష్ట్రంలో భద్రతే లేదని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ముఖ్యంగా నిరుద్యోగం పెరిగిపోయిందని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలపై ప్రతిరోజూ దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకే ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో పథకాలను ప్రకటించామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 

సెప్టెంబరు 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పార్టీ కార్యకర్తలు, నేతలు రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల ఆర్థిక స్థితి, రక్షణ, భవిష్యత్తు కోసం రూపొందించిన సూపర్స్ సిక్స్ పథకాల గురించి వివరించబోతున్నట్లు తెలిపారు. అలాగే వీటి వల్ల కలిగే లాభాలను కూడా తెలపబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ సమస్యలు, కష్టాలను పార్టీ నేతలతో చెప్పుకోవాలని అన్నారు. అలాగే ఆయా పథకాల అమలుకు సంబంధించి తన సంతకంతో కూడిన హామీ పత్రాన్ని ప్రజలకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రజలందరి భాగస్వామ్యం, మద్దతు చాలా అవసరం అని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
India vs New Zealand ODI : ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
Embed widget