అన్వేషించండి

Chandrababu Naidu: అమర్నాథ్ అక్కను దత్తత తీసుకున్న చంద్రబాబు- బాధిత కుటుంబానికి పది లక్షల సాయం

Chandrababu Naidu: వైసీపీ నాయకులు.. నేరుగా ఇళ్లలోకి ప్రవేశించి అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

Chandrababu Naidu: వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తేనే ప్రజాజీవితం కుదుట పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల బ్రష్టు పట్టిందని.. వైసీపీ పార్టీనీ బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెంలో హత్యకు గురైన అమరనాథ్ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థి అమర్నాథ్ ను అంత్యంత కిరాతకంగా హత్య చేయడం తనను ఎంతగానే కలచి‌వేసిందని అన్నారు. కరుడు కట్టిన నేరస్థుల మాదిరి అమర్నాథ్ ను సజీవ దహనం చేయడం వైసీపీ నాయకుల ఆగడాలకు పరాకాష్ఠగా తెలిపారు. పోలీసులకు సంఘటన జరిగిన వెంటనే తెలిపినప్పటికీ.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని చెప్పారు. కాలిన గాయాలతో ఉన్న అమర్నాథ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆక్షేపించారు. దారుణంగా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం నిందుతులు చేస్తే వారికి సహకరించేదుకు పోలీసులు ప్రయత్నించారని దుయ్యపట్టారు.

నేరుగా ఇళ్లలోకి వెళ్లి అత్యాచారాలు..

తన అక్కను వెంకటేశ్వర రెడ్డి వేదిస్తుంటే.. వేదించ వద్దన్ని అన్నందుకు అంతం చేసేంత ద్యైర్యం రావడానికి వైసీపీ నాయకులే కారణం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసి ప్రాణ భయంతో వారిని లొంగిపోయే విధంగా చేసుకొని చాలా ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు నేరుగా ఇళ్లలోకి వెళ్లి మహిళలపై అత్యాచారం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి ధారుణ ఘటనలు జరుగుతున్నా సీఎం స్పందించక పోవడం సైకో మనస్తత్వానికి పరాకాష్టని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కు ఆడపిల్లలు లేరా... వైసీపీ నాయకులకు ఇళ్లలో  మహిళలు లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు  వారికి కూడా జరిగితే ఇదే విధంగా ఉంటారా అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు పార్టీ నిలబడితే.. వైసీపీ నాయకులు శవరాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 

అమర్నాథ్ అక్కను దత్తత తీసుకున్న చంద్రబాబు

ఇలాంటి దారుణ ఘటనలు రాష్ట్రంలో  రోజు రోజుకూ పెరిగి పోవడానికి ప్రధాన కారణం గంజాయి వినియోగం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గంజాయి కల్చర్, గన్ కల్చర్ రాష్ట్రంలోకి ప్రవేశించాయని అన్నారు. అమర్నాద్ హత్యకు ప్రధాన కారణం స్థానిక  వైసీపీ నాయకుడు జేసీ రెడ్డి అని చంద్రబాబు ఆరోపించారు. ఈ  వ్యక్తి గంజాయి బ్యాచ్ ను మెయింటన్ చేస్తూ.. దాడులు చేసిన, హత్యలు చేసినా నేను చూసుకుంటానని ఇచ్చిన హామీల వల్లే ఈ ప్రాంతంలో అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. బాధిత కుటుంబానికి తాను పరిహారంగా పది లక్షలు ఇస్తున్నానని వివరించారు. కానీ తాను ఇచ్చే డబ్బు బాధితులకు అండ ఇవ్వదని.. పరిహారంతో సరిపెట్టకుండా మృతుడు అమర్నాథ్ అక్కను తాను దత్తత తీసుకుంటాన్నానని తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని వచ్చే ఎన్నికలలో ఈ పార్టీనీ బంగాళాఖాతంలో నిమజ్జనం చేయకపోతే రాష్ట్రనికి  భవిష్యత్తు ఉండదన్నారు. గంజాయి బ్యాచ్ ను కంట్రోల్ చేయడానికి  ఐరన్ హ్యాండ్ అవసరం అని ఆ నేర్పరి వైసీపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఉదయం 5 గంటలకు దారుణ  సంఘటన జరిగితే తాపీగా 10 గంటలకు సీఐ వచ్చాడని.. భవిష్యత్తులో ఆ సీఐని వదిలి పెట్టబోనని తెలిపారు. ఎక్కడ ఉన్నా రేచుకుక్కలా వెంటాడాతానని స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget